online marketing

Wednesday, December 5, 2012

తీర ప్రాంత ప్రజలు క్షణం..క్షణం భయం..భయంగా

వరుణుడు ఎట్టికేలకు జిల్లా ప్రజానీకంపై కరుణ చూపారు. జిల్లాలో ఎక్కడ చూసిన భారీ వర్షాలకు ఆదివారం అర్ధరాత్రి నుండి వరుణుడు కరుణ చూపడంతో వర్షాలు ఆశించిన స్థాయిలోనే కురుస్తున్నాయి. జిల్లాలోని రైతాంగం ఆనందానికి అవదులు లేకుండా పోతున్నాయి. అన్ని చెరువులు నేడు కొత్త నీరు జలకళతో కళకళలాడుతున్నాయి. వాగులు, వంకలు పరవళ్ళు తోక్కుతూ పారుతున్నాయి. నగరంలోని అన్ని ప్రధాన రహదారులు జలమయంగా మారాయి. దీనితో వాహన చోదకులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ముఖ్య రహదారులు భారీ వర్షాలకు దెబ్బతిన్నాయి. మంగళవారం ఉదయం నుండి వర్షాలు అధిక శాతంలో కురుస్తుండడంతో సామాన్య ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 

మూడు రోజలుగా కురుస్తున్న వర్షాలకు జిల్లాలో తడ అత్యధికంగా 2.10 సెంటీ మీటర్లు నమోదు అయ్యింది. అదేవిధంగా అత్యల్పంగా ఉదయగిరిలో 1.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనది. మూడు రోజలుగా కురుస్తున్న వర్షాలకు జిల్లా అంతటా విస్తార ంగా వర్షాలు కురిశాయి. నగరంలోని అన్ని ప్రదానా రహదారులు జలమయంగా మారాయి. జిల్లాలోని అన్ని ప్రధానా రహదారులు దెబ్బ తిన్నాయి. భారీగా కురుస్తున్న వర్షాల నుండి ఇప్పటికే వేసుకొన్న నారుమళ్ళును కాపాడుకొవడానికి రైతులు నానాకష్టాలు పడ్డారు. తీర ప్రాంత ప్రజలు క్షణం..క్షణం భయం..భయంగా గడిపారు. 

భారీ వర్షాలకు పెరుగుతున్న అలల ఉదృతీకి తోడు, ఈదురు గాలులకు ప్రజలు తీవ్ర భయాదోళనకు లోనైయారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఎటువంటి కూలి పనులు లేక కూలీలు పూట గడవక అవస్థలు ఎదుర్కొన్నారు. కొన్ని సమస్యత్మాక గ్రామాలకు ఆర్టీసి అధికారులు బస్సు సర్విసులను నిలిపివేశారు. భారీ వర్షాలకు జిల్లాలోని కొన్ని చిన్నచిన్న బ్రిడ్జిలు, చప్టాలు స్వల్పంగా దెబ్బతినడంతో రాకపోకలకు అంతరాయం కల్పింగింది. నగరంలో చిన్న చిన్న వ్యాపారులు చేసుకొనే వారు ఈ వర్షానికి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అప్పు చేసి కొన్న సరుకులు అమ్ముడుపోకా లభోదిభోమంటూన్నారు. నగరంలోని ఆత్మకూరు, విజయమహల్‌గేల్‌, మాగుంటలేఅవుట్‌ అండర్‌ బ్రిడ్జీలలో నీరు చేరడంతో వాహన రాకపోకలకు అంతారాయం కల్గింది.నగరంలోని ఆర్‌డిఒ, తహసిల్దార్‌ కార్యాలయాలు రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి ఉరుస్తున్నాయి. ముఖ్యంగా ఆర్‌డిఒ కార్యాలయం లోపలి గోడలు కొన్ని చోట్ల పగుళ్లు ఇచ్చివుండడంతో కార్యాలయంలోకి వర్షపు నీరు ప్రవహిస్తోంది. దీంతో కార్యాలయంలోని పలు ఫైళ్లు తడుస్తున్నట్లు తెలుస్తోంది. పురాతన కట్టడం కాబట్టి గోడలు పగుళ్లు ఇచ్చి కొద్దిపాటి చినుకు పడితే వర్షపునీరు కార్యాలయం లోపలికి గోడల నుంచి ప్రవేశిస్తున్నాయి. దీంతో సిబ్బంది అనేక ఇబ్బందులకు గురికాక తప్పడం లేదు. అలాగే తహసిల్దార్‌ కార్యాలయం ఎదుట వర్షపు నీరు నిల్వ ఉండడంతో ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. దూరప్రాంతాల నుంచి తమ సమస్యలను అధికారుల వద్ద విన్నవించు కునేందుకు తరలి వస్తుండడంతో వారు ఈ ప్రాంతంలో పలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి ఆర్‌డిఒ కార్యాలయంలో ఉన్న స్వల్ప సమస్యను తీర్చాల్సిన అవసరం ఎంతైనా వుంది. అలాగే ప్రాంగణంలో వర్షపు నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా వుంది.
sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh