online marketing

Tuesday, April 24, 2012

తనతో సరిగా మాట్లాడని భర్త కొడుకుతో ఆడుకుంటుండడం చూసి ఓర్వలేక. కన్న కొడుకు గొంతునులిమి...

శరీరంలో విషం పెట్టుకున్న తేలు సైతం తన పిల్లల్ని వదలి వేటకు వెళ్లదు. ఒక వేళ ఆహారం కోసం వెళ్లాల్సి వస్తే పదుల సంఖ్యలో ఉన్న పిల్లల్ని వీపుమీద వేసుకుని వేటకు వెళుతుంది. పిల్లల్ని శత్రువుల నుంచి కాపాడుకోవడానికి ఎంతటి బరువునైనా మోస్తుంది. ఒక విషపురుగుకు ఉన్న వివేకం మనిషికి లేకుండా పోతోంది. ఓ తల్లి తన నాలుగేళ్ల కన్న కొడుకును కంటికి రెప్పలా కాపాడాల్సింది పోయి గొంతు నులిమి కడతేర్చింది. అప్పుడప్పుడు జరిగే ఇలాంటి కొన్ని సంఘటనలు చూస్తే మనిషికన్నా విషపురుగులే నయం అనిపిస్తుంది. 


తడ : మండల పరిధిలోని వేనాడు పంచాయతీ మూల గ్రామంలో ఓ తల్లి మానసిక ఒత్తిడికి లోనై కన్న బిడ్డను గొంతునులిమి చంపిన సంఘటన ఒక రోజు ఆలస్యంగా వెలుగు చూసింది. గ్రామానికి చెందిన ముతుకు శ్రీనివాసులు షార్‌లో కాంట్రాక్టు కార్మికునిగా పనిచేస్తున్నాడు. కొన్నేళ్ల క్రితం ఇతనికి భారతితో వివాహం జరిగింది. వీరికి నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. కొంతకాలంగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఎనిమిది నెలల క్రితం భారతి సూళ్లూరుపేటలోని డేగావారి కండ్రిగలో ఉన్న పుట్టింటికి వెళ్లిపోయింది. పెద్దమనుషులు రాజీ చేసి నెల క్రితం భారతిని భర్తవద్ద వదలి వెళ్లారు. 

ఒకే ఇంట్లో ఉన్నా భార్యాభర్తల మధ్య మాటలు లేవు. తనతో సరిగా మాట్లాడని భర్త కొడుకుతో ఆడుకుంటుండడం చూసి ఓర్వలేక పోయింది. సోమవారం భర్త పనికి వెళ్లిన తరువాత కన్న కొడుకు భరత్(4) గొంతునులిమి చంపేసింది. ఆనోటా ఈ నోటా విషయం బయటకు పొక్కడంతో మంగళవారం పోలీసుల దృష్టికి వచ్చింది. సీఐ హనుమంతరావు, తడ ఎస్‌ఐ బీ. శ్రీనివాసరెడ్డి సంఘటనా స్థలానికి వెళ్లారు. భరత్ మృత దేహాన్ని సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తాను కొడుకును చంపాలనుకోలేదని, గొంతు పట్టుకున్న వరకే తనకు తెలుసని తల్లి భారతి చెబుతోంది.

Sunday, April 22, 2012

సిండికేట్లు వర్ధిల్లాలని అధికార కాంగ్రెసు పార్టీ విజయనగరంలో ధర్నా చేస్తోందా అని మాజీ మంత్రి సోమిరెడ్డి

నెల్లూరు: మద్యం సిండికేట్లు వర్ధిల్లాలని అధికార కాంగ్రెసు పార్టీ విజయనగరంలో ధర్నా చేస్తోందా అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదివారం మీడియా సమావేశంలో ఎద్దేవా చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి అవినీతిలో ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు కూడా వాటా ఉందని ఆయన ఆరోపించారు.

మద్యం సిండికేట్లపై తెలుగుదేశం పార్టీ మాట్లాడితే బొత్సకు ఉలుకెందుకని ఆయన ప్రశ్నించారు. బొత్స తమ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఇతర నేతలపై ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడితే సహించేది లేదన్నారు. సిండికేట్లపై ఎసిబి విచారణ వద్దన్న బొత్సకు మాట్లాడే నైతిక అర్హత లేదని మండిపడ్డారు. అధికార పార్టీ అయి ఉండి కాంగ్రెసు ధర్నాలు, ఆందోళనలకు దిగడం సిగ్గు చేటు అన్నారు.

మద్యం సిండికేట్లకు మద్దతు పలుకుతున్న బొత్స సత్యనారాయణ అందుకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ చేపట్టిన ధర్నాను అడ్డుకోవడం ఎంత వరకు సమంజసం అన్నారు. తెలుగుదేశం పార్టీ నేతల పైన కాకుండా బొత్స పెంచిన మద్యం ధరలు తగ్గించాలని ధర్నాలు, ఆందోళనలు చేస్తే బాగుంటుందని సూచించారు.

అంతకుముందు రాజ్యసభ సభ్యుడు దేవేందర్ గౌడ్ కూడా కాంగ్రెసుపై విరుచుకు పడ్డారు. విజయనగరం జిల్లాలో ఖచ్చితంగా ధర్నా చేసి తీరుతామని చెప్పారు. ఒక రాజకీయ పార్టీగా తెలుగుదేశంకు ఎక్కడైనా ధర్నాలు నిర్వహించే స్వేచ్ఛ, ప్రతిపక్ష పార్టీగా బాధ్యత ఉందని చెప్పారు. విజయనగర సభకు అనుమతి అడిగామని, అయితే అనుమతి ఇవ్వకున్నా నిర్వహించి తీరుతామన్నారు. సభకు అనుమతి ఇవ్వకపోవడం ఎస్పీ చేతకాని తనానికి నిదర్శనమన్నారు.

కాగా ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను కాంగ్రెసు పార్టీ దుర్వినియోగం చేస్తోందని మరో నేత మోత్కుపల్లి నర్సింహులు వేరుగా మండిపడ్డారు. కాంగ్రెసు పార్టీ దళితులను మోసం చేస్తోందని, దళితుల సంక్షేమానికి వినియోగించాల్సిన నిధులను ఉప ఎన్నికలలో గెలుపు కోసం ఉపయోగించుకుంటోందని ఆరోపించారు. కాంగ్రెసు ప్రభుత్వాన్ని దళిత వ్యతిరేకిగా ఆయన అభివర్ణించారు. భవిష్యత్తులోనూ ఇదే పరిస్థితి కొనసాగితే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు.

బీర్‌ బాటిళ్లతో దాడి చేయగా ముఖంపైన, తల వెనుకభాగంలో తీవ్ర...

నెల్లూరు: నగరంలోని స్థానిక అర్చన సెంటర్‌ వద్ద శనివారం రాత్రి 10 గంట సమయంలో మద్యం షాపు ముందు ఒక యువకుడిపై కొందరు వ్యక్తులు దాడి చేసి గాయపరిచారు. వివరాలిలా వున్నాయి. స్థానిక కపాడిపాళెంనకు చెందిన కేరళ కిరణ్‌ అలియాస్‌ జింబాంబే అనే 28 ఏళ్ల యువకుడు గుండా ఆంజనేయులు కల్యాణ మండపం పక్కన టైర్‌ పంచర్‌ షాఫు నిర్వహిస్తున్నాడు. శనివారం రాత్రి కిరణ్‌ మద్యం సేవించేందుకు సమీపంలో గల వైన్‌ స్పాట్‌ మద్యం దుకాణం వద్దకు వెళ్లాడు. కాసేపటికి కొందరు వ్యక్తులు పాతకక్షలు మనసులో ఉంచుకుని కిరణ్‌పై దాడి చేశారు. ఈ క్రమంలో ఆ దుండ గులు  నగరంలోని స్థానిక అర్చన సెంటర్‌ వద్ద శనివారం రాత్రి 10 గంట సమయంలో మద్యం షాపు ముందు ఒక యువకుడిపై కొందరు వ్యక్తులు దాడి చేసి గాయపరిచారు. వివరాలిలా వున్నాయి. స్థానిక కపాడిపాళెంనకు చెందిన కేరళ కిరణ్‌ అలియాస్‌ జింబాంబే అనే 28 ఏళ్ల యువకుడు గుండా ఆంజనేయులు కల్యాణ మండపం పక్కన టైర్‌ పంచర్‌ షాఫు నిర్వహిస్తున్నాడు. శనివారం రాత్రి కిరణ్‌ మద్యం సేవించేందుకు సమీపంలో గల వైన్‌ స్పాట్‌ మద్యం దుకాణం వద్దకు వెళ్లాడు. కాసేపటికి కొందరు వ్యక్తులు పాతకక్షలు మనసులో ఉంచుకుని కిరణ్‌పై దాడి చేశారు. ఈ క్రమంలో ఆ దుండ గులు బీర్‌ బాటిళ్లతో కిరణ్‌పై దాడి చేయగా కిరణ్‌కు ముఖంపైన, తల వెనుకభాగంలో తీవ్ర గాయాలయ్యాయి. కిరణ్‌ గాయపడడం తెలుసుకున్న అత ని స్నేహితులు కొందరు మద్యం దుకాణం వద్దకు వెళ్లి మద్యం షాపులోని మద్యాన్ని ధ్వంసం చేశారు. 

కిరణ్‌ సోదరుడు తమ్ముడు చావు బతుకుల్లో ఉండడం గమనించి సమీపంలోని రిక్షాలో వేసుకుని చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించాడు. విషయం తెలుసుకున్న 3వ నగర పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి మద్యం ధ్వంసం చేసిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. మొదట కిరణ్‌పై దాడి విషయం తెలియని పోలీసులు కేవలం మద్యం ధ్వంసంపై దృష్టి పెట్టారు. మీడియా ద్వారా తెలుసుకున్న పోలీసులు గాయపడిన కిరణ్‌ను వెతుక్కుంటూ వెళ్లగా కిరణ్‌ను అతని సోదరుడు ప్రభుత్వాసుపత్రిలో చేర్పించి ఉండడం గమనించారు. విషయం తెలుసుకున్న నగర సిఐ వీరాంజనేయరెడ్డి ప్రభుత్వాసుపత్రి వద్దకు వెళ్లి గాయపడిన కిరణ్‌ పరిస్థితిని డాక్టర్‌ ద్వారా తెలుసుకున్నారు . కిరణ్‌ గాయపడడం తెలుసుకున్న అత ని స్నేహితులు కొందరు మద్యం దుకాణం వద్దకు వెళ్లి మద్యం షాపులోని మద్యాన్ని ధ్వంసం చేశారు. 

కిరణ్‌ సోదరుడు తమ్ముడు చావు బతుకుల్లో ఉండడం గమనించి సమీపంలోని రిక్షాలో వేసుకుని చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించాడు. విషయం తెలుసుకున్న 3వ నగర పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి మద్యం ధ్వంసం చేసిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. మొదట కిరణ్‌పై దాడి విషయం తెలియని పోలీసులు కేవలం మద్యం ధ్వంసంపై దృష్టి పెట్టారు. మీడియా ద్వారా తెలుసుకున్న పోలీసులు గాయపడిన కిరణ్‌ను వెతుక్కుంటూ వెళ్లగా కిరణ్‌ను అతని సోదరుడు ప్రభుత్వాసుపత్రిలో చేర్పించి ఉండడం గమనించారు. విషయం తెలుసుకున్న నగర సిఐ వీరాంజనేయరెడ్డి ప్రభుత్వాసుపత్రి వద్దకు వెళ్లి గాయపడిన కిరణ్‌ పరిస్థితిని డాక్టర్‌ ద్వారా తెలుసుకున్నారు
sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh