online marketing

Sunday, November 27, 2011

పోటేత్తిన కైవల్యా..

నెల్లూరు :గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సైదాపురం కైవల్యానది ఉధృతరూపం దాల్చుతుంది. వరదనీరు గంటగంటకు పెరుగుతుండటంతో మండల ప్రజలు భయం గుప్పిట్లో వణికిపోతున్నారు. ఈనది సమీపంలో ఉన్న చప్టాపై 8అడుగుల ఎత్తున నీరు ప్రవహిస్తుండటంతో గూడూరు- రాజంపేట రహదారి పూర్తిగా మూసుకుపోయింది. దీంతో 45 గ్రామాలతో పాటు రాపూరు, డక్కిలి మండలాల ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. ఈ మార్గం గుండా వ్యాపారస్తులు పలు ఇబ్బందులకు గురయ్యారు.

తక్కువ ఛార్జీలతో గూడూరు చేరాల్సిన వీరు ప్రత్యామ్నాయంగా రెట్టింపు ఛార్జీలతో సైదాపురం నుండి పొదలకూరు చేరాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారు వాపోయారు. కైవల్యానది రెండోవ రోజుకు చేరడంతో ప్రజలు భయాందోళనలకు గురౌతున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్‌ఐ
నాగరాజు గట్టి చర్యలు తీసుకున్నారు.
చినుకుపడితేనే భయమేస్తుంది: స్థానికుడు చెంచయ్య
చిన్నపాటి వర్షానికే కైవల్యానది ఉధృతంగా ప్రవహిస్తుంది.. దీంతో గూడూరుకు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నాము. వర్షాకాలంలో పిల్లలు పాఠశాలలకు వెళ్లాలంటే భయాందోళనలకు గురౌతున్నారు.

ప్రతి ఏడాది తిప్పలు తప్పవు: స్థానికుడు సిద్ధయ్య
ప్రతి ఏడాది కైవల్యానది చిన్నపాటి వర్షానికే పొంగి పొర్లడంతో తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh