online marketing

Sunday, December 26, 2010

కలర్‌పుల్‌ క్రిస్మస్‌

నెల్లూరు: రంగు రంగుల దీపాలు, బెలూన్లు, వెలుగులు విరజిమ్మే కొత్త రంగుల ప్రార్థనా మందిరాలు, కళకళ లాడే కొత్త వస్త్రాలతో క్రైస్తవులు కలర్‌పుల్‌గా క్రిస్మస్‌ వేడుకలు శనివారం భక్తిశ్రద్ధలతో సాగాయి. క్రీస్తు జనన సందేశాన్ని తెలిపే భక్తిగీతాలు ప్రత్యేక ఆకర్షణగా, ప్రార్థనా మందిరాలో క్రిస్మస్‌ ఆరాధనలు ఘనంగా జరిగాయి. నగరంలో ప్రతిష్టాత్మకమైన డౌనీహాల్‌ బాప్టిస్ట్‌ చర్చిలో సంఘ కాపరి రెవ.గంగిపోగు పీటర్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో క్రిస్మస్‌ సారాంశాన్ని వివరించారు. అల్లకల్లోల ప్రపంచంలో ఏసుక్రీస్తు ప్రబోధాలు శాంతిని కలిగిస్తాయని అన్నారు. ఈ సందర్భంగా చర్చి గాయక బృందం ఆలపించిన గీతాలు ప్రత్యేకాకర్షణగా నిలిచాయి. 

మధ్యాహ్నం కేంద్ర కారాగారంలోని ఖెైదీలను సంఘ సభ్యులు సందర్శించి వారికి క్రిస్మస్‌ కీర్తనలను, సందేశాలను అందించారు. ఈ కార్యక్రమాల్లో సంఘ అధ్యక్షులు టి.హేమంత్‌కుమార్‌, కార్యదర్శి కెఐ దేవానందం, కోశాధికారి జిబి భాస్కర్‌రావు, గాయక బృంద సభ్యులు పాల్గొన్నారు. స్థానిక బోసుబొమ్మ వద్ద గల లోన్‌స్టార్‌ బాప్టిస్ట్‌ చర్చి మొదటి సర్వీసులో రెవ.కంచర్ల ప్రభుదాస్‌, రెండవ సర్వీసులో రెవ.ఎస్‌.విజయరత్నం, 3వ సర్వీసులో రెవ.ప్రసాద్‌లు క్రిస్మస్‌ సందేశాలు అందించారు. అధిక సంఖ్యలో క్రైస్తవులు ప్రత్యేక ఆరాధనలో పాల్గొన్నారు. స్థానిక సంతపేటలోని రోమన్‌ కేథలిక్‌ కెథడ్రిల్‌, ఫత్తేఖాన్‌పేట పునీత కానుక మాత చర్చిలో వేకువ జామునుంచే ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు.

రోమన్‌ కేథలిక్‌ క్రైస్తవులు అధికంగా ఉన్న ఈ ప్రాంతంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో బాలయేసును, కన్నె మరియను పూజించారు. మూలాపేట బాప్టిస్ట్‌ సంఘంలో రెవ.విల్సన్‌, బట్వాడిపాలెం బాప్టిస్ట్‌ సంఘంలో రెవ.థామస్‌రాజ్‌ల ఆధ్వర్యంలో ప్రత్యేక ఆరాధనలు నిర్వహించారు.దర్గామిట్ట సాల్వేషన్‌ ఆర్మీ, వేదాయపాలెం బాప్టిస్ట్‌ చర్చి, పొదలకూరురోడ్‌ యునెైటెడ్‌ బాప్టిస్ట్‌ చర్చిలతో పాటు నగరంలోని పలు క్రైస్తవ ప్రార్థనా మందిరాల్లో క్రిస్మస్‌ ప్రత్యేక ఆరాధనలు నిర్వహించారు. 

నగర రహదారుల అభివృద్ధికి రూ.6కోట్ల మంజూరు

నెల్లూరు: నగరంలో లెైలా తుపాన్‌ తాకిడికి దెబ్బతిన్న రహదారుల అభివృద్ధికి రూ.6కోట్లు మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. శనివారం నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లెైలా తుపాన్‌ వలన నగరంలో కొన్ని రోడ్లు దెబ్బతిన్నాయనీ, తాను మున్సిపల్‌ శాఖా మంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో రూ.83కోట్లు మంజూరు చేయగా, ఒక్క నెల్లూరునగరానికే ఆరు కోట్లు మంజూరు చేశామన్నారు. 18వ డివిజన్‌లోని 2.53 కోట్ల పనులు పూర్తి చేయడం జరిగిందన్నారు.నెల్లూరు పట్టణానికి గత ఒకటిన్నరేడాది కాలంలో రూ53.20కోట్ల నిధులు మంజూరు చేసినట్లు మంత్రి గుర్తుచేశారు. 123 కోట్లతో సమ్మర్‌ స్టోరేజి ట్యాంక్‌ పనులను పూర్తిచేశామన్నారు. 
పెైపెలెైన్‌ పొడిగింపు ఒక్క నెలలో పూర్తిస్థాయిలో పూర్తిచేస్తామన్నారు. దీని కోసం మరో 20కోట్లు అదనంగా మంజూరు చేసి రిజర్వాయర్‌ పెైపులెైన్ల కోసం టెండర్లు పిలిచామన్నారు. స్థానిక ఎమ్మెల్యేల కోరిక మేరకు 14.5కోట్లను మంజూరు చేశామనీ, మరో ఏడు కోట్లు రోడ్ల కోసం త్వరలో మంజూరు చేస్తామని తెలిపారు. కొత్త బడ్జెట్‌లో నగర డ్రైనేజీ కోసం 450 కోట్ల నిధులను మంజూరు చేసి సిఎం, కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రుల చేతుల మీదుగా శంఖుస్థాపన చేయించనున్నట్లు వెల్లడించారు.

అంతక్రితం స్థానిక సండేమార్కెట్‌ సెంటర్‌లో 15.77 లక్షలతో నిర్మించనున్న సిమెంటు రోడ్‌ పనులకు మంత్రి శంఖుస్థాపన చేశారు. అలాగే 27వ డివిజన్‌లోని గాయత్రినగర్‌ 4వ వీథిలో రూ.10.13లక్షలతో నిర్మించనున్న సిమెంట్‌ రోడ్‌, డ్రైనేజీ పనులకు మంత్రి శంఖుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నగర, రూరల్‌ ఎమ్మెల్యేలు ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి, ఆనం వివేకానందరెడ్డి, అదనపు జెసి టి.సీతారామయ్య, నగర కమిషనర్‌ టిఎస్‌ఆర్‌ 
sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh