online marketing

Thursday, December 17, 2009

SALTY COFFEE

He met her on a party. She was so outstanding, many guys chasing after her, while he was so normal, nobody paid attention to him. At the end of the party, he invited her to have coffee with him, she was surprised, but due to being polite, she promised. They sat in a nice coffee shop, he was too nervous to say anything, she felt uncomfortable, she thought, please, let me go home.. Suddenly he asked the waiter:

"Would you please give me some salt? I'd like to put it in my coffee."

Everybody stared at him, so strange! His face turned red, but, still, he put the salt in his coffee and drank it.

She asked him curiously: why you have this hobby?

He replied: "when I was a little boy, I was living near the sea, I liked playing in the sea, I could feel the taste of the sea, just like the taste of the salty coffee. Now every time I have the salty coffee, I always think of my childhood, think of my hometown, I miss my hometown so much, I miss my parents who are still living there".

While saying that tears filled his eyes. She was deeply touched.

That's his true feeling, from the bottom of his heart. A man who can tell out his homesickness, he must be a man who loves home, cares about home, has responsibility of home.. Then she also started to speak, spoke about her faraway hometown, her childhood, her family.

That was a really nice talk, also a beautiful beginning of their story. They continued to date. She found that actually he was a man who meets all her demands; he had tolerance, was kind hearted, warm, careful. He was such a good person but she almost missed him!

Thanks to his salty coffee! Then the story was just like every beautiful love story, the princess married to the prince, then they were living the happy life... And, every time she made coffee for him, she put some salt in the coffee, as she knew that's the way he liked it.

After 40 years, he passed away, left her a letter which said: "My dearest, please forgive me, forgive my whole life lie. This was the only lie I said to you---the salty coffee. Remember the first time we dated? I was so nervous at that time, actually I wanted some sugar, but I said salt It was hard for me to change so I just went ahead.

I never thought that could be the start of our communication! I tried to tell you the truth many times in my life, but I was too afraid to do that, as I have promised not to lie to you for anything..
Now I'm dying, I afraid of nothing so I tell you the truth: I don't like the salty coffee, what a strange bad taste.. But I have had the salty coffee for my whole life! Since I knew you, I never feel sorry for anything I do for you. Having you with me is my biggest happiness for my whole life. If I can live for the second time, still want to know you and have you for my whole life, even though I have to drink the salty coffee again".

Her tears made the letter totally wet.

Someday, someone asked her: what's the taste of salty coffee? It's sweet. She replied.

**********

Love is not 2 forget but 2 forgive

Not 2 c but 2 understand

Not 2 hear but 2 listen

Not 2 let go but HOLD ON !!!!

రాజకీయ సంక్షోభానికి టిడిపి, కాంగ్రెస్సే కారణం

కట్టంగూర్‌ మేజర్‌న్యూస్‌ : రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షో బానికి అధికార కాంగ్రెస్‌ పార్టి, ప్రతి పక్ష పార్టి టిడిపి, ప్రజారాజ్యం పార్టి లే ప్రధాన కారణమని జిల్లా బిజెపి అధ్యక్షుడు గోలి మదుసూధ న్‌రెడ్డి ఆరోపించారు. కట్టంగూర్‌ మం డల కేంద్రంలో బుధవారం మండల బిజెపి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా పా ల్గోని ఆయన మాట్లాడు తూ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు విషయం లో రాష్ట్ర కాంగ్ర ెస్‌ ప్రభుత్వం, కేంద్ర యుపిఎ ప్రభుత్వాలకు చిత్తశుద్ది లేదన్నా రు. రాష్ట్ర శాస నసభలో ఒక నిర్ణిత కాల వ్యవది నిర్ణయించకుండా జాప్యం చేస్తున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్ర శాసనసభలో తీర్మాణం లేకుండా నేరుగా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి వెంటనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని బిజెపి డిమాం డ్‌ చేస్తుందన్నారు.కోస్తా, ఆంధ్ర, ప్రజా ప్రతినిధులు రాజీనామా చేయడం కాంగ్రెస్‌, టిడిపి, పిఆర్పీ అధినేతలు అడించే నాటకమన్నారు. కేంద్రం నుండి రాష్ట్రానికి లిఖిత పూర్వకమైన విధివిధానాలతో రూపొందించిన ఉత్వర్వులును జారి చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌, టిఆర్‌ఎస్‌ పార్టిలు కలిసి పొటిచేసి అధి కారంలోకి రాగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయకుండా జాప్యం చేస్తు ప్రజలను మభ్యపెడుతూ కాలం గడిపిందన్నారు.కేంద్రంలో ఉన్న యుపిఎ ప్రభుత్వం త్వరితగతిన పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశ పెట్టాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తీర్మాణం చేయడం జరిగిందన్నారు. తెలంగాణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని కోరుతూ జిల్లాలో ఈ నెల 18, 19, 20వ తేదిలలో బిజెపి రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుందని ఈ కార్యక్రమంలో తెలంగాణ విషయంలో కాంగ్రెస్‌, టిడిపి, పిఆర్‌పి అడే నాట కాలను ప్రజలకు తెలియచేయటం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ సమివే శంలో రాష్ట్ర బిజెపి దళిత మోర్చా కార్యవర్గ సభ్యులు నకిరేకంటి మొగి లయ్య, బిజెపి దళిత మోర్చా అధ్యక్షులు గోలి ప్రభాకర్‌, అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్‌ పాల్వాయి బాస్కర్‌, గాదగోని శ్రీనివాస్‌గౌడ్‌, కొమటి బాస్కర్‌, ముడుగు రామ లింగయ్య, యాదగిరి, రాజు, బిక్షపతి, యాదయ్య పాల్గోన్నారు.

బాంబ్‌దాడులతో దద్దరల్లిన బాల్నేపల్లి

దామరచర్ల, మేజర్‌న్యూస్‌: రాజకీయ కక్షలతో అటు ్టడుకుతున్న మండలంలోని బాల్నే పల్లి గ్రామం బాంబు దాడులతో గు రువారం దద్దరిల్లింది. ఇరువర్గాల వారు ఒకరిపై ఒకరు బాంబులు, రా ళ్ళు విసురుకుంటూ సుమారు రెం డు గంటలపాటు దాడులకు పాల్ప డ్డారు. ఈ సంఘటనకు సంబంధిం చిన పుర్వాపరాలు ఇలా ఉన్నాయి. గ్రామ సమీపంలో కృష్ణానదిపై నిర్మి స్తున్న టెయిల్‌పాండ్‌కు కంకరను తరలిస్తున్న ఒక టిప్పర్‌ గ్రామంలో ఒక కుక్కను ఢీ కొనడంతో అది అక్క డికక్కడే మృతిచెందింది. తమ కు క్కను చంపేశారంటూ ఒక వర్గం వారు టిప్పర్‌ను రోడ్డుపైనే నిలిపివే శారు.పొలంనుంచి పత్తిబస్తాలను ఎడ్లబండిపై గ్రామంలోకి తీసుకు వస్తున్న మరోవర్గంవారు రోడ్డుపైగల టిప్పర్‌ను పక్కకుతీయాలని కోర డం తో అందుకు వారు నిరాక రించడంతో ఘర్షణ నెలకొన్నది. దీంతో ఒక వర్గంవారు మరొక వర్గం వారిపై బాంబులు, రాళ్ళతో దాడుల కు పాల్పడ్డారు. గ్రామం మొత్తం బాంబుదాడులతో మార్మోగింది, బాంబులు ఎవరిమీద పడుతాయో ఏం జరుగుతుందోనని... ప్రజలు ఇళ్ళల్లోకి దూరి పిల్లలతో గొళ్ళాలు పెట్టుకున్నారు. పాత కక్షలే కారణం: బాల్నేపల్లి గ్రా మంలో ఎంతోకాలంగా వర్గపోరు కొనసాగుతుంది. పార్టీలవారు వర్గా లుగా ఏర్పడి దాడులకు పాల్పడటం జరుగుతుంది. ఈ నేపధ్యంలో ఆగ ష్టు 3వతేధీన గ్రామ సర్పంచ్‌ కె. హరినారాయణ, నీటి సంఘం చైర్మ న్‌ తావూర్యాలను గ్రామంలోని ప్ర త్యర్థివర్గం దారుణంగా నరిి చం పారు. ఇటీవల బైల్‌పై నిందితులు విడుదల కావడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో కుక్కను అడ్డుపెట్టు కొని ఒకరిపై ఒకరు బాంబులతో దా డులు చేసుకున్నారు.
పోలీసుల తనిఖీలు...బాంబుదాడుల నేపధ్యంలో గ్రా మంలో పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ లు నిర్వహిస్తున్నారు. ఇళ్లు.. ఇళ్ళు తిరుగుతూ బాంబులు, ఇతరత్రా మారణాయుదాలు ఏవైనా ఉన్నాయే మోనని పరిశీలిస్తున్నారు. మిర్యాల గూడ డిఎస్పీ జనార్దన్‌రెడ్డి ఆధ్వర్యం లో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బందోబస్తు... బాంబుదాడుల నేప ధ్యంలో గ్రామంలో ఎలాంటి అ వాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా వాడపల్లి ఎస్‌ఐ. నాగదుర్గాప్రసాద్‌, మిర్యాలగూడ రూరల్‌ ఎస్‌.ఐ రవీందర్‌, హాలియా ఎస్‌ఐల ఆధ్వర్యంలో గ్రామంలో బందోబస్తు నిర్వహిస్తున్నారల్లి

తెలంగాణ కోసం న్యాయవాది ఆత్మహత్య

మోత్కూరు, మేజర్‌న్యూస్‌ : తెలంగాణప్రత్యేకరాష్ట్ర ఏర్పాటుకు సమైక్యాంధ్ర ఉద్యమం ఆటంకం అవుతుందనే మనస్తాపంతో మం డలంలోని దాచారం గ్రామానికి చెం దిన రంగారెడ్డిజిల్లా ఎల్‌బినగర్‌ కో ర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్న తెలంగాణవాది ఎండ్లపల్లి దయాకర ్‌రెడ్డి (40)తననివాసంలో ఉరివేసు కొని ఆత్మహత్యకు పాల్పడడంతో మండలంలో విషాదచ్ఛాయలు అలు ముకున్నాయి.తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకోసం జరిగే పోరాటా లలో తెలంగాణ న్యాయవాదుల సం ఘం నుంచి ప్రధానపాత్ర పోషిస్తు న్నట్లు సమాచారం. కెసిఆర్‌ ఆమ రణ దీక్షతో కేంద్రప్రభుత్వం స్పం దించి ప్రత్యేకతెలంగాణ రాష్ట్ర ఏర్పా టుపై స్పష్టమై ప్రకటన చేయడంతో రంగారెడ్డి జిల్లా ఎల్‌బినగర్‌ కోర్టు న్యాయ వాదులతో దయాకర్‌రెడ్డి విజ యోత్సవర్యాలీని ఆనందోత్సవా లతో నిర్వహించినట్లు సమాచారం. ఇటీవల సీమాంద్రనాయకులు, ప్ర జాప్రతినిధులు సమైక్యాంధ్ర కోసం చేస్తున్న ఆందోళన కార్యక్రమాలు కేంద్రప్రభుత్వం నిర్ణయాన్ని ఉపసం హరించుతాయనే భాద దయాకర్‌ ్‌రెడ్డిలో కల్గి మనోవేధనగా ఉన్నట్లు తెలిసింది.తనఆత్మహత్య కొంతవరకైనా తెలంగాణప్రజలలో ఉన్న బల మైన ఆకాంక్షను ప్రభుత్వానికిచూపి మే ల్కొల్పుతుందనే ఉద్ధేశ్యంతో మరణ వాంగ్మూలాన్ని రాసుకుని తమ జేబు లో పెట్టుకొని బుధవారం రాత్రి తన నివాసంలో ఉరివేసుకొని ఆత్మ హ త్యకు పాల్పడినట్లు బందువులు తెలి పారు. దయాకర్‌రెడ్డి మరణ వా ర్తతో స్వగ్రామం దాచారంలో విషాద చ్ఛాయలు అలుముకున్నాయి. ద యాకర్‌రెడ్డికి ఇద్దరు పిల్లలు ఉన్నా రు. భార్యవాసవి తల్లిదండ్రు లు కొండల్‌రెడ్డి, లక్ష్మమ్మలు కన్నీరు మున్నీరుగా విలపించడం ప్రజలను కంట తడిపెట్టించింది.
దాచారంలో అంత్యక్రియలు
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు లక్ష్యంగా ప్రాణత్యాగంచేసిన న్యాయ వాది దయాకర్‌రెడ్డి అంత్యక్రియలు గురువారం మండలంలోని స్వగ్రా మమైన దాచారంలో నిర్వహించా రు. టిఆర్‌ఎస్‌ శాసనసభపక్ష నాయ కుడు ఈటలరాజేందర్‌, పార్టీపోలిట్‌ బ్యూరో సభ్యుడు గుంతకళ్ళ జగదీ శ్వర్‌రెడ్డి, టిఆర్‌ఎస్‌ నాయకులు కల్వల ప్రకాష్‌రాయుడు, జిలా ్లప్ర దాన కార్యదర్శి కంచర్ల రామ కృష్ణా రెడ్డి, మంచగోవర్ధన్‌, యాకూబ్‌రెడ్డి, శ్రీనివాస్‌తో పాటు తదితరులు పా ల్గొని మృతదేహానికి పూలమాలలు వేసి సంతాపాన్ని ప్రకటించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చారు.

ఉప్పెనలా ఉద్యమం

నెల్లూరు: సమైక్యాంధ్ర కోసం ఎమ్మెల్యేల మొదలు స్థానిక ప్రజాప్రతినిధులు, సామాన్య ప్రజానీకం వరకూ అందరూ తరతమ బేధాలు మరచి చేపట్టిన ఉద్యమం రోజురోజుకీ ఉధృతమై ఉప్పెనలా మారుతోంది. జిల్లా వ్యాప్తంగా వివిధ రాజకీయ పక్షాల, విద్యార్థి సంఘాల ఆందోళన, నిరసన కార్యక్రమాలు గురువారం కూడా కొనసాగాయి. నగరంలోని కెవిఆర్‌ పెట్రోల్‌ బంక్‌ సమీపంలో విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో జిల్లాకు చెందిన ఏడుగురు ఎంపీలతో పాటు కేంద్ర మంత్రి చిదంబరం, రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణరెడ్డిల తొమ్మిది తలల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. వీరంతా వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని విద్యార్థి నాయకులు డిమాండ్‌ చేశారు. నియోజకవర్గ కేంద్రాల్లో చేపట్టిన రిలే నిరాహారదీక్షలు గురువారం కూడా కొనసాగాయి. ఎప్పుడూ ఒకరిపై ఒకరు కారాలు, మిరియాలు నూరుకునే ప్రత్యర్థి పార్టీల నేతలు తమ ప్రత్యర్థి పార్టీ చేపట్టే నిరాహారదీక్షలకు హాజరై తమ సంఘీభావం తెలపడం విశేషం. ఈనెల 21, 22, 23 తేదీలలో సీమాంధ్రకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేల బృందం నెల్లూరు జిల్లాలో పర్యటించనుంది.

గ్రామస్థాయికి ఉద్యమాన్ని తీసుకెళ్లడమే తమ ధ్యేయమని మాజీ మంత్రి సోమిరెడ్డి పేర్కొన్నారు. పార్టీలు చేస్తున్న ఆందోళన కార్యక్రమాలకు అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులు సైతం తమ మద్దతు తెలపడం విశేషం. ముఖ్యంగా ఆటో, టాక్సీ డ్రైవర్లు తమ వాహనాల ముందు భాగంలో సమైక్యాంధ్ర కావాలనే బ్యానర్లను ప్రదర్శిస్తున్నారు. కళాకారులు సైతం ఉద్యమంలోకి అడుగుపెట్టారు. నగరంలో 5గురు కార్పొరేటర్లు తమ పదవులకు రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించారు. రాజీవ్‌ భవన్‌ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నగరంలో వినూత్న నిరసనలు చేపడుతున్నట్లు డిపిసి సభ్యుడు వైవి రామిరెడ్డి ప్రకటించారు. టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి నేతృత్వంలో నగరంలోని గాంధీబొమ్మ సెంటర్‌ వద్ద టీడీపీ కార్యకర్తలు పొర్లుదండాలు పెడుతూ వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు.

ఈనెల 25న జిల్లాకు చిరంజీవి

ఫత్తేఖాన్‌పేట: ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ఈనెల 25వ తేదీ జిల్లాకు రానున్నారు. సమైక్యాంధ్రకు మద్దతు పలికిన చిరంజీవి తదుపరి కార్యాచరణలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించేందుకు నిర్ణయించారు. తొలుత తిరుపతిలో తన పర్యటనను ప్రారంభించే ఆయన ఈనెల 25న నెల్లూరుజిల్లాలో పర్యటించనున్నట్లు పిఆర్‌పీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే జిల్లాలో సమైక్యవాదన ఉద్యమరూపంలో ఉధృతంగా జరుగుతున్న తరుణంలో ఆ వాదనకు మద్దతు తెలిపేందుకు వస్తున్న చిరంజీవికి భారీ స్థాయిలో స్వాగత ఏర్పాట్లు చేసేందుకు పిఆర్‌పీ వర్గాలతో పాటు సమైక్యవాదులు సిద్ధమవుతున్నారు.

సమాజంతోపాటు కుటుంబాన్ని గుర్తుంచుకోండి

భక్తవత్సలనగర్‌ (నెల్లూరు):సమాజం కోసం జర్నలిస్టులు కలం పట్టి పనిచేయడమే కాకుండా స్వయంగా ఆరోగ్య పరిరక్షణకు, కుటుంబ సభ్యుల పోషణ పట్ల కూడా శ్రద్ధ చూపాలని జిల్లా కలెక్టర్‌ కె.రాంగోపాల్‌ జర్నలిస్టులకు సూచించారు. బుధవారం ఉదయం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని ఇటీవల దివంగతులైన ఆంధ్రజ్యోతి విలేకరి హనీఫ్‌, చైతన్యజ్యోతి సాయంకాల దినపత్రిక ఎడిటర్‌ కె.చెంగళరాజుల కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి రూ.50 వేలు ఆర్థిక సహాయాన్ని చెక్కు రూపంలో జిల్లా కలెక్టర్‌ కె.రాంగోపాల్‌ అందజేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ జర్నలిస్టులనుద్దేశించి మాట్లాడుతూ సమాజ శ్రేయస్సు కోసం కలంపట్టి పనిచేసే జర్నలిస్టులు వారి ఆరోగ్యం గురించి, వారి కుటుంబ సభ్యుల గురించి కూడా ఆలోచన చేయాలని పేర్కొన్నారు. జర్నలిస్టులు 24 గంటలు శ్రమిస్తూ తరచూ అనేక వత్తిడులకు గురవుతున్నారని, దాని నుండి బయటపడి ఆరోగ్యాన్ని కాపాడుకోడానికి ఒక గంటసేపు యోగా, కాలి నడక, వ్యాయామాలను చేయడానికి సమయాన్ని కేటాయించుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు పాత్రికేయులు దివంగత విలేకరులను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమం ఎపియుడబ్ల్యుజె ప్రింట్‌ మీడియా, ఎలక్ట్రానిక్‌ మీడియా, అధ్యక్షులు ఎ.జయప్రకాష్‌, భాస్కర్‌రెడ్డిల అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో వెంకటసుబ్బయ్య, శ్రీరామచంద్రమూర్తి, చలపతి, కృష్ణాపత్రిక రిపోర్టర్‌ సుధాకర్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా, ప్రింట్‌ మీడియా పాత్రికేయులు, సభ్యులు పాల్గొన్నారు.

Wednesday, December 16, 2009

ఆ బడికి.... నలుగురే విద్యార్థులు

ఆత్మకూరు:ప్రభుత్వం ఓ వైపు సంపూర్ణ అక్ష్యరాస్యత కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా ఆ లక్ష్యం నీరుగారిపోతోంది. మండలంలోని వెన్నవాడ గ్రామ దళితవాడలో పాఠశాలను చూస్తే అధికారుల పనితీరు ఎలా ఉందో అర్థమవుతోంది. వివరాల్లోకి వెళ్లితే.... వెన్నవాడ దళితవాడలోని సామాజిక భవనంలో విద్యాభ్యాసం కొనసాగుతోంది. అక్కడ 20 కుటుంబాలు దళితులు జీవనం గడుపుతున్నారు. అయితే అక్కడ పని చేసే ఉపాధ్యాయులు సక్రమంగా పనిచేయకపోవడమే నేడు ఆ పాఠశాల కేవలం నలుగురి విద్యార్థులకే పరిమితమైందని చెప్పవచ్చు. గతంలో పని చేసే ఉపాధ్యాయుడు సక్రమంగా పని చేయలేదని స్థానికులు అంటున్నారు. ప్రభుత్వం నూతన పాఠశాల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తే ఆ నిర్మాణం అసంపూర్తిగా ఉంది. స్థానికంగా ఓ వ్యక్తి భవనాన్ని నిర్మిస్తూ అనారోగ్యానికి గురై అక్కడ పని చేసే ఉపాధ్యాయునికి బాధ్యతలు అప్పగించారు.

అయినా ఆ భవనం పూర్తి కాలేదు. దీంతో కాలనీకి అవసరమైన సామాజిక భవనమే పాఠశాలగా మారింది. వర్షం వస్తే నిలిచే పరిస్థితి లేదు. కేవలం పది మంది విద్యార్థులు అక్కడ హాజరవుతున్నట్లు రికార్డులు చెబుతుంటే కేవలం ఐదుగురు ప్రతి రోజు బడికి వస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఓ ఉపాధ్యాయుడు అక్కడ పని చేస్తున్నాడు. విద్యార్థులు ఎందుకు లేరని ప్రశ్నిస్తే ఉండేది పది మందే, నేడు వచ్చింది ఐదుగురు మాత్రమేనని తాను వచ్చిన తర్వాత సామాజిక భవనంలో విద్యాబోధనకు అవసరమైన సమాచారాన్ని ఏర్పాటు చేయించానని ఉపాధ్యాయుడు వివరించారు. ప్రతి నెలలో విద్యాశాఖాధికారి కొన్ని పాఠశాలలను తనిఖీ చేయాలి. ఎమ్మార్పీలు కొన్నిపాఠశాలలను తనిఖీ చేయాల్సి ఉంది. అయితే ఆ గ్రామంలో దళితకాలనీలో చిన్నారుల అగచాట్లను ఏ అధికారి పరిశీలించినట్లు లేదు.



నిరుపయోగంగా మరుగుదొడ్లు

అసంపూర్తిగా ఉన్న పాఠశాల భవనానికి మరుగుదొడ్లు మంజూరయ్యాయి. పనులు పూర్తి చేశారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. అయితే పాఠశాల భవనాన్ని పట్టించుకున్న దాఖల్లేవు. మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన అధికారులు సమీపంలో ఉండే పాఠశాల కనిపించకపోవడం అధికారుల పనితీరును ప్రశ్నిస్తుంది.


ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలి

మండలంలో విద్యాబోధనపై అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాల్సి ఉంది. గతంలో అక్కడ పని చేసే ఉపాధ్యాయుడు పనితీరు ఇందుకు కారణమని స్థానికులు అంటున్నారు. మరి వేలకువేలు ప్రభుత్వ సొమ్మును జీతాలుగా తీసుకుంటూ కేవలం నాలుగైదుగురికి చదువు చెబుతూ ఉపాధ్యాయులు కాలం గడుపుతున్నారు. మరి ఇలా అయితే ప్రభుత్వ లక్ష్యం ఎలా నెరవేరుతుంది. ఇకనైనా స్పందించి అసంపూర్తి భవనాన్ని పూర్తి చేయాలి. ఆ కాలనీలో చిన్నారులందరు బడికి వచ్చేలా అవగాహన కల్పించాలి. మరి ఎప్పటికి ఇలా జరుగుతుందో చూడాల్సి ఉంది

సమైక్యాంధ్రే ధ్యేయం

నెల్లూరు: సమైక్యాంధ్రే ధ్యేయంగా ఎంతటి పోరాటానికైనా తాము సిద్ధమని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. టీడీపీ ఆధ్వర్యంలో నగరంలోని గాంధీబొమ్మ సెంటర్‌లో రిలే నిరాహారదీక్షా శిబిరం ప్రారంభమైంది. ఈ శిబిరంలో దీక్షకు పాల్గొన్న సోమిరెడ్డి మాట్లాడుతూ అనాలోచిత నిర్ణయం తీసుకోవడంలో తొందరపాటుగా వ్యవహరించిన కేంద్రప్రభుత్వం ప్రస్తుతం పెద్ద ఎత్తున ప్రజల నుంచి నిరసన వ్యక్తమవుతున్నా నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తోందని ధ్వజమెత్తారు. అన్ని రాజకీయ పక్షాల నేతలు పార్టీలకతీతంగా సమైక్యాంధ్రే ఉండాలంటూ తెలంగాణాను విభ జనను వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. తమ పార్టీ ఆధ్వర్యంలో అన్ని నియోజకవర్గ కేంద్రాలలో రిలే నిరాహారదీక్షలు కొనసాగుతాయని, ఒక్కో రోజు ఒక్కో అనుబంధ సంఘ నేతలు ఈ దీక్షలో పాల్గొంటారని అన్నారు.

ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని లేని పక్షంలో రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని హెచ్చరించారు. మాజీ మంత్రి తాళ్లపాక రమేష్‌రెడ్డి మాట్లాడుతూ తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా ద్విగుణీకృతం చేసిన దివంగత నందమూరి తారక రామారావు ఎప్పుడూ ఆంధ్రులంతా సమైక్యంగా ఉండాలనే కోరుకున్నారని గుర్తుచేశారు. ఆయన ఆశయాలను నెరవేర్చాల్సిన బాధ్యత టీడీపీ కార్యకర్తలతో పాటు ఆయన అభిమానులపైనా ఉందన్నారు. ఈ శిబిరంలో టీడీపీ నేతలు కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, నూనె మల్లికార్జునయాదవ్‌, తాళ్లపాక అనూరాధ, వై.వి.సుబ్బారావు, మండవ రామయ్య, అంచెల వాణి, కె.వి.శేషయ్య, బొమ్మి సురేంద్ర, కోడూరు కమలాకర్‌రెడ్డి, సోమిరెడ్డి శ్రీనివాసులరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tuesday, December 15, 2009

ఐరన్‌ఓర్‌లారీలతో హడలిపోతున్న డ్రైవర్లు

రాపూరు: రాపూరు-చిట్వేల్‌ ఘాట్‌రోడ్డులో ఐరన్‌ఓర్‌లారీల జోరుతో ఆర్‌టీసి డ్రైవర్లు హడలిపోతున్నారు. నిత్యం రాపూరు నుండి కడపజిల్లాకు చిట్వేల్‌ మీదుగా పెద్దసంఖ్యలో ఈ వాహనాలు తరలిపోతున్నా వాటికి కళ్ళెం వేయలేకపోతుండటం గమనార్హం. అయితే ఈ వాహనదారులవల్ల నిత్యం రాపూరు-చిట్వేల్‌ ఘాట్‌లో సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ లారీలు ఇష్టానుసారం అతివేగంగా తిరుగుండటంతో వాటిని ఆపి కంట్రోల్‌ చేసేవారులేక పోవడం విశేషం. రాపూరు-చిట్వేల్‌ ఘాట్‌లో ముందే ప్రమాకర మలుపు ఉన్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని డ్రైవర్లు ఆప్రమత్తమంగా వ్వవహరిస్తున్నారు. అయితే ఆర్‌అండ్‌బిశాఖ ఇక్కడ మాత్రం ప్రమాద సూచిక బోర్డులు, జంగిల్‌ క్లియరెన్స్‌ చేపట్టకపోవడంతో డ్రైవర్లు అల్లాడిపోతున్నారు.

భారీ వాహనాలు ఈ మార్గాన్ని ఎన్నుకోవడంతో ఈ ప్రాంతంలో వాహనదారుల వేగానికి అడ్డుకట్ట వేయలేకోయింది. రాపూరు-చిట్వేల్‌ ఘాట్‌లో ఏదైన ప్రమాదాలు జరిగిన స్పందించేవారు లేకుండా ఉన్నారు. అలాగే ఎదైన ప్రమాదం జరిగినా అక్కడ సెల్‌టవర్లుకూడా పనిచేయకుండా ఉన్నాయి. ఈ విధంగా అనేక సమస్యలు ఘాట్‌లో ఉన్నాయి. రోడ్డుకూడా సక్రమంగాలేకపోవడంతో డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నారు. సమస్యలు ఘాట్‌లో విలయతాండవం చేస్తుంటే అధికారులు మాత్రం వీటిపై దృష్టిపెట్టేవారు లేరని ప్రయాణీకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు దీనిపై దృష్టిపెట్టవలసిన అవసరం ఎంతైనావుంది.

పెచ్చులూడి టీచరు, విద్యార్థినికి గాయాలు

రాపూరు: మండల కేంద్రమైన రాపూరులోని హింధూ ప్రాధమిక పాఠశాల భవనం ఒరండా పెచ్చులూడి పఠాన్‌ గౌస్‌మెహిద్దీన్‌ అనే ఉపాధ్యాయునిి , 1వ తరగతి చదివే ఉప్పలపాటి అనిత అనే విద్యార్థినికి తలకు గాయాలైనాయి. వివరాల్లోనికి వెళితే. హింధూ ప్రాధమిక పాఠశాల భవనాలు శిధిలావస్థకు చేరుకున్నాయి. దీనికి తోడు భవనాలపైన వర్షపునీరు చేరివుంది. దీంతో అక్కడక్కడా పెచ్చులూడ సాగాయి. 1వ తరగతి ఒరండాలో జరుగుతుండగా ఒక్కసారిగా పెచ్చులూడి ఆ ఉపాధ్యాయుని తలపై పడటంతో అతనికి తీవ్రగాయంకాగా, పక్కనేవున్న అనితకు స్వల్పగాయమైంది.

దీంతో మరో టీచర్‌ నాదానందరావు అతన్ని రాపూరు ప్రభుత్వ వైద్యశాలకు చికిత్స నిమిత్తం తీసుకెళ్ళారు. సమాచారం తెలుసుకున్న రాపూరు ఎంపిడిఒ ఇ వాణి సంఘటన స్థాలనికి చేరుకొని జరిగిన సంఘటనపై ఆ స్కూల్‌ హెచ్‌ఎం వై నాగభూషణంను అడిగి తెలుసుకున్నారు. వెంటనే విద్యార్థులను ప్రశ్నించగా హెచ్‌ఎం అక్కడ క్లాసులు నిర్వహించవద్దని చెప్పారని తెలిపారు. అయితే ప్రత్యాన్మాయం లేకపోవడంతో అక్కడ క్లాసులు నిర్వహించినట్లు వారు తెలిపారు.

ఆమె జడ్పీ సిఇఒ రామిరెడ్డికి జరిగిన సంఘటనపై తెలిపింది. అనంతరం ఆయన జిల్లా విద్యాశాఖాధికారి ఆంజనేయుల దృష్టికి తీసుకొని పోవడంతో ఆయన ఎంఇఒ కె జగదీశ్వర్‌ను జరిగిన సంఘటనపై ప్రశ్నించారు. సమాచారం తెలుసుకున్న ఎంఇఒ జరిగిన సంఘటనపై ఉపాధ్యాయులను అడిగి తెలుకున్నారు. అనంతరం గాయపడ్డ బాలికను పరిశీలించారు. గురువారం నుండి ఆ పాఠశాలలో ప్రత్యాన్మాయ చర్యలు తీసుకొని విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూస్తామని ఎంఇఒ తెలిపారు. గాయపడిన టీచరు మెరుగైన వైద్యంకోసం నెల్లూరు తరలించారు. ఈ కార్యక్రమంలో రాపూరు విఆర్‌ఒ ఎం రాజగోపాల్‌రెడ్డి పాల్గొన్నారు

ద్విచక్ర వాహనాల చోరీలకు అంతేది?

నెల్లూరు(క్రైం) : నగరంలో రోజు రోజుకూ ఏ మూల చూసినా ద్విచక్ర వాహనాల చోరీలు ఎక్కువైనాయి. వీటిని అరికట్టడానికి అంతే చిక్కడం లేదు. ప్రతి రోజూ నగరంలోని పోలీస్‌ స్టేషన్‌ పరిధుల్లో ద్విచక్ర వాహనాలు పోయినాయని కేసులు నమోదు కావడం పరిపాటైపోయింది. కొంతమంది వాహనాలు పోగొట్టుకున్నవారు నిరాశతో కేసు పెట్టకుండా మానుకుంటున్నారు. ఒకవేళ వాహనం పోయిన వ్యక్తి కేసు పెట్టడానికి క్రైం పోలీస్‌స్టేషన్‌కు వెళ్తే వచ్చిన వ్యక్తిని ఏదో క్రైం చేసినవాడిలాగా చూస్తున్నారని పలువురు విమర్శలు కురిపిస్తున్నారు.

4వ నగర పరిధిలో గత ఏడాది మోటార్‌ సైకిల్‌ పోగొట్టుకున్న వ్యక్తి దొంగను పట్టించి వాహనం ఎక్కడున్నది కూడా వివరాలు అందజేస్తే దాని విషయంలో అధికారి ఒకరు చొరవ చూపించి ఆమ్యామ్యాలతో కేసును మాఫీ చేసినట్టు సమాచారం. నగర పరిధిలో ఐదు లా అండ్‌ ఆర్డర్‌, క్రైం పోలీస్‌ స్టేషన్‌లతోపాటు బాలాజీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌లలో పనిచేస్తున్న మొత్తం సిబ్బంది వందల సంఖ్యలో ఉన్నారు. అయితే ఈ స్టేషన్ల పరిధుల్లో ఎవరైనా చోరీ చేస్తూ అతని దురదృష్టవశాత్తు పోలీసులకు చిక్కితే ఆ స్టేషన్‌ అధికారులు అతన్ని ఏమీ అనకుండా నేరుగా సిసిఎస్‌ స్టేషన్‌కు హ్యాండ్‌ఓవర్‌ చేసి తమ పనైపోయింది బాబు అంటూ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ స్టేషన్‌లలో సీనియర్‌ పోలీస్‌ సిబ్బందేగాక, అత్యధిక విద్యావంతులు, తెలివిగలవారు ఉన్నప్పటికీ వారి పనితీరు బాగుండదనా లేక వారి సేవలు అనవసరం అన్నట్లుగా ఉంటున్నది. కేవలం నగరాన్ని శాసిస్తూ సిసిఎస్‌లో ఏళ్లతరబడి పాతుకుపోయిన ఆ నలుగురూ... చేసే సేవలే తప్ప మిగిలినవారివి తీసుకోవడంలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో గొప్పగొప్ప చదువులు చదివి పోలీసు ఉద్యోగంలో చేరినటువంటి యువతకు తమ ప్రతిభా పాటవాలను చూపించుకునే అవకాశాన్ని సిసిఎస్‌ ఇవ్వడం లేదు.

కేవలం అప్పుడెప్పుడో చేసిన రికవరీలు ఆధారంగా వారే గొప్ప అన్నట్లు, వారు లేందే మాకు దిక్కెవరు అంటున్న అధికారులు సైతం సిసిఎస్‌లో చూడవచ్చు. సినిమాల్లో ఎవరైనా ఒక పాత్ర వేస్తే ఆ పాత్రే వారికి జీవితాంతం దిక్కన్నట్లు సిసిఎస్‌లో కొలువుదీరివున్న సీనియర్‌ పోలీస్‌ సిబ్బంది బదిలీపై నగరంలోనే ఏదో ఒక స్టేషన్‌కు వె ళ్లినా, వారి కొలువులు మాత్రం సిసిఎస్‌లోనే చేయడం ఆనవాయితీ. ఇప్పటికే ఉడుకు రక్తానికి క్రైం ఇన్వెస్టిగేషన్‌ చేయడానికి అవకాశం ఇవ్వడంలేదని విమర్శలు ఉన్నాయి. నగరంలో ఇప్పటికే ఇబ్బడి ముబ్బడిగా చోరీలు చేస్తూ ద్విచక్ర వాహనాలను దొంగిలిస్తూ తమ చేతి వాటాన్ని ప్రదర్శించుకుంటున్న చోరీగాళ్లను పట్టుకోవడంలో విఫలమవుతున్న క్రైం పోలీసులు పాత పద్ధతులు వదలి నూతన ఒరవడికి అవకాశం ఇస్తే బాగుంటుందని పలువురి అభిప్రాయం.

28 నుంచి రొట్టెల పండుగ

నెల్లూరు : నెల్లూరు నగరంలో ముస్లింలు, ముస్లిమేతరులు మతసామరస్యానికి ప్రతీకగా ఆచరించే రొట్టెల పండుగ ఈ నెల 28వ తేదీ నుండి 31వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు రూరల్‌ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి పేర్కొన్నారు. స్థానిక బారాషాహిద్‌ దర్గా వద్ద ఆదివారం ఉదయం వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం మెరుగైన సదుపాయాలతో, అంకిత భావంతో భక్తులకు సేవలు కల్పించి రొట్టెల పండుగను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ఆయన అన్నారు. దర్గా ఆవరణంలో లే అవుట్‌ ప్రకారం 293 అంగళ్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. వేలంద్వారా పొందిన షాపులను నిర్ణీత స్థలాల్లోనే ఏర్పాటు చేసుకోవాలన్నారు.

ఖాళీ ప్రదేశాన్ని ఆక్రమించకూడదని ఆయన పేర్కొన్నారు. 24 గంటలూ భక్తులకు తాగునీటి వసతి సదుపాయం, ఉచిత వైద్యసేవలు, విద్యుత్‌ దీపాలు, పారిశుద్ధ్య చర్యలు, గజ ఈతగాళ్లు, అగ్నిమాపక సౌకర్యాలు తదితర అంశాల ఏర్పాట్లను ఆయా శాఖల అధికారులతో సమాలోచనలు చేశారు. నగర ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి మాట్లాడుతూ దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. నగరానికి ప్రత్యేకతను సంతరింపచేసిన రొట్టెల పండుగకు దేశ, విదేశాల నుండి విచ్చేసే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలిగించకూడదని వివిధ శాఖల అధికారులను కోరారు.

డిఎస్‌పి రాధిక మాట్లాడుతూ రొట్టెల పండుగ జరిగే రోజుల్లో అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా భారీ పోలీసు బలగంతో రక్షణ, ట్రాఫిక్‌ నియంత్రణ, నేరాలను అదుపు చేయుట తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని చర్యలు చేపడుతున్నామన్నారు. వాహనాల పార్కింగ్‌కు పోలీస్‌ పెరేడ్‌ గ్రౌండ్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఇద్దరు సిఐలు, నలుగురు ఎస్‌ఐలు, 40 మంది సబ్‌ఇన్స్‌పెక్టర్లు, 180 మంది ఎఎస్‌ఐలు, 500 మంది పోలీస్‌ కానిస్టేబుళ్లు, 200 మంది హోంగార్డులు, 40 మంది ఆర్మ్‌డ్‌ పోలీసులను నియమిస్తున్నట్లు తెలిపారు. మేయర్‌ భానుశ్రీ మాట్లాడుతూ లక్షలాదిమంది భక్తులు పాల్గొనే ఈ రొట్టెల పండుగకు ఒక రోజు ముందునుండే మున్సిపల్‌ కార్పొరేషన్‌ సిబ్బందితో పారిశుద్ధ్య కార్యక్రమాలను 24 గంటలూ చేపడతామన్నారు. సిబ్బంది మూడు షిఫ్ట్‌లుగా విధులు నిర్వహిస్తూ ప్రతి షిఫ్ట్‌లోనూ 150 మంది పారిశుద్ధ్య కార్మికులు పనిచేసే విధంగా ప్రణాళికను రూపొందించామన్నారు.



హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక ఆహ్వానితులు

ఈ ఏడాది రొట్టెల పండుగ వేడుకలకు ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షులు చిరంజీవి, మజ్లిస్‌ పార్టీ ఎమ్మెల్యే అసుదుద్దీన్‌ ఓవైసి, వక్ఫ్‌ బోర్డు రాష్ట్ర నాయకులు, బారాషాహిద్‌ దర్గాకు సంబంధించిన పలువురు ప్రముఖులు పాల్గొంటారు. నెల్లూరు డివిజనల్‌ రెవెన్యూ అధికారి ఎం.వేణుగోపాల్‌రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ టిఎస్‌ఆర్‌.ఆంజనేయులు, ఎంఆర్‌ఒ భక్తవత్సలం, వివిధ శాఖల ప్రభుత్వాధికారులు, పలువురు మున్సిపల్‌ కార్పొరేటర్లు, వక్ఫ్‌బోర్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

విజయేశ్వరిదేవికి ఘనస్వాగత

రాపూరు: రాపూరు మండలం పెంచలకోనలోని భగవతి శ్రీశ్రీశ్రీ విజయేశ్వరిదేవి 5వ పార్లమెంట్‌ ఆఫ్‌ వరల్డ్‌ రిలీజియన్‌ ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ సిటీ మహాసభలో భారతదేశం తరపున తొలి మహిళా భారతీయురాలిగా ప్రసంగించి తిరిగి రావడంతో ఆదివారం ఆమెకు గూడూరు నుండి భారీ ర్యాలీతో రాపూరుకు చేరుకున్నారు. అడుగడుగా ఆమెకు విద్యార్థులు ప్లే కార్డులతో ఘనస్వాగతం పలికారు. అలాగే ఆమెను చూసేందుకు మహిళలు పెద్దసంఖ్యలో రాగ ఈప్రాంతమంతా మేళతాళాలతో కోలాహలం నెలకొంది. ఆమె స్థానిక సిద్దలయ్య దేవాలయ సెంటర్లో ప్రసంగించారు. వందకోట్ల భారతీయుల తరపున తొలి ఇండియా మహిళగా ప్రసంగించడం జరిగిందన్నారు. హిందూ మతానికి సంబంధి స్ర్తీల గురించి వివరించానన్నారు. తాను చేసిన ప్రసంగంపై విశేషస్పందన లభించిందన్నారు. అందరూ సుఖశాంతులతో ఉండాలని ఆమె కోరారు. ఆమె ప్రసంగించిన కొద్ది సమయానికి పెద్దసంఖ్యలో జనం గుమికూడినారు. పట్టణంలో ఆమెకు స్వాగతం పలుకుతున్న ఫ్లెక్సీబోర్డులు ఆకర్షణగా నిలిచాయి.

కండలేరు జలాశయం వద్ద ఉద్రిక్తత

రాపూరు‌: కేసీఆర్‌, చిదంబరం, పిళ్లైలకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌, టిడిపి నాయకులు మరికొందరు శనివారం చెనై్నకు గంగ నీటిని నిలుపుదల చేసిన కొన్ని గంటల్లోనే అధికారులు చెనై్నకు గంగ నీటిని విడుదల చేయడంతో కండలేరు జలాశయం వద్ద ఉద్రక్తత వాతావరణ నెలకొంది. సమైక్య నినాదంతో ఆందోళనకారులు ఆదివారం ఉగ్రరూపం దాల్చారు. కండలేరు జలాశయం హెడ్‌రెగ్యలేటర్‌ నుండి సాయిగంగ కాలువ ద్వారా 2వేల క్యూసెక్కుల నీటిని శనివారం రాత్రి 8గంటలకు గంగ అధికారులు గుట్టచప్పుడు కాకుండా విడుదల చేశారు. ఆదివారం సమాచారం తెలుసుకున్న రాపూరు ఎంపిపి సూర్యప్రకాష్‌యాదవ్‌, కాంగ్రెస్‌ నాయకులు ఎస్‌కె ముక్తియార్‌, తెలుగుదేశం నాయకులు దందోలు వెంకటేశ్వర్లురెడ్డి, ఆర్‌ రామచంద్రయ్య, మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమైక్యాంధ్రకోసం తాము పోరాడుతుంటే అధికారులు నిర్లక్ష్యంగా మళ్ళీ చెనై్నకు గంగ నీటిని తరలించడమేమిటని ప్రశ్నించారు. హెడ్‌రెగ్యులేటర్‌ వద్దగల డోమ్‌లైట్లు, కిటికీ అద్దాలు పగులకొట్టారు. సిబ్బంది మంచాలను ధ్వంసం చేశారు. సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో వాగ్వివాదానానికి దిగారు. ఆందోళనకారులు నీరు విడుదలచేసే యంత్రాలను నిలిపివేశారు. సమాచారం తెలుసుకున్న పొదలకూరు సిఐ అబ్దుల్‌ కరీమ్‌, రాపూరు, కండలేరు డ్యామ్‌ ఎస్‌ఐలు జయరావు, చంద్రశేఖర్‌లు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆందోళన కారులకు సర్థిచెప్పారు. గంగను చెనై్నకు నిలిపివేయడంతో శాంతించారు. అయితే అధికారులు ఉత్తర్వుల మేరకు ఆదివారం నుండి చెనై్నకు కండలేరు నుంటి నీటి విడుదల నిలిపివేస్తామని డిఇ ఎంఎ సుబ్రహ్మణ్యం తెలిపారు.

మార్మోగిన ఘంటానాదం

భక్తవత్సలనగర్‌ (నెల్లూరు):ప్రత్యేక తెలంగాణా పట్ల కేంద్ర ప్రభుత్వ హామీని తక్షణమే ఉపసంహరించుకోవాలని జడ్పీ చైర్మన్‌ కాకాణి గోవర్థన్‌రెడ్డి అన్నారు. నగరంలోని గాంధీబొమ్మ వద్ద సోమవారం ఎన్‌ఎస్‌యుఐ, యూత్‌ కాంగ్రెస్‌ల ఆధ్వర్యంలో నిర్వహించిన ఘంటానాదంను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమైక్య ఆంధ్రాను సాధించుకోడానికి అందరిపై బాధ్యత ఉందని తెలిపారు. తెలుగుభాష మాట్లాడేవారి కోసమే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడిందన్నారు. కొందరు విచ్ఛిన్న శక్తులు రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని చూస్తున్నారని, విద్యార్థి లోకం తరలి వచ్చి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. తమ ప్రాంతాల ప్రజల మనోభావాలను అధిష్టానం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన తెలిపారు. విద్యార్థి సంఘాలు శాంతియుతంగా ఉద్యమాలకు ఊపిరి పోయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని వెనక్కు తీసుకునేంతవరకు ఈ ఉద్యమం ఆగదని ఆయన పేర్కొన్నారు. అన్ని రాజీకీయ పార్టీలకు అతీతంగా అందరూ సమైక్య ఆంధ్రా కోసం పోరాడాలని ఆయన కోరారు. సిటీ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జ్‌ అనిల్‌కుమార్‌యాదవ్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలలో ఎక్కువశాతం సమైక్య ఆంధ్రానే కోరుకుంటున్నారన్నారు. తెలంగాణాలోని రెండు, మూడు జిల్లాలకు మాత్రమే ఈ తెలంగాణా వాదన పరిమితమైందని అన్నారు. ఈ ఘంటానాదం ఉద్యమంతో రోజు రోజుకూ ప్రజలను చైతన్యపరుస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. మంత్రులు రాజీనామా చేయాలి-పిసిసి కార్యదర్శి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిసమైక్య ఆంధ్రా కోసం సిఎంతో సహా ఇంకా కొనసాగుతున్న మంత్రులు రాజీనామా చేసి ఉద్యమాన్ని ఉధృతం చేయాలని ఆయన కోరారు. కెసిఆర్‌ నిరాహారదీక్ష చేస్తుంటే పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం నేడు ఎంపి లగడపాటి ఆమరణ నిరాహారదీక్షను అడ్డుకోవడం ఎంతవరకు న్యాయమని విమర్శించారు. కొందరు స్వార్థ రాజకీయ నాయకులు కావాలనే తెలంగాణా నినాదాన్ని అంటిపెట్టుకుని వేలాడుతున్నారని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రణాళికా మండలి సభ్యులు వైవి.రామిరెడ్డి, కార్పొరేటర్లు స్వర్ణా వెంకయ్య, మదన్‌మోహన్‌రెడ్డి, తాటి వెంకటేశ్వర్లు, రూప్‌కుమార్‌ యాదవ్‌, జడ్పీటిసి సభ్యులు, వీరి చలపతి, యూత్‌కాంగ్రెస్‌ నాయకులు శ్రీనివాసరావు, ఎన్‌ఎస్‌యుఐ నగర అధ్యక్షులు జివి.ప్రసాద్‌, విద్యార్థులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సముద్రంలో విద్యార్థి గల్లంతు

వాకాడు:సముద్ర స్నానానికై వెళ్లి తూపిలిపాళెం వద్ద సముద్రంలో బట్టా సునీల్‌ (20) అనే విద్యార్థి సోమవారం గల్లంతయ్యాడు. వాకాడు దళితవాడకు చెందిన బుజ్జమ్మ, బాలయ్యల మూడవ కుమారుడైన సునీల్‌ స్నేహితులతో కలిసి సముద్ర స్నానానికి వెళ్లాడు. సునీల్‌, ఈశ్వరయ్యలు సముద్రంలో దిగగా సముద్రం అలల తాకిడికి ఇద్దరు లోపలకెళ్లారు. దీనిని గమనించిన స్నేహితులు కస్తూరయ్యను మాత్రం రక్షించగలిగారని, సునీల్‌ గల్లంతయ్యాడు. మృతదేహం కోసం గాలింపుచర్యలు చేపట్టారు.

ఆగని సమైక్య జ్వాలలు

నెల్లూరు,: రాష్ట్ర విభజనను నిరసిస్తూ జిల్లాలో కొనసాగుతున్న ఆందోళన, నిరసన కార్యక్రమాలు రోజురోజుకీ ఊపందుకుంటున్నాయి. ఈ నిరసన కార్యక్రమాల్లో భాగంగా సోమవారం జిల్లావ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌ సంపూర్ణంగా, స్వచ్ఛందంగా జరిగింది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం విద్యార్థి సంఘాలు ప్రైవేట్‌, కార్పొరేట్‌ విద్యాసంస్థలను మూయించారు. ఇప్పటివర కూ చట్టసభల ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్ల, మున్సిపల్‌ కౌన్సిలర్ల రాజీనామాలకే పరిమితమైన నెల్లూరుజిల్లాలో జడ్పీటీసీ, ఎంపీపీల రాజీనామాలకు తెలుగుదేశం పార్టీ సోమవారం శ్రీకారం చుట్టింది.

ఆ పార్టీకి చెందిన 5గురు జడ్పీటీసీ సభ్యులు,ఆరుగురు ఎంపీపీలు సోమవారం తమ పదవులకు రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. నాయుడుపేటలో సమైక్యవాదులు పినాకినీ ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేసి రైల్‌రోకో నిర్వహించారు. ఐదవ నెంబరు జాతీయ రహదారిని కోవూరు, కావలి, నెల్లూరు, గూడూరు, సూళ్లూరుపేట తదితర జాతీయ రహదారి వెంబడి ప్రాంతాల్లో అఖిలపక్ష నేతలు, సమైక్య వాదులు దిగ్బంధనం చేయడంతో వాహనాలు బారులు తీరాయి. నగరంలోని విఆర్‌సీ, ఆర్టీసీ బస్టాండ్‌ల వద్ద విద్యార్థి సంఘాలు నిర్వహించిన నిరసన కార్యక్రమాల్లో నగర మేయర్‌ ఎన్‌.భానుశ్రీ పాల్గొని తమ మద్దతు పలికారు. గాంధీబొమ్మ సెంటర్‌లో రాజీవ్‌భవన్‌ ఆధ్వర్యంలో జరిగిన వినూత్న నిరసన కార్యక్రమంలో భాగంగా జడ్పీ ఛైర్మన్‌ కాకాణి గోవర్ధన్‌రెడ్డి సమైక్య ఘంటానాదాన్ని మోగించారు.

ప్రజారాజ్యం పార్టీ ఆధ్వర్యంలో నగరంలో సమైక్యాంధ్రను కోరుతూ భారీ స్కూటర్‌ ర్యాలీ జరిగింది. నగర ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో పిఆర్‌పీ కార్యకర్తలు, సమైక్యవాదులు పాల్గొన్నారు. ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం అన్ని నియోజకవర్గ కేంద్రాలలలో అన్ని పార్టీల నేతలు, కార్యకర్తలు రిలే నిరాహారదీక్షలు చేపట్టనున్నారు. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని పున:పరిశీలించేంత వరకూ తమ ఉద్యమం ఆగబోదని వివిధ సందర్భాలలో అన్ని రాజకీయ పార్టీల నేతలు పేర్కొనడం గమనార్హం.
sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh