
అయితే ఈ సారీ జరిగే ఉప ఎన్నికలు వైఎస్కుటుంబంతో ఏమా త్రం సంబధం, ప్రభావంలేని నియోజకవర్గాలు కావటంతో జగన్కు తొలిపరీక్ష పెట్టబోతున్నాయి. ఉప ఎన్నికలో బరిలోకి దిగబోతున్న నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి కోవూరుకు పాత కాపే అయినప్పటికీ పార్టీలరంగులే మారిపో యాయి. తెలుగుదేశంపార్టీలో ఉంటూనే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ అభిమాని గా మారిన ప్రసన్న జగన్ వర్గంలో చేరిపో యారు. తెలుగుదేశంపార్టీకి, శాసనస భసభ్యత్వానికి రాజీనామాచేసిన ప్రసన్న వైఎస్ఆర్కాంగ్రెస్ పార్టీ అభ్యర్దిగా ఉప ఎన్నికల రంగంలోకి దిగారు. రాజకీయల్లో ప్రత్యేకించి ఉప ఎన్నికల పోటీలో గెలుపు ఓటములు అభ్యర్థులకు సహజమే అయినా వాటి ప్రభావం అభ్యర్థులకంటే పార్టీలపైన తీవ్రపభావం చూపుతుందం టున్నారు.

వైఎస్ఆర్కాంగ్రెస్ పార్టీకి ఉప ఎన్నికల ఫలితాలే పార్టీ మనుగడకు జగన్ ఇమేజికి సూచికలుగా నిలవనున్నాయని రాజకీయవిశ్లేషకులు చెబుతున్నారు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు కోవూరు తోపాటు మరికొన్ని నియోజకవర్గాల్లో జరుగుతున్నప్పటికీ కోవూరుకు, మిగిలిన వాటికి చాల తేడా ఉందంటున్నారు. ప్రాంతీయ ఉద్యమాలు జరుగుతున్న నేపద్యంలో వచ్చిన ఉప ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతంలో జరిగే ఉపఎన్నికలు ప్రత్యేక రాష్ట్ర సెంటిమెంట్తో ముడిపడి ఉన్నాయంటున్నారు. అదే సీమాంధ్ర ప్రాంతంలో కోవూరు నియోజకవర్గ ఉప ఎన్నికలు అందుకు పూర్తి బిన్నంగా భావిస్తున్నారు. ఏ సెంటిమెంట్ ప్రభావం అంతగాలేకుండా జరుగుతున్న కోవూరు ఉప ఎన్నికలు కాంగ్రెస్, తెలుగుదేశంతో పాటు వైఎస్ఆర్ పార్టీకి కూడా పరీక్షేనని చెబుతున్నారు. అయితే మిగిలిన పార్టీలకంటే జగన్కే కోవూరు ఉప ఎన్నికలు పెద్ద సవాలుగా మారుతున్నాయంటున్నారు. ఈ ఉప ఎన్నికల ఫలితా లనుబట్టే వ్యక్తిగతంగా జగన్ ఇమేజితోపాటు పార్టీ అధ్యక్షుడిగా ఆయన దీక్షాదక్షతలు స్పష్టంకానున్నాయి
No comments:
Post a Comment