online marketing

Sunday, May 8, 2011

బాలలందరికీ ఉచిత నిర్బంధ విద్య జిల్లా కలెక్టర్ బి శ్రీ్ధర్ స్పష్టం

నెల్లూరు: ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల వయస్సు గల బాల బాలికలందరికీ ఉచిత, నిర్బంధ ప్రాథమిక విద్యను నూటికి నూరుశాతం అందించేలా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ బి శ్రీ్ధర్ తెలిపారు. శనివారం స్థానిక గోల్డెన్‌జూబ్లీ హాలులో రాజీవ్ విద్యామిషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న బడిబాట కార్యక్రమంపై కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలల పునః ప్రారంభం నాటికి బాలబాలికలందరూ పాఠశాలల్లో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. మండల రిసోర్స్‌పర్సన్లతో కలిసి అంగన్‌వాడీ వర్కర్లు, వయోజన విద్యా ప్రేరక్‌లు, సాక్షర భారత్ వాలంటీర్లు, మహిళా సమాఖ్యలు, యువజన సంఘాలు, గ్రామ సహాయకుల సహకారంతో 2011, మే 8వ తేదీ నుండి జూన్ 10వ తేదీ వరకు ప్రతి కుటుంబాన్ని సందర్శించి ఓటర్ల జాబితా ఆధారంగా 6-14 సంవత్సరాల వయస్సు కల్గిన బడిబయట పిల్లల వాస్తవ పరిస్థితులను సేకరించాలన్నారు. సేకరించిన వివరాలను నిర్దేశించిన నమూనాలలో తప్పనిసరిగా పొందుపరచాలన్నారు. జిల్లాలో బడికి దూరంగా ఉన్న 4241 మంది బడిఈడు పిల్లలను గుర్తించినట్లు తెలిపారు. ఇందులో 2289 మంది బాలురు, 1952 మంది బాలికలు ఉన్నారన్నారు. ప్రాథమిక విద్యాశాఖ నిర్వహించిన సర్వే వివరాలను బడిబాట సందర్భంగా గ్రామసభలలో సామాజిక తనిఖీల ద్వారా ధ్రువీకరించుకోవాలన్నారు.
‘బడీడు పిల్లలందర్నీ పాఠశాలల్లో చేర్పించాలి’
అదనపు జాయింట్ కలెక్టర్ టి సీతారామయ్య మాట్లాడుతూ రాజీవ్ విద్యామిషన్, విద్యాశాఖ అధికారులు సమన్వయంగా పనిచేసి బడికి దూరంగా ఉన్న బడిఈడు పిల్లందరినీ గుర్తించి వారిని పాఠశాలల్లో చేర్పించాలన్నారు. సంబంధిత మండల విద్యాశాఖాధికారులు, మండల రిసోర్స్‌పర్సన్స్, తహశీల్దార్ల నుండి ఓటర్ల జాబితా ప్రతులను తీసుకుని వాటి ఆధారంగా సమగ్రంగా సర్వే నిర్వహించి బడికి దూరంగా ఉన్న బడిఈడు పిల్లలను గుర్తించాలన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్‌పి నాగేశ్వరరావు, రాజీవ్ విద్యామిషన్ పివో జలీల్‌బాషా, జిల్లా విద్యాశాఖాధికారి బాలకాశయ్య, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ వెంకటరమణారెడ్డి, ఐసిడిఎస్ పిడి శారద, మండల విద్యాశాఖాధికారులు, మండల రిసోర్స్‌పర్సన్స్, తదితరులు పాల్గొన్నారు.

వడదెబ్బకు ముగ్గురు మృతి

నెల్లూర: జిల్లాలో శనివారం వడదెబ్బకు ముగ్గురు మృతి చెందారు. కలువాయ మండలంలో ఒకరు, మనుబోలు మండలంలో ఒకరు, చిల్లకూరు మండలంలో ఒకరు మృతిచెందారు.
కలువాయలో..
కలువాయి: కలువాయి గ్రామం సుసర్ల వీధిలో పాశం పెంచలయ్య (70) అనే వృద్ధుడు వడదెబ్బకు గురై మరణించాడు. శుక్రవారం వడదెబ్బకు తీవ్ర అస్వస్థతకు గురైన పెంచలయ్యను స్థానికంగా ఉన్న ఓ ఆసుపత్రిలో చికిత్స చేయించగా శనివారం ఉదయం మృతి చెందాడు.
మనుబోలులో..
మనుబోలు: మండలంలోని కొమ్మలపూడి గ్రామంలో శనివారం సాయంత్రం పొలాల్లోకి వెళ్లిన రైతు వడదెబ్బకు గురై మృతి చెందాడు. కొమ్మలపూడి గ్రామానికి చెందిన మనె్నమాల కృష్ణారెడ్డి(60) శనివారం పొలాల్లోకి సొంత పనిమీద వెళ్లాడు. ఎండ వేడిమికి వడదెబ్బసోకి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈమేరకు బంధువులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు.
చిల్లకూరులో..
చిల్లకూరు, మే 7: చిల్లకూరు మండలంలోని పల్లమాల గ్రామానికి చెందిన మారంరెడ్డి రామచంద్రారెడ్డి(54) శనివారం వడదెబ్బ తగిలి అస్వస్థతకు గురై మృతి చెందాడు. శుక్రవారం మధ్యాహ్నం పొలాల నుండి రామచంద్రారెడ్డి ఇంటికి వస్తుండగా వడదెబ్బ తగిలి అస్వస్థతకు గురయ్యాడు. శనివారం ఉదయం కోట ఆసుపత్రికి తరలించగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు బంధువులు తెలిపారు.

ఓటేద్దాం పదండి! పరుగులు తీసిన కడప విద్యార్థులు, ఓటర్లుజగన్, విజయమ్మల గెలుపుపై ఎంపి, జడ్పీ చైర్మన్ ధీమా

నెల్లూరు: కడప పార్లమెంటు, పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గాలకు ఆదివారం జరుగుతున్న ఉపఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి జిల్లాలోని వివిధ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులు అక్కడ నుండి వలస వచ్చిన జనం శనివారం రాత్రి కడపకు బయలు దేరి వెళ్లారు. కడప నుండి వచ్చి ఇక్కడ చదువుతున్న విద్యార్థులు వేలల్లో ఉన్నట్లు అంచనా. వీరంతా శనివారం మెస్ భోజనాలు ముగించి బస్సుల్లో వివిధ వాహనాల్లో కడప జిల్లాకు బయలుదేరి వెళ్లారు. విద్యా సంస్థల యాజమాన్యం వారిస్తున్నా విద్యార్థులు ఓటు హక్కు వినియోగించుకోవాలనే పట్టుదలతో వెళ్లినట్లు వారికి బయట భోజన సౌకర్యం కల్పిస్తున్న మెస్ యజమానులు తెలిపారు. అలా వెళ్లిన వారిలో 60 శాతం మంది జగన్, విజయమ్మల వైపు మొగ్గు చూపుతున్నట్లు మెస్ యజమానులు తెలిపారు. ఓటు లేని కొందరు విద్యార్థులు జగన్ విజయంలో పాలుపంచుకునే అవకాశం రాలేదని ఆవేదన వ్యక్తం చేసినట్లు బుజబుజ నెల్లూరుకు చెందిన మల్లికార్జున టెలీలింక్ సర్వీసు యజమాని తెలిపారు. కడపలో తనిఖీలు జరుగుతున్నాయని తెలిసి బ్యాగులు, సరంజామా వదిలేసి కేవలం కట్టుబట్టలతో ఓటేయడానికి బయలుదేరారని చెప్పారు. ఓటున్న విద్యార్థులంతా ముందుగానే టికెట్లు బుక్ చేసుకున్నారు. కొంత మంది విద్యార్థులు కలిసి ప్రత్యేకంగా వాహనాలు ఏర్పాటు చేసుకున్నారు. జగన్, విజయమ్మల విజయంతో ఢిల్లీలో రాష్ట్రం ప్రతిష్ఠ నిలబడుతుందని కడపకు చెందిన రంగారెడ్డి అనే విద్యార్థి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రతిష్ఠను కాపాడాలనే తపనతోనే ఓటేయడానికి వెళుతున్నామని ఆ విద్యార్థి పేర్కొన్నాడు.
జగన్, విజయమ్మలకు భారీ మెజారిటీ
ఇదిలావుండగా కడప పార్లమెంటు నియోజకవర్గంలో జగన్, పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి విజయమ్మ భారీ మెజారిటీతో గెలుస్తారని నెల్లూరు ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ కాకాణి గోవర్దనరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కడప జిల్లాలో జగన్, విజయమ్మల తరుపున 20 రోజుల పాటు ప్రచారం నిర్వహించిన నేతలిద్దరూ శుక్రవారం రాత్రి నగరానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్లమెంటు నియోజకవర్గంలో జగన్‌కు రెండు లక్షల ఓట్లకు పైగా మెజారిటీ వస్తుందన్నారు. అలాగే పులివెందులలో విజయమ్మ 30 వేల ఓట్ల మెజారిటీతో విజయ దుందుభి మోగిస్తారన్నారు.

penchalakona Bramhostava Programmes

13.05.2011 TO 18.05.2011 Bramhostava Programmes
Date / Day
Timings
Programs
13.05.2011
FRIDAY
 
EVENING
AMKURARPANA

14.05.2011
SATURDAY
 

MORNING
DHWAJAROHANAM

EVENING
SAHASRA DEEPALANKARA SEVA

NIGHT
SESHA VAHANA SEVA

15.05.2011
SUNDAY

MORNING
HAMSA VAHANA SEVA


EVENING
SAHASRA DEEPALANKARA SEVA


NIGHT
GOLD HANUMANTHA SEVA

16.06.2011
MONDAY

MORNING
SIMHAVAHANA SEVA

NIGHT
GOLD GARUDA SEVA

17.05.2011
TUESDAY

MORNING
SRI VARI KALAYANAM


EVENING
RADHOTSAVAM


NIGHT
GAJA VAHANA SEVA

18.05.2011
WEDNESDAY

MORNING
CHAKRASNANAM

EVENING
THEPPOTSAVAM
NIGHT
DHWAJAVAROHANAM

తిరిగి కాంగ్రెసులోకి వెళ్లేది లేదు, సోనియాకు దిమ్మ తిరగాలి: జగన్

నెల్లూరు : తిరిగి కాంగ్రెస్ గూటికి చేరేది లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం ఆయన ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పారు. ఉప ఎన్నికలు విశ్వసనీయతకు, అవకాశవాదానికి మధ్య జరుగుతున్న పోరుగా అభివర్ణించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆకాంక్షలను వైస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తుందన్నారు. అధికారం కోసమో, పదవుల కోసమో విలువలను తాకట్టు పెట్టలేనని స్పష్టం చేశారు.


ఓదార్పు యాత్రకు అడ్డుపడిన కాంగ్రెస్ తనను పార్టీ నుంచి బయటకు వెళ్లేలా చేసిందని వైఎస్ జగన్ అన్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకో లేకపోతే తనకు వ్యక్తిత్వమేముందని ఆయన ప్రశ్నించారు. కడపలో జరిగే ఉప ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ రాజకీయాలను మార్చివేసేందుకు నాంది పలుకుతాయన్నారు. వైఎస్ఆర్ ను ఆదరించే ప్రజలను ప్రలోభాల ద్వారా మోసగించలేరన్నారు. అయితే కుటుంబంలో ఏర్పడ్డ చీలికే తనను బాధిస్తోందన్నారు. అయినా అధిష్టానం కుట్రను ప్రజలను అర్ధం చేసుకున్నారని జగన్ అన్నారు.


వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కడప నగరంలో గురువారం రోడ్‌షో నిర్వహించారు. ఓటర్లను డబ్బుతో కొనలేదరని అన్నారు. కాంగ్రెస్ డబ్బుతో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు యత్నిస్తోందని మండిపడ్డారు. బీజేపీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదన జగన్ మరోసారి స్పష్టం చేశారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి దిమ్మ తిరిగేలా వైయస్సార్ కాంగ్రెసు పార్టీని గెలిపించాలని ఆయన కోరారు.

ఢిల్లీ పెద్దలొచ్చినా జగన్‌ మెజారిటీ తగ్గించలేరు

ఢిల్లీనుంచి పెద్దపెద్ద మంత్రులు వచ్చినా జగన్‌, విజయమ్మల మెజారిటీఁ తగ్గించలేరఁ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీనాయకఁలు నేదురుమల్లి పద్మనాభరెడ్డి అన్నారు. శుక్రవారం స్థాఁక విలేకర్లతో మాట్లాడుతూ ఎఁ్నకల్లో వైఎస్‌ఆర్‌ కీర్తి ప్రతిష్టలను కడప ప్రజలు గమఁస్తున్నారఁ అత్యధిక మెజారిటీతో తల్లి బిడ్డల గెలుపు ఖాయమన్నారు. కేంద్రంలో సోఁయా గాంధీకి, కడపలో వైఎస్‌ఆర్‌కఁ ఈ పోటీ అఁ, ఇందులో జగన్‌ గెలుపు ఖాయమన్నారు. కేంద్రం మరో 100మంది నాయకఁలను వెనుకేసుకఁఁ వచ్చినా డిపాజిట్లుకూడా దక్కే అవకాశాలు లేవన్నారు. భారతదేశంలోనే కడప ఉప ఎఁ్నకలు సంచలనం సృష్టిస్తున్నాయన్నారు. ఇతర దేశాల్లో ఉన్న వైఎస్‌ఆర్‌ అభిమానులు ఎస్‌ఎంఎస్‌లు, ఇంటర్నెట్‌ల ద్వారా తల్లి బిడ్డలకఁ సహకరిస్తున్నారన్నారు. ఈ ఎఁ్నకల అనంతరం దేశంలో రాజకీయాల్లో పలు మార్పులు వచ్చే అవకాశం ఉందఁ తెలిపారు. టిడిపి అధ్యక్షఁలు చంద్రబాబునాయుడు జగన్‌ను బిన్‌లాడిన్‌తో పోల్చడం సిగ్గుచేటన్నారు. చిరంజీవి ప్రచారం ఓటర్లలో నమ్మకం పోయిందన్నారు. రానున్న ఎఁ్నకల్లో చిరంజీవి ఎమ్మెల్యేగా గెలవడం అనుమానమేనన్నారు. ఎఁ్నకల అధికారులు, కలెక్టర్‌ చట్టపరంగానే వ్యవహరిస్తున్నారన్నారు. జగన్‌అంటే సోఁయాగాంధీకి భయం పుడుతుందన్నారు. తాము ప్రచారం చేసిన పలు మండలాల్లో వైఎస్‌ఆర్‌కే ఓట్లు వేసే పరిస్థితి ఉందన్నారు. ఆయన వెంట ఎంపిటిసి సభ్యులు నేదురుమల్లి రంజన్‌రెడ్డి, వైఎస్‌ఆర్‌ పార్టీనాయకఁలు పెంచలరెడ్డిలు ఉన్నారు.

సింహపురి తీరంలో మరో 'థర్మల్‌' పిడుగు !

సింహపురి తీరంలో మరో 'థర్మల్‌' పిడుగు పడనుంది. 'వీనస్‌ పవర్‌ వెంచర్స్‌ (ఇండియా) లిమిటెడ్‌' స్థాపించనున్న థర్మల్‌ విద్యుత్కేంద్రానికి ప్రభుత్వం గుట్టుచప్పుడు కాకుండా అనుమతి మంజూరు చేసేందుకు సిద్ధమైరది. దాని విద్యుదుత్పత్తి సామర్థ్యం 350 మెగావాట్లు. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో 28 ప్రాజెక్టుల ద్వారా 33 వేల మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే శ్రీకాకుళం జిల్లా సోంపేటలో అక్కడ ప్రజలు తరిమికొట్టిన నాగార్జున కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ నేలటూరులో నెల్‌క్యాస్ట్‌ విద్యుత్కేంద్రంలో భాగసామ్యమైంది. ఇందులో రూ.150 కోట్ల పెట్టుబడులుపెట్టింది. అవసరానికి మించి థర్మల్‌ విద్యుత్కేంద్రాలకు అనుమతిలిస్తే జిల్లా వల్లకాడుగా మారుతుందనీ, బూడిద తప్ప మనుషులుండరనీ జనవిజ్ఞాన వేదిక, అఖిలపక్షాలు హెచ్చరిస్తున్నా ప్రభుత్వం బేఖాతరు చేస్తోంది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో పరిశ్రమల స్థాపనకు దేశ, విదేశాల్లోని పెట్టుబడిదారులు దృష్టిపెట్టారు. కృష్ణపట్నం పోర్టుకు అనుబంధంగా ప్రాజెక్టులు విచ్చలవిడిగా వెలుస్తున్నాయి. పరిశ్రమలు పెడతామని పేద రైతుల నుంచి భూములను కారు చౌకగా తీసుకుంటున్నారు. వారి భూములకు సక్రమమైన పరిహారమూ ఇవ్వడంలేదు. పారిశ్రామికవేత్తలూ, ప్రభుత్వమూ తామిచ్చిన హామీ మేరకు స్థానికులకు ఉపాధీ, ఉద్యోగావకాశాలూ కల్పించడం లేదు.

అన్నింటికి మించి థర్మల్‌ విద్యుత్కేంద్రాల కాలుష్యంపై ప్రజల్లో తీవ్ర అలజడి ఉంది. ఇప్పటివరకూ 33,285 మెగావాట్ల థర్మల్‌ విద్యుత్తు ఉత్పత్తి చేయడానికి 28 ప్రాజెక్టులకు అనుమతులు మంజూరయ్యాయి. ఈ ప్రాజెక్టులకు రోజుకు సుమారు ఐదు లక్షల టన్నుల బొగ్గు వినియోగం జరుగుతుంది. తద్వారా సుమారు రెండు లక్షల టన్నుల బూడిద బయటకొస్తుంది. నెలకు 60 లక్షల టన్నుల బూడిద విడుదలవుతుంది. ఇప్పటికే అన్ని రాజకీయపార్టీలు, ప్రజాసంఘాలు అఖిలపక్షంగా ఏర్పడ్డాయి. థర్మల్‌ విద్యుత్కేంద్రాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా ప్రజల తరపున విజ్ఞప్తి కూడా వెళ్లింది. గత ముఖ్యమంత్రి రోశయ్య తన వద్దకు వచ్చిన జిల్లా అఖిలపక్షానికి ఇకపై కొత్త అనుమతులు ఇవ్వబోమని హమీ ఇచ్చారు. అయినా అనుమతులు మాత్రం ఆగడం లేదు. ఒక ప్రాజెక్టు తరువాత మరోదానికి అనుమతులు వస్తూనే ఉన్నాయి.

తాజాగా కృష్ణపట్నం సమీపాన హైదరాబాద్‌కు చెందిన వీనస్‌ పవర్‌ వెంచర్స్‌ (ఇండియా) ప్రయివేట్‌ లిమిటెడ్‌ 175 ఎకరాల్లో 350 మెగావాట్ల విద్యుత్కేంద్ర నిర్మాణానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లూ చకచకా జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే శ్రీకాకుళం జిల్లా సోంపేటలో అక్కడ ప్రజలు తరిమికొట్టిన నాగార్జున కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ నేలటూరులో నెల్‌క్యాస్ట్‌ విద్యుత్కేంద్రంలో భాగసామ్యమైంది. సోంపేటలో ఒక్క విద్యుత్కేంద్రం పెట్టేందుకు ప్రయత్నిస్తేనే ప్రజలు పోరాటం సాగించారు. ఇద్దరు ప్రాణ త్యాగం చేశారు. ఇక వీలులేక పారిశ్రామికవేత్తలు అక్కడ నుండి పలాయనం చిత్తగించారు. అలాంటి విద్యుత్కేంద్రాలన్నీ ఇప్పుడు నెల్లూరు జిల్లాకు రావడం, అవి వెలువరించే కాలుష్యంతో పర్యావరణవేత్తలు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రజల ఆరోగ్యంకన్నా పారిశ్రామికవేత్తల జేబులు నింపడానికే ప్రభుత్వం పనిచేస్తోందని జెవివి ఆరోగ్య విభాగం రాష్ట్ర నాయకలు డాక్టర్‌ ఎంవి రమణయ్య విమర్శించారు.

వైయస్ జగన్ మెజార్టీపై జోరుగా పందేలు: కడపలో రూ 40 కోట్లు

నెల్లూరు  : మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎన్ని లక్షల మెజార్టీ సాధిస్తారనే విషయంపై భారీగా బెట్టింగులు జరుగుతున్నాయి. ఆ తర్వాత రెండో స్థానం ఎవరు దక్కించుకుంటారు, మైదుకూరులో మెజారిటీ డీఎల్‌కా? జగన్‌కా? పులివెందులలో గెలుపు విజయమ్మాదా, వివేకాదా తదితరాలపై బెట్టింగ్ రాయళ్లు భారీగా బెట్టింగులకు పాల్పడుతున్నారు. కోట్లు కురిపించే పందెంకోడి ప్రశ్నలు కూడా! ఓవైపు, గెలుపు కోసం కడపలో పార్టీలు కోట్ల రూపాయలను మంచినీళ్లలా ఖర్చు చేస్తుంటే వారిలో ఎవరు గెలుస్తారు? మెజారిటీ ఎంతంటూ రాష్ట్రవ్యాప్తంగా పందెంరాయుళ్లు కోట్లలో పందేలు కాస్తున్నారు. ఈసారి పందెం కాసిన వారిలో రాజకీయ నేతలు, కొన్నిచోట్ల ప్రజాప్రతినిధులు ఉండడం గమనార్హం.

కడప జిల్లాలో ఇప్పటికే దాదాపు రూ.40 కోట్లమేర పందేలు జరిగాయని అంచనా. అలాగే, అనంతపురం, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోనూ పందేలు కాశారు. అక్కడ దాదాపు రూ.20 కోట్ల మేర ఉండవచ్చని తెలుస్తోంది. జగన్‌కు రెండు లక్షల మెజార్టీ రాదని అధికార పార్టీకి చెందిన ఓ వ్యక్తి రూ.10 లక్షలు పందెం కాసినట్లు సమాచారం. గెలుపు, మెజార్టీతోపాటు 2, 3 స్థానాలపై కూడా పందేలు జరుగుతున్నాయి. టీడీపీ ఓటు బ్యాంకును దృష్టిలో ఉంచుకొని రెండో స్థానం ఆ పార్టీకే దక్కుతుందని జోరుగా పందేలు జరిగాయి. గెలుపు తథ్యమని, లేకపోతే రెండో స్థానం కాంగ్రెస్‌దేనని కూడా పందెం కాశారు. అనంతపురం జిల్లాలో జగన్‌కు వచ్చే మెజారిటీపైనే భారీ బెట్టింగ్ నడుస్తోంది.

లక్ష, రెండు లక్షలు, మూడు లక్షల మెజారిటీకి తగ్గదంటూ పలువురు బెట్టింగ్ కడుతున్నారు. అనంతపురం, తాడిపత్రి, ధర్మవరం, కదిరి, రాయదుర్గం తదితర పట్టణాల్లో జగన్ మెజారిటీపై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. లక్షకు పైగా, రెండు లక్షల్లోపు మెజారిటీ వస్తుందని పెద్ద సంఖ్యలో బెట్టింగ్ కడుతున్నట్టు సమాచారం. కోట్లాది రూపాయలకు సంబంధించి బెట్టింగ్‌కు ఒప్పందాలు కుదిరినట్లు తెలిసింది. ప్రకాశం జిల్లాలోనూ ఇదే పరిస్థితి. రెండు లక్షల పై చిలుకు మెజారిటీ తమ నేతకు వస్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు, అభిమానులు బెట్టింగ్‌లు కడుతుండగా, యాభై వేల నుంచి లక్షలోపు మెజారిటీ మాత్రమే వస్తుందని టీడీపీ, కాంగ్రెస్ నాయకులు బెట్టింగ్‌లు పెడుతున్నారు. జగన్ సమీప బంధువైన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసుల రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఒంగోలులో పందేల ప్రభావం అధికంగా కనిపిస్తోంది.

రెండు లక్షలకు పైగా మెజారిటీతో గెలుపు ధీమాను వ్యక్తం చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు అంతకు తగ్గితే రూ. వందకు రూ. రెండు వందలు ఇస్తామంటూ బెట్టింగ్‌లు కాస్తున్నట్టు సమాచారం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోనూ పందేల జోరు అధికంగా ఉంది. మెజార్టీ భారీగా తగ్గిపోతుందని కొందరు, పాత మెజార్టీ కంటే పెరిగి 2 లక్షల మెజార్టీ జగన్‌కు లభిస్తుందని మరికొందరు పందేలు కాస్తున్నారు. 50 వేల మెజార్టీపై రూ.10 నుంచి 20 వేల వరకు పందేలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో.. అభ్యర్థులు, ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం కంటే పందెపు రాయుళ్లలోనే టెన్షన్ అధికమైంది.

పరిచయమున్న పత్రికా ప్రతినిధులు, ఇంటెలిజెన్స్ సిబ్బంది నుంచి ఏ రోజుకారోజు పరిస్థితిని తెలుసుకుంటూ అనుకూలంగా పందేలు కాస్తున్నారు. జగన్‌కు లక్ష నుంచి 2 లక్షల వరకు మెజార్టీ రాదని చెప్పేవారు రూపాయికి రెండు రూపాయిలు ఇచ్చే విధానంపై పందెం కాశారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కూడా పందేలు జరగడం విశేషం. కాంగ్రెస్ అభ్యర్థి డీఎల్ రవీంద్రారెడ్డికి మైదుకూరులో, జగన్‌కు పులివెందులలో, మైసూరారెడ్డికి కమలాపురంలో మెజార్టీ వస్తుందని పందేలు జరిగాయి. ఇక, పోలింగ్ ముగిసిన తర్వాత పోలింగ్ శాతం, పోలింగ్ తీరు, రాజకీయ పక్షాల నుంచి వచ్చే సమాచారం ఆధారంగా పందేలు మరింత జోరందుకోనున్నాయి.

జగన్‌ 3,50,000 మెజారిటీతో గెలుపు ఖాయం-నేదురుమల్లి

వాకాడు: 3,50,000 మెజారిటీతో వైయస్‌ జగన్‌ గెలుపు ఖాయమని, వైయస్‌ఆర్‌ పార్టీ నాయకులు నేదురుమల్లి పద్మనాభరెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన స్థానిక విలేఖరులతో మాట్లాడుతూ ఢిల్లీ నుండి పెద్ద పెద్ద మంత్రులు వచ్చినా, జగన్‌, విజయమ్మల మెజారిటీని తప్పించలేరన్నారు. సోనియాగాంధీ, వైయస్‌ఆర్‌ అభిమానుల మధ్య ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. వైయస్‌ఆర్‌ కీర్తిప్రతిష్టలను కడప ప్రజలు ఎప్పుడూ గౌరవిస్తూనే ఉన్నారని ఆయన తెలిపారు. తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబునాయుడు, జగన్‌ను లాడెన్‌తో పోల్చటం సిగ్గుచేటని ఆయన విమర్శించారు. చిరంజీవి జిమ్మిక్కులు కడప ప్రజలు వినే పరిస్థితులో లేరని వారు తెలిపారు. జగన్‌ గెలుపుతో భారతదేశ రాజకీయాలలో పలుమార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు, చట్టపరమైన చర్యలు చేపడుతున్నారన్నారు. సోనియాగాంధీకి కడపలో జరుగుతున్న పరిణామాలతో జగన్‌ అంటే భయం పుడుతుందన్నారు. ఇకనైనా సోనియాగాంధి కళ్లు తెరవకపోతే అనేక పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని ఆయన అన్నారు. తాను ప్రచారం చేసిన పులివెందుల, బద్వేలు, కమలాపురం, చింతలగుంటలపాలెం, ప్రొద్దుటూరు, వేంపల్లి, కడప రూరల్‌, అర్బన్‌, వైయస్‌ఆర్‌ పుట్టిన బల్పానూరు ప్రాంతాలలో వైయస్‌ఆర్‌ అభిమానులు అధికసంఖ్యలో జేజేలు కొడుతున్నారన్నారు. ఇతర దేశాలలో ఉన్న వైయస్‌ఆర్‌ అభిమానులు ఇంటర్నెట్‌ ద్వారా, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా జగన్‌ విజయానికి సహకరిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నేదురుమల్లి రంజన్‌రెడ్డి, పెంచలరెడ్డి ఉన్నారు.

మేకపాటి సంస్థల్లో జగన్‌ డబ్బు రూ.8 వేల కోట్లు : ఆనం వివేకానందరెడ్డి

నెల్లూరు : మేకపాటి సోదరుల వ్యాపార సంస్థల్లో వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి చెందిన డబ్బు రూ.8 వేల కోట్లు రొటేషన్‌ అవుతుందని నెల్లూరు రూరల్‌ ఎమ్మల్యే ఆనం వివేకానందరెడ్డి ఆరోపించారు. బుధవారం నెల్లూరు మినీ బైపాస్‌ రోడ్డులోగల సామాజిక వికాస భవనంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మేకపాటి సోదరులపై పలు ఆరోపణలు చేశారు. జగన్‌కు సంబంధించిన రూ.1.40 లక్షల కోట్ల ఆస్తుల్లో రూ.40 వేల కోట్లు మాత్రం స్థిరాస్తుల రూపంలో ఉన్నాయని, మిగిలిన లక్ష కోట్ల ధనాన్ని వ్యాపార మిత్రులవద్ద రొటేషన్‌ చేస్తున్నాడని అన్నారు. ఆ జాబితాలో మేకపాటి సోదరుల పేర్లున్నాయన్నారు. మేకపాటి సోదరులు కచ్చితంగా విశ్వసనీయతలేని నీతిమాలిన రాజకీయ నాయకులు అన్నారు. ఏ మాత్రం నీతి, నిజాయితీ ఉన్నా రాజీనామా చేసి జగన్‌ వైపు వెళ్లి ఉండేవారన్నారు. కడపను సర్వనాశనం చేయడానికే జగన్‌ కంకణం కట్టుకున్నాడన్నారు. కడప అభివృద్ధిని తన రాజకీయ స్వార్ధంతో చిన్నాభిన్నం చేస్తున్నాడనీ, సీఎంకావాలనే అశతోనే పెంచిపోషించిన కాంగ్రెస్‌కు ద్రోహంచేసి రాజీనామా చేసినట్లు ఆనం చెప్పారు.
కడపలో చిరంజీవి ప్రచారంతో కాంగ్రెస్‌ పుంజుకుందన్నారు. చిరంజీవి, చంద్రబాబుపై దాడులు జరిగిన తర్వాత జగన్‌ పలుకుబడి దిగజారిందన్నారు. ఈ సమావేశంలో నగర ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి, మాజీ కార్పొరేటర్లు పిండి సురేష్‌, సూళ్లూరు రమాదేవి, సంక్రాంతి కల్యాణ్‌, కాం గ్రెస్‌ నాయకులు మేఘనాధ్‌సింగ్‌, డి.రాజానాయుడు, కె.హరికుమార్‌, షేక్‌ నన్నేసాహెబ్‌, సూళ్లూరు దేవరాజులు పాల్గొన్నారు.

సండేమార్కెట్‌లో పెరుగుతున్న అరాచకం-పోలీసుల మౌనం

నెల్లూరు : నెల్లూరుజిల్లా నడిబొడ్డున ఉన్న సండేమార్కెట్‌ గత చరిత్ర ఉంది. పేద, మధ్య తరగతి కుటుంబాల వారు నిత్యం సండేమార్కెట్‌లో వ్యాపారాలు చేస్తూ రద్దీగా ఉంటుంది. ప్రతి దినం ఇక్కడ వ్యాపారాలు మూడుపువ్వులు ఆరు కాయలుగా జరిగేవి. పల్లె జనం ఎక్కువగా సండేమార్కెట్‌ను ముందుగా దర్శించుకుని, అవసరమైన అన్ని వస్తువులు ఇక్కడ లభ్యమవు తుండటంతో ఈ మార్కెట్‌లో వ్యాపారాలు విస్తృతంగా సాగేవి. అయితే గతంలో టౌన్‌లోని వివిధ వ్యాపార సంస్థలతో పోల్చుకుంటే ధర సరసమైనవిధంగా ఉండేది. కానీ నేడు ఆ పరిస్థితి మారిపోయింది. వ్యాపారులంతా సిండికేట్‌ అయి, ఒక వస్తువుకి ఒకే ధర అనే నినాదంతో మార్కెట్‌ వ్యాపారులంతా ఈ షరతులు పాటించాలని, సంఘం నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉంటూ వ్యాపారులు నిర్వహిస్తుండేవారు. ఈ విధంగా ఇక్కడ వ్యాపారులు షాపులు లీజుకు ఇవ్వరాదని, ప్రతి నెల శుక్రవారం సెలవు పాటించాలని, అన్ని షాపులు ఒకే ధరకు వస్తువులు విక్రయించాలనే మూడు షరతులతో ముందుకు సాగుతున్న ఈ వ్యాపారాలు కాస్త పేద, మధ్య తరగతుల వారికి వినియోగదారులకు కష్టతరంగా మారిన, ఇక్కడున్న వ్యాపారులంతా సామాన్యులే కనుక మూడు షరతుల వల్ల ప్రయోజనకారిగా మారిందనే విషయం వాస్తవం. అయితే యూనియన్‌ పేరుతో షరతులను తప్పక పాటించాలనే విషయంలో కొందరు అతిక్రమించటమేకా కుండా ప్రత్యక్షదాడులకు దిగేస్థాయికి దౌర్జన్యాలకు దిగే సంస్కృతి మొదలయింది. ఇందుకు నిదర్శనంగా గత వారం అర్జున్‌ అనే వ్యాపారి శరవణ్‌ అనే వ్యాపారిపై దాడికి పాల్పడి, తలపగలకొట్టి ఇతరులపై భౌతిక దాడులకు పాల్పడటం, అందుకు అతని అనుచరులను పురికొల్పటం వంటి రౌడీయిజం, మార్కెట్‌లో పెచ్చుమీరుతున్న సందర్భాలున్నాయి. జిల్లా పోలీసులు ఈ విషయంలో చొరవచూపి, సండేమార్కెట్‌లో జరుగుతున్న దౌర్జన్యమా? ఆధిపత్యపోరా? రౌడీయిజమా? ఏదైనా కావచ్చు ఇటీవల అరాచకం జరుగుతుంది. వ్యాపారుల మధ్యే కాకుండా అక్కడకు వచ్చే వినియోగదారులపై కూడా కొందరు జులు ప్రదర్శించటం జరిగిన సందర్భాలున్నాయి. గతంలో జెండావీథి వినియోగదారులపై జరిగిన గొడవ పోలీసుల వరకు వెళ్ళింది. ఈ సంఘటనల దృష్ట్యా జిల్లా పోలీసు యంత్రాంగం సండేమార్కెట్‌ నిర్వహణపై దృష్టిపెట్టి , మార్కెట్‌లోని వినియోగదారులు, వ్యాపారులకు ఎటువంటి ఇబ్బందిలేకుండా చూడాల్సిన అవసరం జిల్లా పోలీసు యంత్రాంగంపై ఉంది.

మే 11 నుంచి నెల్లూరు వేదగిరి లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు


నెల్లూరు జిల్లాలోని పెన్నానది తీరాన గల నరసింహకొండపై వెలసిన శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 11వ నుండి ప్రారంభం కానున్నాయి. మే 11వ తేదీన స్వామి వారికి అంకురార్పణతో ఈ వేడుకలు ప్రారంభమవుతాయి. మొత్తం 11 రోజులపాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు ఈ విధంగా ఉన్నాయి.

మే 11, 2011 - అంకురార్పణ
మే 12, 2011 - స్వామివారికి ధ్వజారోహణ, చప్పర ఉత్సవం, రాత్రికి శేషవాహన సేవ
మే 13, 2011 - ఉదయం చప్పర ఉత్సవం, రాత్రి హంసవాహనం
మే 14, 2011 - ఉదయం చప్పర ఉత్సవం, రాత్రి సింహవాహనంపై స్వామివారి ఊరేగింపు
మే 15, 2011 - ఉదయం స్వామివారికి చప్పర ఉత్సవం, రాత్రి స్వామి వారికి హనుమంతసేవ
మే 16, 2011 - ఉదయం మోహినీ ఉత్సవం, సాయంత్రం అఖండజ్యోతి, తెల్లవారుజామున 3 గంటలకు బంగారు గరుడసేవ
మే 17, 2011 - సాయంత్రం స్వామివారి కల్యాణం, రాత్రి గజవాహనసేవ, పూలంగిసేవ
మే 18, 2011 - ఉదయం నరసింహపురం (కొండకు దిగువభాగం)లో స్వామివారి రథోత్సవం
మే 19, 2011 - ఉదయం చప్పర ఉత్సవం, రాత్రి అశ్వవాహనం
మే 20, 2011 - ఏడు కోనేర్ల వద్ద చక్రస్నానం, రాత్రి ధ్వజావరోహణ
మే 21, 2011 - రాత్రి స్వామివారికి ఏకాంతసేవ (బ్రహ్మోత్సవాలు ముగింపు)

స్వామివారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని భక్తుల కాలక్షేపార్థం ఇక్కడ పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 16వ తేదీన "కురుక్షేత్రం" పూర్తినాటక ప్రదర్శన, తెల్లవారుజామున 3 గంటలకు "సత్యహరిశ్చంద్ర" కాటిసీను, 4 గంటలకు "రామాంజనేయ యుద్ధం" ప్రదర్శనలుంటాయి. అలాగే 17వ తేదీన రాత్రి 10 గంటలకు "గయోపాఖ్యాణం" యుద్ధసీను, "చింతామణి" భవాని సీను, అర్ధరాత్రి 12 గంటలకు "సత్యహరిశ్చంద్ర" పూర్తి నాటకాలు ప్రదర్శిస్తారు.

కామాక్షితాయి సన్నిధి:

నరసింహస్వామి కొండకు దిగువ భాగాన ఓ ఐదు కిలోమీటర్ల దూరంలో శ్రీ మల్లికార్జున స్వామి సమేతంగా కామాక్షితాయి సన్నిది ఉంది. కోరిన వారికి కోటి వరాలిచ్చే కల్పవల్లి ఈ కామాక్షితాయి. పెన్నానదిని ఆనుకొని ఈ ఆలయం ఉంది. పవిత్రనదిలో స్నానమాచరించి, అమ్మవారిని దర్శించుకొని మనసారా నమస్కరించి కోరికలు కోరుకుంటే అమ్మవారు తప్పక నెరవేరుస్తారని వేలాది మంది భక్తుల నమ్మకం. లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు వెళ్లిన భక్తులందరూ తప్పకుండా కామాక్షి అమ్మవారిని దర్శించుకొని తిరిగి వెళ్తారు.
English summary
Sri Vedagiri Lakshmimarasimha Swamy Brahmothsavams starts from 11th May 2011 in Nellore District. This temple in its present form came into being nearly 500 years ago, on the summit of Narasimhakonda on the the bank of Pinakini (Penna River). This holy place lies 15 km away from Nellore Town, on the southern bank of the river Pinakini. Every year “Brahmotsavams” are celebrated here in the month of May.

దుగరాజ పట్టనాన్ని ఓడరేవు చేస్తా

కోట‌ : ఎన్ని అవాంతరాలు ఎదురయినా దుగరాజపట్టనంకు ఓడ రేవును చేసేందుకు కృషి చేస్తానని తిరుపతి పార్లమెంట్‌సభ్యులు చింతా మోహన్‌ అన్నారు. స్థానిక ప్రభుత్వ వైద్యశాలను శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్యశాలలోని పలు గదులను పరిశీలించారు.తదుపరి సంబంధిత అధికారులను, సిబ్బందిని అక్కడి స్థితిగతులు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో వున్న డాక్టర్ల కొరత, సిబ్బంది కొరతను వారం రోజులలోపు పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వాకాడు మండలంలోని సముద్ర తీరప్రాంతలో గల దుగరాజపట్టనాన్ని బ్రిటీష్‌ పరిపాలనలో ఉన్నటువంటి పూర్వవైభవాన్ని మళ్లీ తీసుకురావడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.


దీనిపై రాష్టప్రతికి, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి దృష్టికి తీసుకు వెళ్ళడం కూడా జరిగిందని ఆయన అన్నారు. మండలంలో పనికీ ఆహార పథకం చిత్తూరు జిల్లాలో పురోగతిని సాధించిందని, సుమారు 87 గ్రామాలలో 3 కోట్ల రూపాయలకు పైగా ప్రజలు ఈ పథకం ద్వారా లబ్ధిపొందారన్నారు. నెల్లూరు జిల్లా వెనుకబడి వుందని, సర్వేపల్లి అసెంబ్లీ నియోజక వర్గంలో కూడా ఈ పథకం చాల వెనుకబడి వుందని కోట, వాకడు, చిట్టమూరు మండలాలలో కొంత వరకు మెరుగుపడిందని, ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలలో ఉత్తమమైన పథకం పనికీ ఆహార పథకం అని ఆయన అన్నారు.


ప్రజలు ఈ పథకంలో కూలీలు గ్రూపులుగా చేయడం వలన శ్రద్ద వహించలేకుండా వున్నారని, ఫీల్డ్‌ అసిస్టెంట్‌లు గ్రామాలలోకి వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించలేక పోవడం ఒక కారణమన్నారు. జిల్లాలో నేడు రూ.5 కోట్ల వ్యయంతో పిల్లల సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రికి శిలా ప్రతిష్ట చేయనున్నట్లు తెలిపారు. అదే విధంగా తిరుపతిలో మూడు వందల పడకల సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిని 30 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణం జరుగుతుందని ఆయన అన్నారు. ఈయన వెంట సర్దార్‌హెస్సేన్‌, డాక్టర్‌ సుందరావు తదితరులు పాల్గొన్నారు.

భారీగా ఎర్రచందనం పట్టివేత

కలువాయి: అక్రమంగా ధాన్యపు లారీలో రూ. 20 లక్షల విలువచేసే ఎర్రచందనం తరలిస్తున్న ఐచర్‌వ్యాన్‌, ట్రాక్టర్‌ను శనివారం ఫారెస్టు అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. అధికారులు ఇచ్చిన వివరాల ప్రకారం రూ. 20 లక్షల విలువైన 160 దుంగలను ఎపి 28వై 3652 నంబరుగల ఐచర్‌వ్యాన్‌, ఏపి 26టి 2587 నంబరు గల ట్రాక్టర్‌ను అక్రమంగా ఎర్రచందనాన్ని లోడు చేసుకున్న పై ధాన్యపు బస్తాలను నింపుకొని మండలంలోని చీపినాపి బీట్‌ పరిధిలో పర్లకొండ సమీపంలో అక్రమంగా తరలిస్తున్న ఈ వాహనాలను ప్రజలు ఇచ్చిన సమాచారం మేరకు దాడి చేసి పట్టుకున్నామని వారు తెలిపారు. పట్టుకున్న వాహనాల విలువ సుమారు రూ.20 లక్షలు ఉంటుందని అటవీశాఖ అధికారులు తెలియచేశారు. ఈ దాడిలో ఫారెస్టు అధికారులు ఓ.ప్రకాష్‌, బాబుల్‌సాహహెబ్‌, వెంకటేశ్వర్లు, మౌలాలిలు ఉన్నారు. పట్టుకున్న దంగులను, వాహనాలను పొదలకూరు గొడౌన్‌కు తరలించినట్లు వారు తెలిపారు.

సింహపురి స్పోర్ట్స్‌ ఫౌండేషన్‌ వితరణ

నెల్లూరు‌:నగరంలోని ఎసి.సుబ్బారెడ్డి స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో జరుగుతున్న బ్యాడ్మింటన్‌ శిక్షణా శిబిరంలోని క్రీడాకారులకు సింహపురి స్పోర్ట్స్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో పౌష్టికాహారం, క్రీడా దుస్తులను అందజేశారు. శనివారం స్థానిక ఇండోర్‌ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో సింహపురి స్పోర్ట్స్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షులు ముక్కాల ద్వారకనాధ్‌ మాట్లాడుతూ జిల్లాలో క్రీడల అభివృద్ధికి ఫౌండేషన్‌ సహాయ సహకారాలను అందిస్తుందన్నారు. క్రీడలలో రాణిస్తూ ఆర్థికంగా వెనుకబడిన వారికి ప్రత్యే శ్రద్ధతో వారి అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తామన్నారు. ఏ క్రీడాంశానికి చెందినవారికైనా ఫౌండేషన్‌ ఆర్థిక సహాయాన్ని అందజేస్తుందన్నారు.

జిల్లాలో మొట్టమొదటిసారిగా బ్యాడ్మింటన్‌ రెసిడెన్షియల్‌ కోచింగ్‌ క్యాంప్‌ను నిర్వహిస్తున్న సందర్భంగా తమ ఫౌండేషన్‌ ద్వారా సుమారు 60 మందికి పౌష్టికాహారంను, క్రీడా దుస్తులను అందజేస్తున్నామన్నారు. అంతేకాకుండా జిల్లా స్థాయిలో, రాష్టస్థ్రాయిలో ప్రతిభను కనబరచిన క్రీడాకారులకు నెలకొకరికి సంబంధిత క్రీడలు అవసరమయ్యే పరికరాలను అందజేస్తూ వారి అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. క్రీడాకారుల అభివృద్ధిని కోరుకునేవారు తమని సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సింహపురి ఫౌండేషన్‌ అధ్యక్షులు రాకేష్‌ చౌదరి, సభ్యులు వినోద్‌రెడ్డి, శ్రీనివాసులు, సీనియర్‌ క్రీడాకారులు వేణుమాధవ్‌, ప్రతాప్‌, కోచ్‌ ప్రీతమ్‌ తదితరులు పాల్గొన్నారు.

రాజకీయాలకు అతీతంగా నిధులు

నెల్లూరు ‌: రాజకీయాలకు అతీతంగా సమిష్టిగా ఉంటూ నిధులు తీసుకొస్తూ నెల్లూరులో సుమారు రూ.100 కోట్లతో అభివృద్ధి పనులు జరిగినట్లు నెల్లూరు నగర, రూరల్‌ ఎమ్మెల్యేలు ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి, ఆనం వివేకానందరెడ్డిలు తెలిపారు. శనివారం 35వ డివిజన్‌ పరిధిలోని పింఛన్‌ లైన్‌లో రూ.6 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న సిసి రోడ్డు పనులను వారు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వివేకా మాట్లాడుతూ ఇందిరమ్మ ప్రభుత్వంను ప్రజలందరూ రెండు సార్లు ఆదరించబట్టే ఇన్ని నిధులను ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి నగరాన్ని అభివృద్ధి చేస్తున్నామని ఆయన తెలిపారు. మీ ఆశీర్వాదం తమపై ఎల్లవేళలా ఉంటే ఇంకా మరిన్ని నిధులు తీసుకొచ్చి ఇంకా నగరాభివృద్ధి చేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

అదేవిధంగా అర్హులందరికీ పెన్షన్‌లు, ఇళ్లు, పావలా వడ్డీ అందివ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు.పథకాలు అర్హులైనవారికి అందిస్తున్నామే తప్ప వారిలో సిపిఎం, టిడిపి, బిజెపి, జగన్‌ పార్టీయా అని చూడడం లేదని ఆయన తెలిపారు. ఇన్ని పథకాలు రూపకల్పన చేసిందంటే కేంద్రము, రాష్ట్రాలలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉండబట్టేనని తెలిపారు. ఈ డివిజన్‌లో దాదాపు అన్ని రోడ్లను పిండి సురేష్‌ కార్పొరేటర్‌గా ఉన్నప్పుడు వేసినవే అన్నారు. ఇంకా ఏమైనా మిగిలివుంటే ఆ రోడ్లు కూడా పూర్తి చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. నగర ఎమ్మెల్యే ముంగమూరు మాట్లాడుతూ గత ఐదేళ్లు కాంగ్రెస్‌ పార్టీ ఉండబట్టే అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని ఆయన కితాబిచ్చారు. రూ.102 కోట్లతో సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకు నిర్మాణం పూర్తి, రూ.20 కోట్లతో వాటర్‌ ట్యాంకులు వస్తున్నాయని అన్నారు.

అలాగే ఆనం రామనారాయణరెడ్డి మంత్రిగా ఉండబట్టే మేము ఇరువురము నిధులను అడిగిన వెంటనే ప్రభుత్వం ద్వారా మంజూరు చేస్తున్నారని ఆయన తెలిపారు. దీంతో నగరంలో మంచి కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. లో ఓల్జేటి సమస్యను అధిగమించడానికి సబ్‌స్టేషన్‌లు ఏర్పాటు, కొత్త కార్పొరేషన్‌ బిల్డింగు వంటివి వచ్చాయని తెలిపారు. ఈ పింఛను లైన్‌లో ఒక పక్క నగర నియోజకవర్గానికి, మరో పక్క రూరల్‌ నియోజకవర్గం పరిధిలోకి వస్తుందని తెలిపారు. అందుకే నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మరిన్ని తీసుకొస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు చాట్ల నరసింహ రావు, బుర్రా వెంకటేశ్వర్లు గౌడ్‌, హరి, జశ్వంత్‌సింగ్‌, ఖయ్యూం, అరిగెల కోదండం, మురళీ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

రొయ్యలు, చేపల వ్యాపారులకు స్థలం కేటాయింపు
హరనాధపురం, రామలింగాపురం సెంటర్‌ రోడ్డు మార్జిన్‌లో రొయ్యలు, చేపల వ్యాపారం చేసుకుంటున్న వారికి కొత్త పెన్నా బ్రిడ్జి అవతల ఉన్న స్థలాన్ని వ్యాపారస్తులకు కేటాయించడం జరిగిందని శాసనసభ్యులు ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి, ఆనం వివేకానందరెడ్డిలు శనివారం తెలిపారు. వీరు కొత్త పెన్నా బ్రిడ్జి వద్ద హరనాధపురం రోడ్డు మార్జిన్‌లో చేపలు, రొయ్యలు వ్యాపారం చేసుకుంటున్న వారికి పెన్నా బ్రిడ్జి వద్ద కొంత స్థలాన్ని అప్పగించడం జరిగిందన్నారు. హరనాధపురంలో రోడ్డు వెడల్పు చేస్తున్నారని, వీలైనంత త్వరగా కొత్త పెన్నా బ్రిడ్జికి వచ్చేయాలని తెలిపారు. తాత్కాలికంగా వీరు రేకుల షెడ్డు వేసుకుంటే అనంతరం నిధులు తీసుకొచ్చి అక్కడ వసతులు కల్పిస్తామని తెలిపారు. ఇక్కడ హోల్‌సేల్‌ వ్యాపారం చేస్తున్నారు కాబట్టి కోల్డ్‌ స్టోరేజ్‌ ఏర్పాటు చేసుకోవాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిసిసి ఇన్‌చార్జ్‌ చాట్ల నరసింహరావు, కాంగ్రెస్‌ నాయకులు బుర్రా వెంకటేశ్వర్లు గౌడ్‌, మాజీ కార్పొరేటర్‌ సరోజనమ్మలు పాల్గొన్నారు.
sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh