online marketing

Sunday, May 8, 2011

భారీగా ఎర్రచందనం పట్టివేత

కలువాయి: అక్రమంగా ధాన్యపు లారీలో రూ. 20 లక్షల విలువచేసే ఎర్రచందనం తరలిస్తున్న ఐచర్‌వ్యాన్‌, ట్రాక్టర్‌ను శనివారం ఫారెస్టు అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. అధికారులు ఇచ్చిన వివరాల ప్రకారం రూ. 20 లక్షల విలువైన 160 దుంగలను ఎపి 28వై 3652 నంబరుగల ఐచర్‌వ్యాన్‌, ఏపి 26టి 2587 నంబరు గల ట్రాక్టర్‌ను అక్రమంగా ఎర్రచందనాన్ని లోడు చేసుకున్న పై ధాన్యపు బస్తాలను నింపుకొని మండలంలోని చీపినాపి బీట్‌ పరిధిలో పర్లకొండ సమీపంలో అక్రమంగా తరలిస్తున్న ఈ వాహనాలను ప్రజలు ఇచ్చిన సమాచారం మేరకు దాడి చేసి పట్టుకున్నామని వారు తెలిపారు. పట్టుకున్న వాహనాల విలువ సుమారు రూ.20 లక్షలు ఉంటుందని అటవీశాఖ అధికారులు తెలియచేశారు. ఈ దాడిలో ఫారెస్టు అధికారులు ఓ.ప్రకాష్‌, బాబుల్‌సాహహెబ్‌, వెంకటేశ్వర్లు, మౌలాలిలు ఉన్నారు. పట్టుకున్న దంగులను, వాహనాలను పొదలకూరు గొడౌన్‌కు తరలించినట్లు వారు తెలిపారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh