online marketing

Saturday, March 24, 2012

నెల్లూరుకు రావడమంటే థ్రిల్లింగ్‌గా ఉంటుందని సినీ నటుడు, నిర్మాత కొణిదల నాగేంద్రబాబు


 నెల్లూరుకు రావడమంటే థ్రిల్లింగ్‌గా ఉంటుందని సినీ నటుడు, నిర్మాత కొణిదల నాగేంద్రబాబు (నాగబాబు) అన్నారు. శుక్రవారం నగరంలోని డిఆర్‌ ఉత్తమ్‌ హోటల్‌లో జరిగిన భువిద సెంటర్‌ సిటీ కార్యక్రమంలో పాల్గొని ఆయన భువిద బ్రోచెర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ నెల్లూరులో తాను విద్యాభ్యాసం చేశానని, చాలామంది తెలిసినవారు, పరిచయస్తులు ఉన్నారని ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ మధ్య కాలంలో నెల్లూరు చాలా అభివృద్ధి చెందినదన్నారు. హైదరాబాద్‌తో పోల్చుకుంటే నెల్లూరులో స్థలాల రేట్లు కూడా తక్కువగా ఏమీ లేవన్నారు. ప్రతి ఒక్కరికీ సొంత ఊరిలో ఇల్లు ఉండాలనే కోరిక ఉంటుందన్నారు. ఆ ఇంట్లోనే శ్వాస వదలాలని ఉంటుందన్నారు. గతంలో సొంతిల్లు ఉండాలని ఉండేది కాదన్నారు. సామాన్యులకు అందుబాటులో ‘భువిద’ ఉందన్నారు.

ఈ సందర్భంగా ఆయనను ఆ సంస్థ వారు ఘనంగా సన్మానించారు. అలాగే పలువురు అభిమానులు ఆయనను కలిశారు. ఉగాది రోజు నాగబాబు రావడంతో అభిమానులు కోలాహలం కనిపించింది. ఆయన వారికంద రికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఎస్‌కె. ఖాజావలి మాట్లాడుతూ నెల్లూరు ప్రపంచ వాణిజ్య కేంద్రంగా మారుతుందన్నారు. నెల్లూరు క్లాస్‌ సిటీగా కానున్నదన్నారు. సినీ నటుడు నాగబాబుకు నెల్లూరీయులతో మంచి సంబంధాలున్నాయన్నారు. భువిద సెంటర్‌ సిటీ ఎండి రమేష్‌, బాలకోటయ్యలు మాట్లాడుతూ మోడల్‌ టౌన్‌షిప్‌ చేయాలనే సంకల్పంతో భువిదలో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. ప్రతిఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్‌ బాషా, ద్వారకనాధ్‌, యల్లారెడ్డి, రాధాకృష్ణ, భాస్కర్‌రెడ్డి, ప్రభాకర్‌, ప్రమోటర్స్‌, ప్రముఖులు పాల్గొన్నారు.

Wednesday, March 21, 2012

kovur by elction results win prasana ysrcp candidate 23,496 majority

kovur by elction results win prasana ysrcp candidate 23,496 majority, But it is not much majority but the opponets distribute for vote 1000 rs at the peek time that the reason majority not much

Tuesday, March 20, 2012

మద్యం సేవించి ఇంట్లో ఎవరూ లేని సమయంలో కుమార్తెపై అత్యాచారం


మనుబోలు : మనుబోలు కన్న కూతురిని కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కామంతో కళ్లు మూసుకుపోయి ఏడేళ్ల కూతురిపై అత్యాచారానికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. మనుబోలు శివాలయం సమీపంలో నివాసముంటున్న గిరిజన కుటుంబానికి చెందిన చేంబేటి రమణయ్య వారం రోజుల కిందట మద్యం సేవించి ఇంట్లో ఎవరూ లేని సమయంలో కుమార్తెపై అత్యాచారం చేశాడు. ఇంతలో బయట నుంచి వచ్చిన భార్య కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకున్నారు.

దీంతో రమణయ్య పరారయ్యాడు. ఈ విషయాన్ని ఆమె కొందరు గ్రామ పెద్దలకు చెప్పగా విషయం పోలీసులకు తెలిస్తే పెద్ద గొడవ అవుతుందని ఎవరికీ చెప్పొద్దని సూచించడంతో ఆమె మిన్నకుండిపోయింది. మంగళవారం బాలిక మర్మాంగాల వద్ద నొప్పిగా ఉందని చెప్పడంతో చిన్నారి తల్లి కేఆర్‌పురంలోని ఓ ప్రైవేటు వైద్యుని వద్దకు తీసుకెళ్లింది. బాలికను పరిశీలించిన వైద్యుడు మర్మాంగాల వద్ద రక్తస్రావం అవుతుందని తెలిపాడు. దీంతో తన భర్తే కుమార్తెపై అత్యాచారం చేశాడని ఆమె చెప్పడంతో విషయాన్ని మీడియాకు తెలియజేయాలని డాక్టర్ సూచించడంతో విషయం బయటకు పొక్కింది. రమణయ్య ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఇంత జరిగినా పోలీసులకు విషయం తెలియక పోవడం కొసమెరుపు.


ముత్తుకూరు మండల పశువైద్యాధికారి గోగి రెడ్డి ఇందిరారెడ్డి ఎసిబి వలలో

ముత్తుకూరు : వద్ద లంచం తీసుకొంటూ ముత్తుకూరు మండల పశువైద్యాధికారి గోగి రెడ్డి ఇందిరారెడ్డి ఎసిబి వలలో చిక్కారు. మంగళవారం ముత్తు కూరు పశువైద్యశాలలో ఆమె విధులు నిర్వహిస్తుండగా పంట పాళెంకు చెందిన వడ్లపూడి వెంకటరమణయ్య సర్టిఫికెట్‌ కోసం రెండు వేల రూపాయల లంచం ఇచ్చారు. ఆయన బయటకు వచ్చీరాగానే, అక్కడే మాటు వేసిన ఎసిబి అధికారులు ఆమెను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎసిబి డిఎస్‌పి భాస్కర్‌రావు, బాధితుడు వెంకటరమణయ్య కథనం మేరకు... ముత్తుకూరు మండలం పంటపాళెంకు చెందిన వడ్లపూడి కాంతమ్మ కృష్ణపట్నం సొసైటీలో రెండు గేదెలకు రుణం పొందడానికి అవసరమైన హెల్త్‌ అండ్‌ వాల్యూయేషన్‌ సర్టిఫికెట్‌ ఇవ్వాలని ఫిబ్రవరి 10వ తేదీన ముత్తుకూరు పశువైద్యాధికారి ఇందిరారెడ్డిని కోరారు. అందుకు ఆమె ఐదు వేల రూపాయలు డిమాండ్‌ చేశారు. తాము అంత ఇవ్వలేమని ఆమె కుమారుడు వెంకటరమణయ్య ఆమెకు వివరించారు. డబ్బు తీసుకోకుండా తాను సర్టిఫికెట్‌ ఇవ్వలేనని, డబ్బులు తీసుకురావాలని ఆమె తేల్చి చెప్పడంతో తిరిగి వెళ్లిపోయారు. ఫిబ్రవరి 17వ తేదీన వెయ్యి రూపాయలు ఇవ్వబోగా కనీసం 3వేల రూపాయలు ఇవ్వాలని డిమాండు చేశారు. చివరకు రెండు వేల రూపాయలు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకొన్నారు. ఎంతో ఆవేదనకు గురైన వారు వెంటనే నెల్లూరులోని ఎసిబి అధికారులను ఆశ్రయించారు. దీంతో వారు మంగళవారం ఉదయం నుండే పశువైద్యశాల పరిసరాల్లో కాపుకాశారు. ఆమెకోసం రైతు, ఆయన తల్లి ఆసుపత్రిలోనే కూర్చుని ఉన్నారు. సుమారు 11.15 గంటల సమయంలో పశువైద్యాధికారి కార్యాలయానికి వచ్చారు. వెంటనే రైతు వెంకటరమణయ్య ఆమెను సర్టిఫికెట్‌ ఇవ్వాలని, మీరు అడిగిన రెండు వేల రూపాయలను తెచ్చానని తెలిపాడు. దీంతో ఆమె సర్టిఫికెట్‌ రాసి ఇచ్చారు. రెండు వేల రూపాయలను ఆమెకు ఇచ్చాడు. ఆమె లెక్కపెట్టి బ్యాగులో పెట్టుకున్నారు. రైతు పక్కకు వెళ్లగానే వెంటనే మాటు వేసిన ఎసిబి అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రికార్డులను పరిశీలించామని, వాటిని తాము స్వాధీనం చేసుకొన్నామని ఎసిబి డిఎస్పీ భాస్కర్‌ తెలిపారు. ఆమెను అరెస్టు చేసి ఎసిబి కోర్టుకు హాజరు పరచనున్నట్లు డిఎస్‌పి తెలిపారు. ఈకార్యక్రమంలో ఎస్‌ఐలు సుధాకర్‌రెడ్డి, రాజేంద్రప్రసాద్‌, వెంకటేశ్వర్లు, సిబ్బంది పాల్గొన్నారు. ఇదిలా ఉంటే గుర్తు తెలియని వ్యక్తులు కార్యాలయంలోనికి పరుగులు తీస్తున్నారని విలేకరులు కూడా వారి వెంట పరుగులు తీశారు. చివరికి ఎసిబి అధికారులని తెలిసుకున్నారు.

గతంలో సెంట్‌ భూమి వందల్లో పలికితే నేడు సెంట్‌ భూమి లక్షలాది రూపాయల్లో

నెల్లూరు : తడ మండలంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం జోరందుకుంది. దీంతో బిజినెస్‌మెన్‌ల చూపు తడ వైపు మళ్లింది. పంట పొలాలన్నీ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల వశవుతున్నాయి. మండలం చుట్టు పక్కల ప్రాంతాల్లో పలు భారీ పరిశ్రమలు రావడంతో బిజినెస్‌మెన్‌ల చూపు తడ మండలం వైపు పడింది. దీంతో స్థలాల విలువ ఒక్కసారిగా పెరిగిపోయింది. నేడు మండలంలో నలువైపులా ఎక్కడకూడ ఖాళీ స్థలాల్లే కుండా ఇంటి నిర్మాణాలకు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు కొనుగోలు చేసి ప్లాట్‌లుగా విభజించి అమ్మకాలు సాగిస్తున్నారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం వల్ల పంట పొలాలన్నీ కనుమరుగవుతున్నాయి. భవిష్యత్‌లో ధాన్యం కొరత ఎదుర్కోక తప్పదు. ఇప్పటికే మండలంలోని అక్కంపేట చివరి ప్రాంతంలో పంట పొలాల్లో మట్టిని తోలి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి రంగం సిద్ధం చేశారు. తడ మండలంలో ఇప్పటికే సుమారు 22 లే అవుట్‌లు ప్రారంభించి కట్టడాలను నిర్మిస్తున్నారు. మండలంలోని 22కి గాను 5 లే అవుట్‌లకు టెక్నికల్‌ కంట్రోల్‌ ప్లానింగ్‌ ప్రకారం నిర్మాణాలు సాగిస్తోన్నారు. మిగిలిన లే అవుట్‌లకు టెక్నికల్‌ కంట్రోల్‌ ప్లానింగ్‌ ప్రకారం ఇళ్ల కట్టడాలను నిర్మించాలి. కానీ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు పంచాయతీ అప్రూల్‌తో సరిపెట్టుకొని ఇళ్ల కట్టడాలను నిర్మిస్తున్నారు. దీంతో తడ మండలంలో పలు గ్రామాల్లో కూడా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం జోరందుకుంది. గతంలో సెంట్‌ భూమి వందల్లో పలికితే నేడు సెంట్‌ భూమి లక్షలాది రూపాయల్లో పలుకుతుంది. ఈ ప్రాంతంలో భూమి కొనుగోలుదారుల ఉత్సాహం చూపడంతో దళారులు ఇష్టారాజ్యంగా భూముల ధరలు పెంచేస్తున్నారు. గతంలో అక్కంపేట ప్రాంతంలో నర సంచారం కరువైయ్యేది. కానీ నేడు అక్కడ సెంటు భూమి లక్షలాది రూపాయల్లో ధర పలుకుతోంది. జాతీయ రహదారి ప్రాంత స్థలాల భూములకు కూడ ధరలకు రెక్కలొచ్చాయి. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం జోరందుకోవడంతో ప్లాట్‌లను ఎత్తు చేయడానికి ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. సమీపంలోని చెరువుల ప్రాంతాల్లో మట్టి తవ్వకాలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ భూమిలో మట్టి గుట్టలను ఏర్పాటు చేసి వాటిని చదును చేసి స్థలాలకు విలువలు పెరిగేల్లా ఏర్పాట్లు సాగిస్తున్నారు. లే అవుట్లలో ఇళ్ల కట్టడాల నిర్మాణాలు సాగిస్తుండటంతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా దిన దిన ప్రవర్తమానంగా పెరుగుతోంది. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో అధికారులు, ఉద్యోగులు, నాయకులు ఉండటంతో వ్యాపారం జోరుగా సాగుతోంది. భవిష్యత్‌లో తడ మండలం భూమి రేట్లు కార్పోరేషన్‌ స్థాయిని మించినా ఆశ్చర్య పోవడంలో తప్పులేదని పలువురు అంటున్నారు.

జయాపజయాలపై కౌంట్‌ డౌన్‌


కోవూరు : రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన కోవూరు ఉప ఎన్నిక ఓటరు తీర్పు బుధవారం వెలువడనుంది. దీంతో పోటీ చేసిన అభ్యర్థుల్లో టెన్షన్‌...టెన్షన్‌... ఇప్పటికే ఈ నియోజకవర్గంలో గెలుపు కోసం అభ్యర్థులు కోట్లాది రూపాయలు నగదును మంచినీళ్ల ప్రాయంగా గెలుపు కోసం ఖర్చు చేసిన సంగతి తెలిసిందే. దీనికి తోడు అభ్యర్థులు గెలుపోటములపై కోట్లాది రూపాయలు బెట్టింగ్‌లు కూడా రాష్ట్ర స్థాయిలో పెట్టిన సంగతి కూడా తెలిసిందే. ఎన్నికల ఫలితాలు వెలువడేందుకు కొన్ని గంటల వ్యవధి ఉండడంతో అభ్యర్థు తోపాటు బెట్టింగ్‌ నిర్వాహకులు, పార్టీల అభిమానులు, ప్రజలు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. నేటి ఉదయం 8 గంటల నుండి కౌంటింగ్‌ మొదలు కానుండడంతో మంగళవారం నుండే ఈ విషయమై జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఏ సెంటర్‌లో చూచినా అభ్యర్థులు గెలుపోటములపైనే చర్చించుకోవడం కనిపించింది.

అలాగే అభ్యర్థులు ఎంత మెజారిటీతో గెలుస్తారో అనే విషయంపై కూడా బెట్టింగ్‌లు పెట్టిన సంగతి తెలిసిందే. ఫలితాలు లెక్కింపు మొదలయ్యేదానికి కౌంట్‌ డౌన్‌ మొదలు కావడంతో నగరం తోపాటు అన్ని మండలాల్లో టెన్షన్‌ వాతావరణం నెలకొనివుంది. ఉప ఎన్నిక జరిగిన కోవూరు నియోజకవర్గంలో అత్యధిక శాతం ఓటింగ్‌ జరగడంతో ఫలితాలు కూడా తారుమారయ్యే అవకాశం ఉండడంతో అభ్యర్థులతోపాటు అభిమానుల్లోనూ, ప్రజల్లోనూ ఉద్వేగభరిత వాతావరణం నెలకొనివుంది. ఇప్పటికే అభ్యర్థుల గెలుపోటములపై బెట్టింగ్‌లు పెట్టిన వారిలో అభ్యర్థులకు ఎంత మెజారిటీతో ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తాడో, ఏ పార్టీ ద్వితీ స్థానాన్ని, తృతీయ స్థానాన్ని సాధిస్తుంది అనే అంశ ంపై కూడా అభిమానుల్లో ఉత్కంఠ నెలకొనివుంది. ఓట్ల లెక్కింపు జరిగే వెంకటేశ్వరపురం, పాలిటెక్నిక్‌ కళాశాల వద్ద చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ మంగళవారం సాయంత్రం నుండే సందడి వాతావరణం నెలకొనివుంది.

అలాగే అభ్యర్థుల గెలుపోటములపై బెట్టింగ్‌లు పెట్టినవారు నగరంలోని పలు లాడ్జీలలో వ్యాపారం పేరుతో లాడ్జీల్లో చేరి అక్కడ నుంచే వారి వారి అనుచరులతో బెట్టింగ్‌లు పెట్టుకుంటూ కార్యకలాపాలను సాగిస్తున్నట్లు సమాచారం. బెట్టింగ్‌ల సంస్కృతి మంచిది కాదని, దాంతో వాదోపవాదాలు జరిగి గొడవలు చోటు చేసుకునే అవకాశం ఉందని పలువురు చర్చించుకుంటున్నారు. అలాగే గెలుపోటములపై మండలాల్లోని తమ త మ అనుచరులకు ఫోన్‌లు చేయడం, అక్కడి పరిస్థితులను కనుక్కోవడం, ఓటింగ్‌లో పలితాలు ఎలా ఉండబోతాయి అని అడగడం కనిపిస్తుంది. క్షణక్షణానికి మండలాల్లోని ప్రజలు చెబుతున్న వివరాలకు బెట్టింగ్‌ పెట్టిన వారిలోనూ, అభిమానుల ద్వారా సమాచారం అందుకుంటున్న పోటీగా నిలబడ్డ అభ్యర్థుల్లోనూ టెన్షన్‌ వాతావరణం కనపడుతోంది.

ఈ నేపథ్యంలో కోవూరు నియోజకవర్గంలోని 5 మండలాల్లో గతంలో ఎన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో ఓట్లు పోలవడంతో ఏ అభ్యర్థి ఎంత మెజారిటీతో గెలుస్తాడో చెప్పలేని పరిస్థితి. పార్టీ కార్యకర్తల్లోనూ, పరిశీలకుల్లోనూ కనపడకపోవడంతో అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెస్తున్నా యనడంలో ఎటువంటి సందేహం లేదు. ఏది ఏమైనప్పటికీ ఉదయం 8 గంటలకు మొదలుకానున్న కౌంటింగ్‌ ప్రక్రియ కొద్ది గంటల్లోనే పూర్తయి అభ్యర్థుల భవిష్యత్తును తేల్చనున్నట్లు కోవూరు నియోజ కవర్గంలోని 5 మండలాల్లోని ప్రజలతోపాటు జిల్లా ప్రజల్లోనూ, రాష్ట్ర వ్యాప్తంగా బెట్టింగ్‌ కట్టినవా రిలోనూ టెన్షన్‌ మొదలవడంతోపాటు జయాపజయాలపై కౌంట్‌ డౌన్‌ మొదలైంది.

నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రాన్ని జాతీయ స్థాయి గుర్తింపు


నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రాన్ని అభివృద్ధి పనులతో మరింత అభివృద్ధి పరిచి జాతీయ స్థాయి గుర్తింపు కల్పించేందుకు చర్యలు చేపడుతానని తిరుపతి ఛీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్టు చలపతిరావు మంగళవారం తెలిపారు. ఆయన నేలపట్టు పక్షుల కేంద్రంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా చలపతి రావు మాట్లాడుతూ ప్రపంచంలో పెలికాన్‌ పక్షులు 7వేలు ఉన్నాయని అందులో 2500 పెలికాన్‌ పక్షులు నేలపట్టు పక్షుల కేంద్రంకు వచ్చి కడప చెట్లపై ఆవాసం ఉంటూ తమ సంతానాన్ని పెంపోందించుకుంటున్నాయన్నారు. ఈ వలస విహంగాల రక్షణ కోసం పక్షుల కేంద్రం చుట్టూ క్యాంపా స్కీమ్‌ ద్వారా రూ.86లక్షలతో 2.8కి.మీ రక్షణ గోడ నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు.

అంతేకాకుండా పక్షుల కేంద్రంలో రూ.15లక్షలతో చైన్‌ లింక్‌వాల్‌ రూ.17లక్షలతో వాచ్‌టవర్‌, జింకల పార్కు వద్ద రూ.4.50లక్షలతో బార్డ్‌ ఎన్‌క్లోజర్‌, మరో రూ.15లక్షలతో చెరువుకట్ట విస్తర్ణ, కల్వర్టు మరమ్మత్తు పనులు చేపడుతున్నారు. పక్షుల కేంద్రంలో పనులు చేపడుతున్న కాంట్రాక్టర్లు త్వరగా పనులు పూర్తి చేయకపోవడంతో వారికి నోటీసులు అందచేసినట్లు ఆయన తెలిపారు. పులికాట్‌ సరస్సులో ముఖద్వారాల పూడిక తీతకు ప్రతిపాధనలు పంపినట్లు ఆయన తెలిపారు. ఈ విధంగా నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రాన్ని మరింత అభివృద్ధి పరిచి జాతీయ స్థాయి గుర్తింపుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఆయన వెంట సూళ్ళూరుపేట డిఎఫ్‌వో పార్ధనంద ప్రసాద్‌, ఫారెస్టర్‌ బాలాజి తదితర సిబ్బంది ఉన్నారు.

ఈ సంవత్సరం అంతా ఎన్నికలతోనే సరిపోయేట్లుగా....


నెల్లూరు : జిల్లాలో ఇప్పటికే కోవూరు నియోజకవర్గ ఉప ఎన్నికల పుణ్యమా అని జిల్లాలో జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఎన్నికల కోడ్‌తో అధికారులు నిలిపివేశారు. అయితే రానున్న రోజుల్లో సహకార ఎన్నికలు, ఆపై నెల్లూరు పార్లమెంటు, ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరుగబోతున్నట్లు ఎన్నికల అధికారులు సూచనప్రాయంగా తెలియజేశారు. ఈ ఎన్నికల అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా జరుపబోయే మున్సిపల్‌ ఎన్నికలు కూడా జిల్లాలో జరుపనున్నట్లు ప్రభుత్వం తెలియజేసింది. అదేవిధంగా జిల్లా పరిషత్‌, పంచాయతీలకు పదవీ కాలం పూర్తయి నెలలు గడుస్తున్నా ప్రభుత్వం ఆ ఎన్నికలు కూడా నిర్వహించకుండా కాలయాపన చేస్తూ వస్తుంది. నందన నామ నూతన సంవత్సరమంతా ఎన్నికలేనా అంటూ ప్రజలు చర్చించుకుంటున్నారు.

ఈ రకంగా అన్ని ఎన్నికలు వెనువెంటనే ఒక్కొక్కటి గా జరపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం తెలుస్తుండడంతో ఈ సంవత్సరం అంతా ఎన్నికలతోనే సరిపోయేట్లుగా వుంది. అయితే జిల్లాలో జరగాల్సిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు నత్తనడకన జరుగుతుండడం ఒక ఎత్తయితే, రాబోయే ఎన్నికల కారణంగా ఎన్నికల కోడ్‌ నిబంధనతో అభివృద్ధి మరింత కుంటుపడే అవకాశముందని, దీంకతో జనజీవనం అస్తవ్యస్తం కానుందా అని అభివృద్ధికి నోచుకోని ప్రజలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఇందిరమ్మ నివేశన స్థలాల కోసం ప్రజలు 2009 నుండి ఎదురు చూస్తున్నప్పటికీ ప్రభుత్వం ఆదిశగా ప్రయత్నించక పోవడంతో పేద ప్రజలు నిరాశలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇందిరమ్మ గృహాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా సిమెంటు, ఇనుము రేట్లు పెరిగిపోవడంతో పేద ప్రజలు సొంత ఇళ్ల కోసం కనే కలలు కలలుగానే మిగిలిపోనున్నాయని పేదలు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో నందన నామ సంవత్సరమంతా ఈ ఎన్నికలతోనే సరిపోనుందని, మా బతుకులింతేనా...? అని పేద ప్రజలు నిరాశా నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్నారు

Monday, March 19, 2012

ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు 9435 లేదా 9335 రూపాయలు ఇవ్వాలని బతిమలాడుతున్నాడు


అమ్మబోతే అడవి కొనబోతే కొరివి

జిల్లాలో రైతుల పరిస్థితి అమ్మబోతే అడవి కొనబోతే కొరివి అన్న చందంగా ఉంది. పుట్టికి 850 కిలోలు. మిల్లర్లు పుట్టి ధాన్యాన్ని 8 వేల రూపాయలకు కొనుగోలు చేస్తున్నారు. 850 కిలోల ధాన్యాన్ని ఆడిస్తే 600 కిలోల బియ్యం వస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో కిలో బియ్యం రూ.30 ధర పలుకుతోంది. అంటే పుట్టి వడ్లను బియ్యం రూపంలోకి మార్చితే వాటి విలువ సుమారు రూ. 18 వేలు. ఇక తౌడు, పొట్టును ప్రత్యేకంగా అమ్ముకుంటారు. రైతు నుంచి కేవలం ఎనిమిది వేలకుకొనుగోలు చేస్తున్న పుట్టి ధాన్యాన్ని మార్కెట్లో 18 వేలకు విక్రయిస్తున్నారు. అంటే రైతు ఎకరాకు సుమారు 10 వేల రూపాయల వంతున నష్టపోతున్నాడు. కానీ రైతు అంత ధర ఇవ్వాలని కోరడం లేదు. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు 9435 లేదా 9335 రూపాయలు ఇవ్వాలని బతిమలాడుతున్నాడు. ఇకనైనా అధికారులు స్పందించి రైతులకు మద్దతు ధర కల్పించేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉంది.

నేడు రైతులు వినూత్న ధర

ధాన్యానికి మద్దతు ధర కల్పించాలని కోరుతూ జిల్లా కేంద్రంలో అఖిల పక్షం రైతు సంఘం ఆధ్వర్యాన రైతులు వినూత్న ఆందోళనకు దిగనున్నారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చే రైతులు ఆత్మకూరు బస్టాండుకు చేరుకుంటారు. రైతులు, రైతు సంఘాల నాయకులు వరి పనలు చేత్తో తీసుకుని, వడ్ల మూట్లను నెత్తిన పెట్టుకుని గాంధీబొమ్మకు చేరుకుంటారు. అక్కడ వడ్ల రాశి వినూత్న నిరసన తెలుపుతారు. ఈ సందర్భంగా వారు రిలే నిరాహార దీక్షలు కూడా చేపట్టనున్నారు. ఆందోళనలో అధిక సంఖ్యలో రైతులు పాల్గొని జయప్రదం చేయాలని అఖిలపక్ష రైతు సంఘం జిల్లా కన్వీనర్‌ గంగపట్నం రమణయ్య రైతులకు విజ్ఞప్తి చేశారు.

నేడు కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ ..కోవూరు ఓట్ల లెక్కింపు రేపు


కోవూరు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వెంకటేశ్వరపురంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో బుధవారం ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇందులో పాల్గొనే సిబ్బందికి మంగళవారం శిక్షణ ఇవ్వనున్నారు. మొత్తం 19 రౌండ్లలో పూర్తిస్థాయి ఫలితం వెల్లడవుతుంది. ఒక్కో రౌండ్‌కు 14 టేబుళ్లు ఏర్పాట్లు చేశారు. తొలి రౌండ్ ఫలితం ఉదయం 8.30 గంటలకు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఓట్ల లెక్కింపును బుచ్చిరెడ్డిపాళెం మండలం నుంచి ప్రారంభించి కోవూరు, కొడవలూరు, విడవలూరు, చివరగా ఇందుకూరుపేట మండలంతో పూర్తవుతుంది. తొలి రౌండ్ ఫలితానికి అర్ధ గంట సమయం పట్టవచ్చు. ఆ తరువాత 15 నుంచి 20 నిమిషాల్లో ఒక్కో రౌండ్ పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ లెక్కన తుది ఫలితం అదే రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు వెల్లడి కావచ్చని అంచనా వేస్తున్నారు. ఓట్లు నమోదైన ఈవీఎంలు భద్రపరచిన స్ట్రాంగ్ రూమ్‌ను సోమవారం జిల్లా ఎన్నికల అధికారి బి. శ్రీధర్, రిటర్నింగ్ అధికారి వీరభద్రయ్య తదితరులు పరిశీలించారు.  కోవూరు ఉప ఎన్నికల కౌంటింగ్ సిబ్బందికి మంగళవారం కోవూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో శిక్షణ ఇస్తున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి వీరభద్రయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 255 పోలింగ్ బూత్‌లకు సంబంధించి 19 రౌండ్లకు 14 టేబుళ్లు ఏర్పాటు చేశామన్నారు. వీటితోపాటు పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ కోసం ప్రత్యేక టేబుల్‌ను ఏర్పాటుచేశామన్నారు. ఒక్కో టేబుల్ వద్ద ముగ్గురు అధికారుల చొప్పున 42 మందిని ఏర్పాటుచేస్తున్నామన్నారు. వీరందరికీ సహకారం అందించేందుకు మరో 100 మంది సిబ్బందిని అందుబాటులో ఉంచుతామన్నారు. ఈవీఎంలు ఉన్న స్ట్రాంగ్‌రూమ్ వద్ద గట్టి బందోబస్తును ఏర్పాటు చేశామని, లెక్కింపు సందర్భంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు ప్రత్యేక కమాండో దళాన్ని ఏర్పాటుచేశామని తెలిపారు. అందుకోసం నాలుగు ప్రత్యేక గదుల్లో సీసీ కెమెరాలు అమర్చామన్నారు. టేబుళ్ల వద్ద చిన్నపొరపాటు దొర్లినా సీసీ కెమెరా ద్వారా ఉన్నతాధికారులకు తెలుస్తుందన్నారు. లెక్కింపు సమయంలో అధికారులంతా సమయపాలన పాటించి విధులకు హాజరుకావాలన్నారు.

నేటి నుంచి పోలేరమ్మజాతర అత్యంత వైభవంగా


తూర్పుకనుపూరు : భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతూ కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా ప్రసిద్ధిగాంచిన ముత్యాలమ్మ ఆలయంలో నేటి నుంచి పోలేరమ్మజాతర అత్యంత వైభవంగా జరగనుంది. తీరప్రాంతంలోని తూర్పుకనుపూరు, అద్దేపల్లి, కొమరావారిపాళెం, బల్లవోలు, పోసినవారిపాళెం, ఈదలవారిపాళెం, రావులవారిపాళెం గ్రామాల ఆరాధ్యదైవంగా వెలుగొందే ముత్యాలమ్మ కాలక్రమంలో భక్తుల సంఖ్యను పెంచుకుంటూ జిల్లాలోని నలుమూలల నుంచే కాక ఇతర రాష్ట్రాలైన చెన్నై, కర్ణాటక ప్రాంతాల నుంచి భక్తులు అమ్మవారికోసం వస్తుంటారు.

100 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో తమలపాకుల వ్యాపారం చేసుకుంటున్న రామయ్యశెట్టికి అమ్మవారు కలలో కనిపించి తూర్పుకనుపూరు ప్రాంతంలో ఆలయాన్ని నిర్మించాలని కోరినట్లు అక్కడివారు చెపుతుంటారు. ఈ క్రమంలో అప్పట్లో పూరిగుడిసెలో అమ్మవారిని ప్రతిష్టించి పూజలు చేయడం మొదలు పెట్టారు. అనంతరం వేమారెడ్డి వంశస్తులు రాతిగోడలు నిర్మించి అమ్మవారికి గుడి కట్టారు. కాలక్రమంలో భక్తులు అధికసంఖ్యలో వస్తుండడంతో దేవాదాయశాఖ ఆలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని జాతరను అత్యంత వైభవంగా నిర్వహిస్తుంది. నేటి నుంచి 23వ తేదీ వరకు నాలుగు రోజులపాటు జాతర నిర్వహించనున్నారు. ఇప్పటికే చుట్టు ప్రక్కల గ్రామాల్లో చాటింపు వేయించి ఆదివారం ఘటోత్సవాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ ఘటం తూర్పుకనుపూరు, ఈదలవారిపాళెం గ్రామాల్లో సోమవారం వరకూ సంచరించగా, మంగళవారం కొమరవారిపాళెం, రావులవారిపాళెం, పోసినవారిపాళెం గ్రామాల్లో తిరిగి తూర్పుకనుపూరుకు చేరుకుంటుంది. ఘటం చేరుకున్న వెంటనే పోలేరమ్మ విగ్రహాన్ని తయారు చేసేందుకు కుమ్మర్లు సిద్ధం అవుతారు. అనంతరం గంగ మిట్టమీద అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించి గణాచారి కొమ్ముబూర ఊది జాతర ప్రారంభిస్తున్నట్లు ప్రకటిస్తారు. జాతర ఆరంభమవుతుంది. ఈ జాతరకు లక్షలాదిగా భక్తులు తరలిరానున్నారు.

పోలీసు స్టేషన్ల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నాం. తమ గోడును పట్టించుకునే నాధుడు లేరు. మీరైనా ....

నెల్లూరు :  సమస్యలు పరిష్కరించాలని పోలీసు స్టేషన్ల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నాం. తమ గోడును పట్టించుకునే నాధుడు లేరు. మీరైనా స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని బాధితులు సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన ప్రజావిజ్ఞప్తుల దినంలో ఎస్పీ రమణకుమార్‌కు విన్నవించుకున్నారు. స్పందించిన ఎస్పీ వెంటనే వారి సమస్యలను పరిష్కరించాలని ఆయా ప్రాంతాల పోలీసు అధికారులను ఆదేశించారు. ప్రజావిజ్ఞప్తుల దినంలో 22 అర్జీలు వచ్చాయి. అందులో ఏడు అర్జీలు సివిల్ వివాదాలకు సంబంధించినవి కావడంతో వాటిని లీగల్‌సెల్ అథారిటీకి పంపారు.

భర్త వేధింపుల నుంచి కాపాడండి
భర్త, అత్తింటి వారి వేధింపుల నుంచి తనను కాపాడాలని సుబేదార్‌పేట ఆజాద్‌వీధికి చెందిన బి. సువర్ణలక్ష్మి కోరారు. అనంతపురం జిల్లా బుచ్చయ్యగారిపల్లెకు చెందిన బి.వి శ్రీధర్‌తో 2010 ఆగస్టు 15వ తేదీన తనకు వివాహమైందని తెలిపారు. శ్రీధర్ బెంగళూరులోని టీఎస్‌పీ లిమిటెడ్ కంపెనీలో కోఆర్డినేటర్‌గా పనిచేస్తున్నాడని తెలిపారు. వివాహ సమయంలో తన తల్లిదండ్రులు రూ.1.50 లక్షలు, పది సవర్ల బంగారు ఆభరణాలను కట్నం కింద ఇచ్చారని తెలిపారు. కొద్దిరోజులు సజావుగా తమ కాపురం సాగిందన్నారు. అనంతరం అదనపు కట్నం కింద రూ.3లక్షలు తీసుకురావాలని భర్తతో పాటు అత్తింటి వారు తనను తీవ్ర వేధింపులకు గురిచేశారన్నారు. ఈనేపథ్యంలో అదే ఏడాది డిసెంబర్‌లో తనను బలవంతంగా ఇంట్లోనుంచి బయటకు గెంటేశారన్నారు. ఈ విషయమై అప్పటి నుంచి తనకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేదన్నారు. ఇప్పటికైనా స్పందించి వేధింపులకు గురిచేస్తున్న భర్త, అత్తింటివారిపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.

రౌడీషీట్‌ను తొలగించాలి
తనపై అన్యాయంగా బనాయించిన రౌడీషీట్‌ను తొలగించాలని దొరవారిసత్రం ఆర్‌ఎంపీ వైద్యులు చింతపూడి అయ్యన్న కోరారు. తాను కొంతకాలంగా ఆ ప్రాంతంలో దళితుల సమస్యలపై ఉద్యమిస్తున్నానని తెలిపారు. స్థానిక పోలీసులు ఓ పథకం ప్రకారం తనపై అన్యాయంగా రౌడీషీట్‌ను తెరిచారని తెలిపారు. దీనిపై విచారణ చేసి రౌడీషీట్‌ను తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

నా భర్తను దారిలో పెట్టండి
మద్యానికి బానిసై తన భర్త వేధింపులకు పాల్పడుతున్నాడని, అతన్ని సరైన దారిలో పెట్టాలని నెల్లూరు రూరల్ మండలం సౌత్‌మోపూరుకు చెందిన చక్కిరాల వెంకటశేషమ్మ కోరారు. తనకు 20 ఏళ్ల కిందట శేషయ్యతో వివాహమైందన్నారు. ఇద్దరు పిల్లలున్నారని తెలిపారు. మద్యానికి బానిసైన శేషయ్య రోజూ తమను వేధింపులకు గురిచేస్తున్నాడన్నారు. ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి కాపాడండి
రియల్ ఎస్టేట్ వ్యాపారుల బారి నుంచి కాపాడాలని మనుబోలు కోదండరామపురం అరుందతీయవాడ వాసులు ఎస్పీని కోరారు. తాము 30ఏళ్లుగా కోదండరామపురంలోని ప్రభుత్వ భూమిలో నివాసముంటున్నామని తెలిపారు. తాజాగా బాలాజీ ఎన్‌క్లేవ్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆ స్థలం తమదంటూ తమపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారని, తమ ఇళ్లను కూలదోసి నిలువ నీడ లేకుండా చేస్తున్నారని తెలిపారు. వారి భారి నుంచి తమను కాపాడాలని కోరారు.

అన్యాయంగా కేసుపెట్టారు
తమ తల్లిదండ్రులపై రెండోనగర పోలీసులు అన్యాయంగా కేసు పెట్టారని తడికలబజారుకు చెందిన ఎర్రమల్లి హరికృష్ణ ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. తన తమ్ముడు మదుకు జగదేవిపేటకు చెందిన లావణ్యతో 2005లో వివాహమైందన్నారు.

వివాహమైన నాటినుంచి మధు, భార్యతో కలిసి తమకు దూరంగా ఉంటున్నారన్నారు. ఈక్రమంలో మధు, లావణ్య నడుమ విబేధాలు పొడచూపాయన్నారు. దీంతో లావణ్య మధుతో పాటు తన తల్లిదండ్రులైన చిన్నయ్య, చిన్నమ్మపై రెండోనగర పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారన్నారు. పోలీసులు మధుతోపాటు తమ తల్లిదండ్రులపై కేసు నమోదు చేశారని తెలిపారు. హరికృష్ణ తల్లిదండ్రులకు ఎలాంటి సంబంధం లేనప్పటికి కేసు నమోదు చేయడం దారుణమని దీనిపై విచారించి న్యాయం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కర్నాటి ఆంజనేయరెడ్డి, మిడతల రమేష్ ఎస్పీని కోరారు. సమస్యలు పరిష్కరించాలని పోలీసు స్టేషన్ల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నాం. తమ గోడును పట్టించుకునే నాధుడు లేరు. మీరైనా స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని బాధితులు సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన ప్రజావిజ్ఞప్తుల దినంలో ఎస్పీ రమణకుమార్‌కు విన్నవించుకున్నారు. స్పందించిన ఎస్పీ వెంటనే వారి సమస్యలను పరిష్కరించాలని ఆయా ప్రాంతాల పోలీసు అధికారులను ఆదేశించారు. ప్రజావిజ్ఞప్తుల దినంలో 22 అర్జీలు వచ్చాయి. అందులో ఏడు అర్జీలు సివిల్ వివాదాలకు సంబంధించినవి కావడంతో వాటిని లీగల్‌సెల్ అథారిటీకి పంపారు.

భర్త వేధింపుల నుంచి కాపాడండి
భర్త, అత్తింటి వారి వేధింపుల నుంచి తనను కాపాడాలని సుబేదార్‌పేట ఆజాద్‌వీధికి చెందిన బి. సువర్ణలక్ష్మి కోరారు. అనంతపురం జిల్లా బుచ్చయ్యగారిపల్లెకు చెందిన బి.వి శ్రీధర్‌తో 2010 ఆగస్టు 15వ తేదీన తనకు వివాహమైందని తెలిపారు. శ్రీధర్ బెంగళూరులోని టీఎస్‌పీ లిమిటెడ్ కంపెనీలో కోఆర్డినేటర్‌గా పనిచేస్తున్నాడని తెలిపారు. వివాహ సమయంలో తన తల్లిదండ్రులు రూ.1.50 లక్షలు, పది సవర్ల బంగారు ఆభరణాలను కట్నం కింద ఇచ్చారని తెలిపారు. కొద్దిరోజులు సజావుగా తమ కాపురం సాగిందన్నారు. అనంతరం అదనపు కట్నం కింద రూ.3లక్షలు తీసుకురావాలని భర్తతో పాటు అత్తింటి వారు తనను తీవ్ర వేధింపులకు గురిచేశారన్నారు. ఈనేపథ్యంలో అదే ఏడాది డిసెంబర్‌లో తనను బలవంతంగా ఇంట్లోనుంచి బయటకు గెంటేశారన్నారు. ఈ విషయమై అప్పటి నుంచి తనకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేదన్నారు. ఇప్పటికైనా స్పందించి వేధింపులకు గురిచేస్తున్న భర్త, అత్తింటివారిపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.

రౌడీషీట్‌ను తొలగించాలి
తనపై అన్యాయంగా బనాయించిన రౌడీషీట్‌ను తొలగించాలని దొరవారిసత్రం ఆర్‌ఎంపీ వైద్యులు చింతపూడి అయ్యన్న కోరారు. తాను కొంతకాలంగా ఆ ప్రాంతంలో దళితుల సమస్యలపై ఉద్యమిస్తున్నానని తెలిపారు. స్థానిక పోలీసులు ఓ పథకం ప్రకారం తనపై అన్యాయంగా రౌడీషీట్‌ను తెరిచారని తెలిపారు. దీనిపై విచారణ చేసి రౌడీషీట్‌ను తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

నా భర్తను దారిలో పెట్టండి
మద్యానికి బానిసై తన భర్త వేధింపులకు పాల్పడుతున్నాడని, అతన్ని సరైన దారిలో పెట్టాలని నెల్లూరు రూరల్ మండలం సౌత్‌మోపూరుకు చెందిన చక్కిరాల వెంకటశేషమ్మ కోరారు. తనకు 20 ఏళ్ల కిందట శేషయ్యతో వివాహమైందన్నారు. ఇద్దరు పిల్లలున్నారని తెలిపారు. మద్యానికి బానిసైన శేషయ్య రోజూ తమను వేధింపులకు గురిచేస్తున్నాడన్నారు. ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి కాపాడండి
రియల్ ఎస్టేట్ వ్యాపారుల బారి నుంచి కాపాడాలని మనుబోలు కోదండరామపురం అరుందతీయవాడ వాసులు ఎస్పీని కోరారు. తాము 30ఏళ్లుగా కోదండరామపురంలోని ప్రభుత్వ భూమిలో నివాసముంటున్నామని తెలిపారు. తాజాగా బాలాజీ ఎన్‌క్లేవ్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆ స్థలం తమదంటూ తమపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారని, తమ ఇళ్లను కూలదోసి నిలువ నీడ లేకుండా చేస్తున్నారని తెలిపారు. వారి భారి నుంచి తమను కాపాడాలని కోరారు.

అన్యాయంగా కేసుపెట్టారు
తమ తల్లిదండ్రులపై రెండోనగర పోలీసులు అన్యాయంగా కేసు పెట్టారని తడికలబజారుకు చెందిన ఎర్రమల్లి హరికృష్ణ ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. తన తమ్ముడు మదుకు జగదేవిపేటకు చెందిన లావణ్యతో 2005లో వివాహమైందన్నారు.

వివాహమైన నాటినుంచి మధు, భార్యతో కలిసి తమకు దూరంగా ఉంటున్నారన్నారు. ఈక్రమంలో మధు, లావణ్య నడుమ విబేధాలు పొడచూపాయన్నారు. దీంతో లావణ్య మధుతో పాటు తన తల్లిదండ్రులైన చిన్నయ్య, చిన్నమ్మపై రెండోనగర పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారన్నారు. పోలీసులు మధుతోపాటు తమ తల్లిదండ్రులపై కేసు నమోదు చేశారని తెలిపారు. హరికృష్ణ తల్లిదండ్రులకు ఎలాంటి సంబంధం లేనప్పటికి కేసు నమోదు చేయడం దారుణమని దీనిపై విచారించి న్యాయం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కర్నాటి ఆంజనేయరెడ్డి, మిడతల రమేష్ ఎస్పీని కోరారు.

రెండవ విడత ఉప ఎన్నికల సమరం కోసం ఉదయగిరి సిద్ధం..


ఉదయగిరి : రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత ఉప ఎన్నికల సమరం ముగియటంతో రెండవ విడత ఉప ఎన్నికల సమరం కోసం ఉదయగిరి సిద్ధం పడుతోంది. జిల్లాలో మొదటి విడతగా జరిగిన ఉప ఎన్నికల్లో కోవూరు ఎన్నిక అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న రాజకీయ పార్టీలు ఉదయగిరిలో జరగనున్న ఎన్నికలను మరింత ప్రతిష్ఠాత్మకంగా తీసుకొనున్నాయి. విప్‌ ధిక్కారం క్రింద శాసనసభ్యుత్వాన్ని కోల్పోయిన మేకపాటి చంద్రశేఖరరెడ్డి గత రెండు పర్యయాలు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్ధిగా విజయం సాధించారు. తాజాగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్ధిగా ఉపపోరుకు సిద్ధపడుతున్నారు. ఉప ఎన్నిక అనివార్యమని భావించే ముందే అభ్యర్ధిని ప్రకటించిన తెలుగుదేశం పార్టీ కూడా తన వంతు ఎన్నికల వ్యూహన్ని సిద్ధం చేసుకుంటుంది.

ప్రముఖ పారిశ్రామిక వేత్త బొల్లినేని వెంకట రామారావు ఎన్నికల బరిలో తెలుగుదేశం పార్టీ తరుపున ఒక విడత నియోజక వర్గం పర్యటన పూర్తి చేశారు. అధికార కాంగ్రెస్‌ పార్టీ ఉప ఎన్నికల పోరును ఎదుర్కొటానికి సర్వ శక్తులు వడ్డీ వ్యూహన్ని రసించుకుంటోంది. కాంగ్రెస్‌ పార్టీలో మర్రి వృక్షంలా పెరిగిన మేకపాటి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి వెళ్ళటంతో కాంగ్రెస్‌ అభ్యర్ధిత్వం కోసం ద్వితీయ శ్రేణి నేతల్లో ఆశలు పెరిగాయి. కాంగ్రెస్‌ పార్టీ ద్వితీయ శ్రేణి ఆశావాహులతోపాటు గతంలో పార్టీ వీడి కాంగ్రెస్‌లో చేరిన మాజీ మంత్రి మాదాల జానకిరామ్‌ కూడా రేసులో ఉన్నట్లు సంకేతాలు అందుతున్నాయి. టీడీపీ అభ్యర్థిగా ఒక్కసారి, స్వతంత్ర అభ్యర్థిగా మరోసారి ఉదయగిరి శాసనసభ్యుడుగా ఎన్నికయిన కంభం విజయరామిరెడ్డి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌ పార్టీలో చేరటం ఇటీవల కాలంలో జరిగిన కొత్త పరిణామం.

ఈయన కూడా ఉదయగిరి టిక్కెట్టు ఆశిస్తున్నట్లు తెలిసింది. మాజీ జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పి చెంచలబాబుయాదవ్‌, సీతారామపురం మాజీ జడ్పీటీసి సభ్యులు దుగ్గిరెడ్డి గురువారెడ్డి, జలదంకి మాజీ మండలాధ్యక్షుడు కావ్వ కృష్ణారెడ్డి మర్రిపాడు మాజీ మండలాధ్యక్షుడు పుట్టం బ్రహ్మానందరెడ్డి తదితరులు కూడా తమ గెలుపు అవకాశాలను అదిష్ఠానం ముందు వివరించి టిక్కెట్టు తమకు ఇవ్వాలని కోరుతున్నట్లు సమాచారం. రాష్ట్ర ఆర్ధిక మంత్రి ఆనం రామానారాయణరెడ్డి ఉదయగిరిపై ప్రత్యేక శ్రద్ద పెట్టి ఎలానైనా ఉదయగిరిని హస్తగతం చేసుకోవాలని గుంబనంగా ఉన్నట్లు సమాచారం. జిల్లాలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరుపున అన్నీతానై ఆనం కుటుంబానికి సవాళ్ల మీద సవాళ్లు విసిరిన మేకపాటి సోదరులను ఓడించటానికి ఆనం కుటుంబం అత్యంత రహస్య వ్యూహం నిర్వహించటానికి పకడ్బీందీగా రంగం చేసుకుంది.

తెలుగుదేశం అభ్యర్ధి బొల్లినేని వెంకటరామారావుకు ప్రజలతో అనుకున్న మేరా సన్నిహిత సంబంధాలు లేక పోవటంతో ఆయన నియోజకవర్గంలో గెలుపుకోసం మరింత కష్ట పడాల్సివుంది. ఇదే అదునుగా బావించిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు మేకపాటి చంద్రశేఖరరెడ్డి కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఎవ్వరికి వారు రహస్యంగా వ్యూహన్ని స్దిద్దంచేసుకుంటున్నారు.

Sunday, March 18, 2012

వైఎస్‌ఆర్‌సి అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి వీరి మధ్య ప్రధాన పోటీ..

 అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన కోవూరు ఉప ఎన్నికల్లో తామే గెలుస్తామని ఎవరికి వారు ధీమాలో ఉన్నారు. ముఖ్యంగా ప్రధాన పార్టీ అభ్యర్థులు ఇప్పటికే కూడికలు, తీసివేతల్లో నిమగమై ఉన్నారు. ఆదివారం జరిగిన ఉప ఎన్నికల్లో ఊహించని రీతిలో పోలింగ్‌ శాతం పెరిగింది. పెరిగిన ఓటింగ్‌ శాతం ఎవరి వైపు వెళ్తుందోననేది ఆసక్తికరమైన విషయం.సాధారణంగా 55 నుంచి 60 లేదా బాగా జరిగితే 60 నుంచి 75 శాతం పోలింగ్‌ జరుగుతుంది. ఈ సారి ఉప ఎన్నికల్లో 83.70 శాతం నమోదైంది. దాంతో అందరి అభ్యర్థుల్లోనూ ఉత్కంట, ఒకింత ఆశ మొదలైంది. పెరిగిన ఓట్ల శాతం తమకే అనుకూలంగా మారుతుందని భావిస్తున్నారు. టిడిపి అభ్యర్థిగా సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి, సిపిఎం అభ్యర్థిగా జొన్నలగడ్డ వెంకమరాజు, వైఎస్‌ఆర్‌సి అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి పోటీలో ఉన్నారు. వీరి మధ్య ప్రధాన పోటీ జరిగింది. టిడిపి, సిపిఎం అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. వైఎస్‌ఆర్‌సి అభ్యర్థి అనుకున్న స్థాయిలో చేయలేదు. నేతలు ఎక్కువ భాగం ప్రెస్‌మీట్లకే పరిమితమయ్యారు. పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి వెనుకబడ్డారు. తమ అభ్యర్థుల విజయం కోసం ఆయా పార్టీల అగ్రనేతలు బాగానే ప్రచారం చేశారు. వై.ఎస్‌.జగన్‌ అయితే తానే అభ్యర్థి లాగా ప్రచారం చేశారు. దాదాపు తొమ్మిది రోజులు నియోజకవర్గంలో కాలికి బలం కట్టుకుని తిరిగారు. నియోజకవర్గంలో కాంగ్రెస్‌, వైఎస్‌ఆర్‌సి అభ్యర్థులపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. టిడిపి అభ్యర్థి కొత్త. బూర్జువా పార్టీ అభ్యర్థులు తమ పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను పోగొట్టేందుకు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు నానా గడ్డికరిచారనే విమర్శలున్నాయి. సీసాల సీసాల మద్యాన్ని పారించారు. కోట్ల రూపాయల డబ్బును పంచారు. తొలుత వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ఓటుకు రూ. 200 లెక్కన గ్రామాల్లో పంచారు. ఎక్కువ మంది ఓటర్లు ఓటుకు రెండు వేల రూపాయల వంతున ఇస్తారని ఊహించారు. అందుకు భిన్నంగా ఆ పార్టీ వారు రూ.200 మాత్రమే ఇచ్చింది. దాంతో ఓటర్లలో కొంత అసంతృప్తి నెలకొంది. అలాగేటిడిపి కొన్ని మత్స్యకార గ్రామాల్లో దురాయి వేయించుకుని ఓట్లు వేయించుకుంది. గ్రామాల్లో గుళ్లూ, గోపరాలూ కట్టించేందుకు డబ్బులు పందేరం చేసింది. అంతేగాక ఓటుకు రూ. 500 చొప్పున ఇచ్చారు. తొలి నుంచీ మందకొడిగా ప్రచారం చేస్తున్న కాంగ్రెస్‌అభ్యర్థి మూడో స్థానంలో నిలుస్తారని ప్రచారం జరిగింది. పోలింగ్‌ సమీపస్తున్న రెండ్రోజుల ముందు ఆయన తన రాజకీయ చతురతను ప్రదర్శించారు. ఎంపిక చేసిన సుమారు లక్ష ఓటర్లకు ఓటుకు వెయ్యి రూపాయల చొప్పున పంచారు. అంతేగాక వారితో ఒట్టు కూడా వేయించుకున్నారు. దాంతో ఒక్కసారిగా నియోజకవర్గంలో ఓటింగ్‌ సమీకరణలు మారిపోయాయి. ఎంపిక చేసిన ఓటర్లకే వెయ్యి రూపాయలివ్వడంతో మిగతా ఓటర్లు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. దానిని పసిగట్టిన పోలంరెడ్డి పోలింగ్‌ రోజు కూడా ఓటేయకుండా స్లిప్పు చూపించిన ప్రతి ఓటరుకూ వెయ్యి రూపాయలు ఇచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో పోలింగ్‌ 83.70 శాతానికి పెరిగింది. మహిళలు, యువకులు అధిక సంఖ్యలో పోలింగ్‌లో ఉన్నారు. పెరిగిన ఓట్లు ఏ పార్టీకి పడతాయనేది అటు రాజకీయ పార్టీల్లోనూ, ఇటు ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. సెంటిమెంట్‌తో ఓట్ల శాతం పెరిగిందా డబ్బు పంపకాల వల్లా అనే చర్చ సాగుతోంది. అందుకు తెరదించాలంటే ఈనెల 21వ తేదీ దాకా ఆగాల్సిందే.

కోవూరు నియోజక వర్గంలోని ఐదు మండలాల్లో జరిగిన ఉప ఎన్నిక లో 76శాతం పోలైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు


కోవూరు : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు నియోజక వర్గంలోని ఐదు మండలాల్లో జరిగిన ఉప ఎన్నిక చదురు మదురు సంఘటనలు మినహాయించి ప్రశాంతంగా జరగడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ ఎన్నికల ప్రక్రియ సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగింది. ఉదయం 11 గంటల వరకు మందకోడిగా సాగిన పోలింగ్‌ అనంతరం ఊపందుకొంది. సాయంత్రం ఐదు గంటలకల్లా 76శాతం పోలైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. కొడవలూరు మండలం లోని మానేగుంటపాళెంలో వైఎస్‌ఆర్‌సిపికి ఓటు వేశారన్న నెపంతో కాంగ్రెస్‌పార్టీకి సంబంధించిన కార్యకర్తలు తండ్రి, కూతుర్ని చితక బాదారు. దీంతో మానేగుంటపాళెంలో కాంగ్రెస్‌ కార్యకర్తలకు, వైఎస్‌ఆర్‌ సిపి కార్యకర్తలకు వాగ్వివాదం జరిగింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి గుంపులను చెదరగొట్టడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగలేదు.

పోలీసులు బాధితులను సంబంధిత స్టేషన్‌లో ఫిర్యాదు చేయమని చెప్పడంతో వారు కొడవలూరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అలాగే బుచ్చిమండలంలోని శ్రీపురంధపురంలో 485 మంది ఉన్న ఈ గ్రామంలో ఓటింగ్‌ను బహిష్కరించారు. ఎన్నికలను బహిష్కరించిన విషయం ఎన్నికల అధికారి ఈ విషయాన్ని ఎన్నికల అధికారి బన్వర్‌లాల్‌ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. రాష్ర్ట ఎన్నికల అధికారి సంబంధిత విషయాన్ని జిల్లా కలెక్టర్‌ బి.శ్రీధర్‌కు తెలియజేశారు. జిల్లా కలెక్టర్‌, ఆర్‌డిఓ సుబ్రహ్మణ్యంకు ఎన్నికల్లో ప్రత్యేకంగా నియమించిన డిఎస్‌పికి సంఘటన గురించి వాకబు చేయమని సంఘటనా స్థలానికి పంపించారు. దీంతో తిరిగి 1.40గంటల నుంచి శ్రీపురందరపురంలో ఓటింగ్‌ ప్రక్రియ కొనసాగింది. అనంతరం కోవూరులో 246 ఇవిఎం 2గంటలపాటు మోరాయించింది. అనంతరం వేరే ఇవిఎం ద్వారా ఓటింగ్‌ను కొనసాగించారు. బుచ్చిరెడ్డిపాళెంలోని స్థానిక రిజిస్టార్‌ కార్యాలయం వద్ద ఉన్న పోలింగ్‌ బూత్‌ వద్ద వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకాకర్యకర్తలకు టీడీపీ కార్యకర్తలకు కొద్దిసేపు వివాదం జరిగింది. దీంతో పోలీసులు స్వల్పంగా లాఠీచార్జి జరిపి ఇరువర్గాలను అక్కడ నుంచి పంపివేయడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగలేదు.
అలాగే ఇందుకూరుపేట మండలంలోని గంగవరంలో ఉన్న 224 బూత్‌లో కొద్ది సేపు ఇవిఎం మోరాయించింది. అనంతరం తిరిగి ఓటింగ్‌ కార్యక్రమం ప్రారంభమైంది.

కోవూరు పరిధిలోని చెర్లోపల్లిలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే విష్ణువర్థన్‌రెడ్డి పర్యటిస్తూ కాంగ్రెస్‌ పార్టీకి ఓటువేయాలని చెపుతుండడంతో ఈ ప్రాంతంలో వైఎస్‌ఆర్‌ సిపి, టిడిపి పార్టీల కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని విష్ణువర్థన్‌రెడ్డి అక్కడి నుంచి పంపించి వేయడంతో ఎటువంటి వివాదం లేకుండానే ఓటింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది. అదే ప్రాంతంలో ఒకే బజారులో ఉన్న 42మంది ఓటర్లు తమ ఓటులేదని కొద్దిసేపు ఆందోళన చేపట్టారు. వారి వద్ద ఆ ప్రాంతంలో నివాసం ఉన్నట్లు అన్ని ఆధారులు ఉన్నప్పటికి ఓటరు లిస్టులో ఆ 42 మంది పేర్లు లేక పోవడంతో విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకొచ్చినప్పటికి అధికారులు ఓటరు లిస్టులో పేరులేక పోతే తామేమి చేయలేమని తెలపడంతో ఆ 42 మంది ఆందోళన చేసేందుకు సిద్ధం అవుతుండడంతో పోలీసులు జోక్యం చేసుకుని వారి అక్కడి నుంచి పంపించి వేశారు.

కోవూరు మండలానిక వస్తే ఎంఆర్‌ఓ కార్యాలయానికి కొద్ది దూరంలో ఉన్న పోలింగ్‌ కేంద్రం వద్ద వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలకు, కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య ఓటింగ్‌ విషయమై వివాదం చోటు చేసుకుంది. పోలీసులు అప్రమత్తమై వివాదాన్ని మొదటిలోనే అణచివేయడంతో ఎటువంటి అల్లర్లు చెలరేగలేదు. ఈ ఘటన ఉదయం 10 గంటల నుంచి 10.35 గంటల వరకు అర్థగంట పాటు జరిగింది. మొత్తంమీద కోవూరు ఉప ఎన్నికలో చిన్న చిన్న ఘర్షణలు గందగోళాలు, ఆందోళనల మధ్య ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది

ఓ పార్టీ ఓటుకు రూ. వెయ్యి ఇచ్చిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇది కూడా మెజార్టీ, గెలుపుపై ప్రభావం చూపిస్తుందని పందేల రాయుళ్లు


నెల్లూరు : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొవూరు నియోజకవర్గంలో ఈ ఉప ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే విషయమై బెట్టింగ్ రాయుళ్లే గందరగోళానికి గురవుతున్నట్లుగా సమాచారం. కొవూరులో ఎవరు గెలుస్తారు? రెండో స్థానంలో ఎవరుండారు? గెలిచే అభ్యర్థికి మెజార్టీ ఎంత ఉంటుంది అనే విషయాలపై జోరుగా బెట్టింగు జరుగుతున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఓ పార్టీ అభ్యర్థి గెలుస్తారని, అది భారీ మెజార్టీతో గెలుస్తారని భావించిన బెట్టింగ్ రాయుళ్లు శనివారం ఉదయం నుండి సాయంత్రం వరకు పోలింగ్ సరళిని చూసిన తర్వాత తమ మనసు మార్చుకున్నారట. తొలి రెండు గంటల్లో భారీగా ఓటింగ్ నమోదైనప్పటికీ ఆ తర్వాత ఎండ, తదితర కారణాల వల్ల ఓటింగ్ శాతం తగ్గింది. సాయంత్రం ఓటింగ్ శాతం పుంజుకుంటుందని భావించినా అది జరగలేదు. దీంతో బెట్టింగ్ రాయుళ్లు తమ మనసు మార్చుకున్నారని అంటున్నారు.

ఇప్పటి వరకు గెలుస్తాడని భావించిన, మెజార్టీ భారీగా వస్తుందని భావించిన అభ్యర్థి విషయంలో బెట్టింగ్ రాయుళ్లకు ఆందోళన వ్యక్తమవుతోందంట. దీంతో వారు మళ్లీ మార్చి బెట్టింగులు కడుతున్నారని అంటున్నారు. అంతేకాకుండా ఓ పార్టీ ఓటుకు రూ. వెయ్యి ఇచ్చిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇది కూడా మెజార్టీ, గెలుపుపై ప్రభావం చూపిస్తుందని పందేల రాయుళ్లు అభిప్రాయపడుతున్నారట. దీంతో వ్యూహం మార్చుకొని తాము నష్టపోకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయంగా పందేలు కాస్తున్నారని అంటున్నారు.
sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh