online marketing

Wednesday, April 18, 2012

పిల్లలు లేనివారు దత్తత తీసుకునేందుకు దరఖాస్తు

నెల్లూరు : సమాజంలో కన్నతల్లిదండ్రుల నిర్లక్ష్యానికి గురై అనాథలుగా వదిలేసిన పిల్లలను గుర్తించి వారిని ఆదరించాలని జిల్లా కలెక్టర్‌ బి.శ్రీధర్‌ పేర్కొన్నారు. బుధవారం స్థానిక కలెక్టర్‌ బంగళాలో ఐసిబిఎస్‌ సంస్థ ఆధ్వర్యంలో పిల్లలు లేనివారికి దత్తత కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ తన కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న రమణయ్య, దొరసానమ్మ దంపతులు అనాథ ఆడబిడ్డను దత్తత తీసుకోవడం అభినందనీయ మన్నారు. వారు ఆ అనాథ బిడ్డను పోషించి ఇతరులకు ఆదర్శంగా నిలవాలన్నారు. 

జిల్లాలో ఐదేళ్ల లోపు అనాథ పిల్లలను గుర్తించి వారిని శిశు గృహంలో చేర్పిస్తామని, పిల్లలు లేనివారికి దత్తత ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ దత్తత స్వీకారం ఐసిడిఎస్‌ ద్వారానే జరుగుతుందని, ఎవరైనా పిల్లలు లేనివారు దత్తత తీసుకునేందుకు దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు. దరఖాస్తు చేసుకున్న దంపతులకు సీరియల్‌ ప్రకారం ఇవ్వడం జరుగుతుందని, ఇప్పటివరకు ఐదుగురు అనాథలను దత్తత ఇవ్వడం జరిగిందని, వారిలో ముగ్గురు మగపిల్లలు, ఇద్దరు ఆడ పిల్లలని తెలిపారు. 

Tuesday, April 17, 2012

ఉషారాణితో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా..

lovers in nellore
నెల్లూరు: నెల్లూరు లో  ప్రేమించి పెళ్లిచేసుకున్నాం, తల్లిదండ్రులనుంచి రక్షణ కల్పించాలని ఓ ప్రేమజంట మంగళవారం రాత్రి ఎస్పీ బి.వి రమణకుమార్‌ను ఆశ్రయించింది. నగరంలోని నేతాజీనగర్‌కు చెందిన శశికాంత్ కర్నూలులో ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈక్రమంలో ఉషారాణితో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది.

అయితే ఇరువురి కులాలు వేరు కావడంతో తల్లిదండ్రులు తమ ప్రేమను ఒప్పుకోరని భావించిన ప్రేమికులిద్దరూ ఈనెల 11వ తేదీన ఇంట్లోనుంచి పారిపోయి ప్రకాశం జిల్లా కొత్తపట్నంలోని బిలీవర్స్ చర్చిలో వివాహం చేసుకున్నారు. అనంతరం నెల్లూరుకు చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఉషారాణి తల్లిదండ్రులు మంగళవారం సాయంత్రం నెల్లూరుకు చేరుకుని శశికాంత్‌తో ఘర్షణకు దిగారు. దీంతో ప్రేమికులిద్దరు జరిగిన విషయాన్ని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లడంతో ఎస్పీ వారికి రక్షణ కల్పించాలని ఐదోనగర సెక్టార్ ఒన్ ఎస్సై శ్రీనివాసులరెడ్డిని ఆదేశించారు. ఎస్సై కేసు పరిశీలిస్తున్నారు.

స్థానికులంతా గుమికూడి ఈ తతంగాన్ని వేడుకలా చూశారేకాని, ఎవరూ ముందుకొచ్చి అడ్డుకోలేదు

నెల్లూరు : నెల్లూరు పట్టపగలు నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తిపై దాడి చేసి దోపిడీకి పాల్పడిన సంఘటన కుసుమ హరిజనవాడ వద్ద మంగళవారం చోటు చేసుకుంది. వివరాలిలా వున్నాయి. గుడిపల్లిపాడుకు చెందిన కేటరింగ్‌ సెంటర్‌ నిర్వాహకుడు బత్తెన మల్లికార్జున మంగళవారం మధ్యాహ్నం వంటకాలను వాహనంలో పెట్టుకుని నగరంలోని హోటళ్లకు సరఫరా చేసేందుకు రోజూ మాదిరిగానే బయలుదేరాడు. వంటకాల వాహనంతో వస్తున్న మల్లికార్జునను నగర శివారు ప్రాంతమైన కుసుమహరిజనవాడ వద్దకు వచ్చేసరికే మణి, బాబు అనే ఇద్దరు వ్యక్తులు వాహనానికి అడ్డుగా వచ్చారు. వాహనాన్ని నిలిపిన మల్లికార్జునను డబ్బులు కావాలంటూ బెదిరించారు. వారిరువురూ మద్యం మత్తులో ఉండడంతో ఎందుకొచ్చిన బెడద అనుకుని మల్లికార్జున వారికి వంద రూపాయలను ఇచ్చేందుకు ప్రయత్నించాడు. 

దీంతో వారు వంద ఇస్తావా అంటూ ఇంకా డబ్బులు కావాలని అతనిపై దాడి చేసి కొట్టసాగారు. స్థానికులంతా గుమికూడి ఈ తతంగాన్ని వేడుకలా చూశారేకాని, ఎవరూ ముందుకొచ్చి అడ్డుకోలేదు. ఇంతలో అటుగా వస్తున్న మఫ్టీ పోలీసులు విషయాన్ని గమనించి అక్కడకు వెళ్లి దాడిచేస్తున్న వారిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. దీంతో వారిలో ఒకడు తప్పించుకుని పారిపోగా, మరొక వ్యక్తిని పోలీసులు పట్టుకుని రెండవ నగర పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించారు. బాధితుని ఫిర్యాదు మేరకు రెండవ నగర ఎస్‌ఐ కిషోర్‌బాబు కేసు నమోదు చేసి మరో నిందితుడి కోసం వెతుకులాట ప్రారంభించారు

Monday, April 16, 2012

ఆనం వివేకా యువకుని వలె కేరింతలు కొడుతూ అందరిని పలకరిస్తూ రిక్షా తొక్కడం..

నెల్లూరు : ప్రజాపథంలో భాగంగా నెల్లూరు నగర, రూరల్‌ ఎమ్మెల్యేలు ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి, ఆనం వివేకానందరెడ్డిలు సోమవారం మధ్యాహ్నం మండుటెండలో గిరిజనులతోపాటు చెక్కరిక్షా ఎక్కి ర్యాలీలో పాల్గొనడం విశేషం. జడ్పీ స్కూల్‌ నుంచి చెక్క రిక్షాలో ర్యాలీగా నేతాజీనగర్‌ 8వ వీధికి చేరుకున్నారు. ఆనం వివేకానందరెడ్డి పార్టీ నాయకులను ఎక్కించుకుని యువకుని వలె కేరింతలు కొడుతూ అందరిని పలకరిస్తూ రిక్షా తొక్కడం అందరినీ అబ్బురపరచింది. సేట్లు తలకు చుట్టే తలపాగా ధరించి పక్కన కార్యకర్తలతో చమత్కరిస్తూ ఎన్నికల ప్రచారం వలె ఆయన రిక్షా తొక్కుతూ వస్తుంటే కార్యకర్తల్లో నూతనోత్సాహం కనిపించింది. 
అక్కడున్న విద్యార్థులను పలకరించి సమస్యలేవైనా ఉంటే చెప్పండి, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. 

ప్రతి ఒక్కరి వద్ద తన నెంబరు ఉండాలని, ఫోన్‌ చేస్తే స్పందిస్తానని, మీలో ఒక్కడినని వివేకా చెప్పారు. వివేకా రిక్షా తొక్కుతుండడంతో పోలీసులు రోడ్డుపై ట్రాఫిక్‌ ఉండడంతో పరుగులు తీశారు. అలాగే అధికారులు ఎమ్మెల్యేలను అనుసరిస్తూ వచ్చారు.

Sunday, April 15, 2012

మద్యంకు బానిసై చెడు వ్యసనాలకు అలవాటు పడి నిత్యం తల్లి,తండ్రి,సోదరిని...

వెంకటగిరి పట్టణంలోని తోలిమిట్టలో శనివారం రాత్రి అనుమానా స్పద స్థితిలో మృతి చెందిన టీవెంకటేష్(18) కేసులో మృతుడి తండ్రి టి.రమణయ్యను ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు.. వెంకటేష్ మద్యంకు బానిసై చెడు వ్యసనాలకు అలవాటు పడి నిత్యం తల్లి,తండ్రి,సోదరిని వేధిస్తుండేవాడు. 

ఈ నేపథ్యంలో శనివారం రాత్రి మద్యం మత్తులో వెంకటేష్ కుటుంబ సభ్యులతో తీవ్రస్థాయిలో గోడవకు దిగాడు. సహించలేని తండ్రి రమణయ్య కర్రతో వెంకటేష్‌ను కొట్టాడు. తలకు గాయం బలంగా తగలడంతో వెంకటేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆదివారం ఉదయం వెంకటగిరి సీఐ అబ్దుల్‌కరీం,ఎస్సై అన్వర్‌బాషా సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. రమణయ్యను అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

గర్భిణి అని చూడకుండా వారు ఆమెపైనా దాడి...

నెల్లూరు: గర్భిణిపై దాడి చేసినా పోలీసులు పట్టించుకోని సంఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సేకరించిన సమాచారం మేరకు.. ముకుందాపురానికి చెందిన ఎన్. శ్రీనివాసులరెడ్డికి అదే ప్రాంతానికి చెందిన హనుమంతరావుతో స్థల వివాదం ఉంది. ఈ విషయమై ఇరువురు కోర్టును ఆశ్రయించారు. వివాదం కోర్టులో ఉన్న సమయంలో శనివారం హనుమంతరావు శ్రీనివాసులరెడ్డి స్థలంలోకి వెళ్లేందుకు యత్నించాడు.

శ్రీనివాసులరెడ్డి అడ్డుకోవడంతో కోపోద్రిక్తుడైన హ నుమంతరావు తన కుటుంబసభ్యులతో కలిసి శ్రీనివాసులరెడ్డిపై దాడిచేశాడు. కళ్ల ఎదుట భర్తపై దాడిచేస్తుండడంతో సహించలేని సుహాసిని అడ్డుకునే ప్రయత్నం చేసింది. గర్భిణి అని చూడకుండా వారు ఆమెపైనా దాడిచేశారు. అడ్డొచ్చిన మరో ఇద్దరు మహిళలపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ విషయమై బాధితులు రెండోనగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వారిని పట్టించుకోలేదు. పెపైచ్చు ఎక్కువ మాట్లాడితే ఇరువర్గాలపై కేసులు కడుతామని హెచ్చరించారు.
బాధితులు చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి వెళ్లి జరిగిన విషయాన్ని హాస్పిటల్ ఔట్‌పోస్టు సిబ్బందికి ఫిర్యాదు చేశారు. అప్పటికే సుహాసిని పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో ప్రభుత్వ వైద్యులు మెరుగైన చికిత్స కోసం జూబ్లీ ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. ఆమె జూబ్లీ ఆస్పత్రిలో చికిత్స పొంది ఇంటికి వెళ్లిపోయింది. దాడిచేసిన వారు అధికారపార్టీ ఎంఎల్‌ఎ అనుచరులు కావడంతో పోలీసులు కేసునమోదు చేయడంలేదని బాధితులు ఆరోపించారు.బాధితులు తమకు జరిగిన నష్టం గురించి పోలీసులకు తెలిపినప్పటికి వారికి న్యాయం చేయకపోగా తాము చెప్పినట్లు వినకపోతే ఇరువర్గాలపై కేసులు పెడుతామని హెచ్చరించడం సిగ్గుచేటన్నారు. రెండోనగర పోలీసులు అధికారపార్టీ నేతల అడుగులకు మడుగులొత్తుతూ బాధితులకు న్యాయం చేయడం లేదని, ఈ విషయమై తమ పార్టీ ఆధ్వర్యంలో డీజీపీని కలిసి స్వయంగా ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.

సౌజన్యతో ఫోన్లో పరిచయం ఏర్పడింది. అదికాస్త ప్రేమగా...

నెల్లూరు : ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త తల్లిదండ్రుల మాట విని తనను నిరాకరించడంతో ఓమహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన నెల్లూరు ప్రధాన రైల్వేస్టేషన్‌లో శనివారం రాత్రి చోటుచేసుకుంది. ఆమె ప్రయత్నాన్ని ప్రయాణికులు అడ్డుకున్నారు. వివరాలిలా ఉన్నాయి.

నగరానికి చెందిన అరవింద్, హైదరాబాద్‌కు చెందిన సౌజన్యతో ఫోన్లో పరిచయం ఏర్పడింది. అదికాస్త ప్రేమగా మారడంతో ఈనెల ఆరోతేదీ ఇంటి నుంచి పరారైన ఇద్దరు 8వ తేదీన భద్రాచలంలో వివాహం చేసుకున్నారు. వివాహానంతరం నాలుగురోజులు అక్కడే గడిపారు. శుక్రవారం రాత్రి నెల్లూరు నగరానికి చేరుకుని ఇంటికి వెళ్లారు. అరవింద్ కుటుంబసభ్యులు ఆమెను నిరాకరించారు. అరవింద్ సైతం తల్లిదండ్రుల మాటను విని ఆమెను వద్దన్నాడు. ఆమెను హైదరాబాద్‌కు వెళ్లిపోవాలని సూచించారు. బాధితురాలు రైల్వేస్టేషన్‌కు చేరుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

ప్రయాణికులు ఆమెను వారించి జరిగిన విషయం తెలుసుకున్నారు. ఇంతలో అక్కడకు చేరుకున్న అరవింద్ కుటుంబసభ్యులు ఇంటికి రావాలని సూచించారు. అరవింద్ అడ్డు తగల డంతో బాధితురాలు అతన్ని నిలదీసింది.అరవింద్ ఆమెపై చేయిచేసుకుని తనకు వ ద్దంటూ అక్కడ నుంచి వెళ్లిపోయాడు. ప్రయాణికుల సహాయంతో బాధితురాలు అ రవింద్‌పై రైల్వేపోలీసులకు ఫిర్యాదుచేసి తల్లిదండ్రుల వద్దకు వెళ్లేందుకు రెలైక్కింది.
sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh