online marketing

Sunday, May 8, 2011

వడదెబ్బకు ముగ్గురు మృతి

నెల్లూర: జిల్లాలో శనివారం వడదెబ్బకు ముగ్గురు మృతి చెందారు. కలువాయ మండలంలో ఒకరు, మనుబోలు మండలంలో ఒకరు, చిల్లకూరు మండలంలో ఒకరు మృతిచెందారు.
కలువాయలో..
కలువాయి: కలువాయి గ్రామం సుసర్ల వీధిలో పాశం పెంచలయ్య (70) అనే వృద్ధుడు వడదెబ్బకు గురై మరణించాడు. శుక్రవారం వడదెబ్బకు తీవ్ర అస్వస్థతకు గురైన పెంచలయ్యను స్థానికంగా ఉన్న ఓ ఆసుపత్రిలో చికిత్స చేయించగా శనివారం ఉదయం మృతి చెందాడు.
మనుబోలులో..
మనుబోలు: మండలంలోని కొమ్మలపూడి గ్రామంలో శనివారం సాయంత్రం పొలాల్లోకి వెళ్లిన రైతు వడదెబ్బకు గురై మృతి చెందాడు. కొమ్మలపూడి గ్రామానికి చెందిన మనె్నమాల కృష్ణారెడ్డి(60) శనివారం పొలాల్లోకి సొంత పనిమీద వెళ్లాడు. ఎండ వేడిమికి వడదెబ్బసోకి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈమేరకు బంధువులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు.
చిల్లకూరులో..
చిల్లకూరు, మే 7: చిల్లకూరు మండలంలోని పల్లమాల గ్రామానికి చెందిన మారంరెడ్డి రామచంద్రారెడ్డి(54) శనివారం వడదెబ్బ తగిలి అస్వస్థతకు గురై మృతి చెందాడు. శుక్రవారం మధ్యాహ్నం పొలాల నుండి రామచంద్రారెడ్డి ఇంటికి వస్తుండగా వడదెబ్బ తగిలి అస్వస్థతకు గురయ్యాడు. శనివారం ఉదయం కోట ఆసుపత్రికి తరలించగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు బంధువులు తెలిపారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh