online marketing

Thursday, May 2, 2013

ఒక్కసారిగా భగ్గుమన్నాయి. జిల్లా కన్వీనర్‌.......తొలి రోజే చేదు అనుభవం......


నెల్లూరు - నెల్లూరు నాయకుల మధ్య ఉన్న విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. జిల్లా కన్వీనర్‌గా ఎన్నికైన మేరిగ మురళీధర్ మొదటిసారిగా బుధవారం నెల్లూరుకు రాగా, ఆయనకు స్వాగతం పలుకుతూ పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. అయితే, ఈ కార్యక్రమానికి ఏడు నియోజకవర్గాల సమన్వయకర్తలు డుమ్మా కొట్టారు. అంతేగాక నిన్నటి వరకు వైసీపీ జిల్లా కార్యాలయం పేరుతో ఉన్న బోర్డు రాత్రికి రాత్రే అదృశ్యమైంది. ఆ స్థానంలో పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేరుతో బోర్డు వెలసింది. వెంకటగిరి సమన్వయకర్త కొమ్మి లక్ష్మయ్యనాయుడు నియామకంపై ఆ నియోజకవర్గ నేతలు ఘర్షణకు దిగారు. దీంతో కొత్త కన్వీనర్‌కు తొలి రోజే చేదు అనుభవం ఎదురైంది.

వైసీపీ ఆవిర్భావం నుంచి జిల్లా కన్వీనర్‌గా ఉంటున్న కాకాణికి ఉద్వాసన పలకాలని అధిష్ఠానం నిర్ణయించింది. ఇది తెలుసుకున్న కాకాణి ముందుగానే జిల్లా కన్వీనర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డిల వర్గీయుడు పాపకన్ను రాజశేఖర్‌రెడ్డి ముఖ్య అనుచరుడు మేరిగ మురళీధర్‌కు జిల్లా పార్టీ పగ్గాలు అప్పగించారు.

కొత్త కన్వీనర్‌కు ఘన స్వాగతం పలికేందుకు జిల్లాలోని పార్టీ ముఖ్యులందరికీ రెండు రోజుల క్రితమే వర్తమానం పంపి, హాజరు కావాలని పిలుపునిచ్చారు. విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకుని పినాకినీ ఎక్స్‌ప్రెస్‌లో నెల్లూరుకు చేరిన మురళీధర్‌కు రైల్వేస్టేషన్‌లో నగర కన్వీనర్ ఆనం వెంకటరమణారెడ్డి, రూరల్ కన్వీనర్ కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిలతో పాటు పలువురు నాయకులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఊరేగింపుగా గాంధీబొమ్మ సర్కిల్‌కు చేరుకుని గాంధీ, వైఎస్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

మళ్లీ ర్యాలీగా బయలుదేరి కలెక్టర్ బంగ్లా వద్ద ఉన్న వైసీపీ జిల్లా కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడే కారు పార్కింగ్ స్థలంలో విలేఖర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటగిరి నియోజకవర్గానికి వలస నేతలు అవసరం లేదని, పార్టీ నడిపే సత్తా స్థానికులకు ఉందని నెమ్మలపూడి సురేష్‌రెడ్డి ఆధ్వర్యంలో కొందరు మురళీధర్‌తో వివాదానికి దిగారు. తక్షణం కొమ్మి లక్ష్మయ్యనాయుడును వెనక్కు పంపించాలంటూ కార్యకర్తల అరుపులు, కేకలతో ఘర్షణకు దిగారు. దీంతో ఆలస్యంగా మేల్కొన్న కొంతమంది నాయకులు వారికి సర్దిచెప్పి, అక్కడి నుంచి పంపేశారు.

అదృశ్యమైన బోర్డు

రెండేళ్ల క్రితం జిల్లా కన్వీనర్‌గా బాధ్యతలు చేపట్టిన కాకాణి గోవర్ధన్‌రెడ్డి కలెక్టర్ బంగ్లా వద్ద ఓ ఇంటిని అద్దెకు తీసుకుని పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తూ వచ్చారు. అప్పట్లో నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఈ కార్యాలయాన్ని ప్రారంభించారు. కాలక్రమేణా మేకపాటి, కాకాణిల మధ్య విభేదాలు తీవ్రం కావడంతో మేకపాటి సోదరులు, వారి వర్గీయులు మేకపాటి అతిథి గృహంలోనే పార్టీ కార్యక్రమాలు, సమావేశాలు నిర్వహిస్తూ వచ్చారు. దీంతో జిల్లా పార్టీ కార్యాలయం బోసిపోయింది. కన్వీనర్ బాధ్యతల నుంచి తనను తప్పించాలని మేకపాటి సోదరులు ప్రయత్నిస్తున్నారని తెలుసుకున్న కాకాణి కూడా ఆ కార్యాలయం వైపు చూడటం మానేశారు. ఈ నేపథ్యంలోనే పార్టీ జిల్లా కన్వీనర్‌గా మేరిగ మురళీధర్ నియమితులు అయ్యారు. ఈయన రాకకు ముందురోజే మంగళవారం రాత్రి జిల్లా పార్టీ కార్యాలయం బోర్డు అదృశ్యమైంది. ఆ స్థానంలో 'వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యనిర్వాహక కమిటీ సభ్యుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి వారి కార్యాలయం'' పేరుతో బోర్డు వెలిసింది. పార్టీ కార్యాలయానికి చేరుకున్న మేరిగ ఆయన అనుచరులు ఈ బోర్డును చూసి అవాక్కయ్యారు. దీంతో కార్యాలయంలోకి అడుగు పెట్టకుండా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, కన్వీనర్ మేరిగ మురళీధర్ తదితరులు కారు పార్కింగ్ స్థలంలోనే సమావేశం నిర్వహించి నిష్క్రమించారు.

సమన్వయకర్తల డుమ్మా

వైసీపీ జిల్లా కన్వీనర్ మురళీధర్ స్వాగత కార్యక్రమానికి ఏడు నియోజకవర్గ సమన్వయకర్తలు డుమ్మా కొట్టారు. ఆత్మకూరు, కోవూరు, కావలి, నెల్లూరు సిటీ, వెంకటగిరి, సూళ్లూరుపేట, సర్వేపల్లి నియోజకవర్గాల కన్వీనర్లు ఇటు వైపు కన్న్తెత చూడలేదు. నెల్లూరు సిటీ సమన్వయకర్త అనిల్ నెల్లూరులోనే ఉన్నా ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. వీరంతా కాకాణి వర్గం కావడంతో హాజరు కాలేదని ఆ పార్టీ నేతలే బహిరంగంగా చర్చించుకుంటున్నా రు. ఓ ముఖ్యనేత మాట్లాడుతూ ఓ దళితుడికి పదవి ఇవ్వడంపై ఇష్టంలేకే కొందరు ఇలా చేస్తున్నారని అన్నారు. కనీసం వారం రోజుల తరువాత అయినా వైసీపీ కార్యాలయ బోర్డు మార్చి ఉంటే ఈ రగడ జరిగేది కాదన్నారు. మరో నేత ఈ వివాదాన్ని రాద్దాంతం చేయవద్దంటూ పేర్కొన్నారు.
sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh