online marketing

Friday, February 10, 2012

కాకాణి గోవర్థన్‌రెడ్డి కుమార్తె వివాహానికి హాజరైన వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

 కాకాణి గోవర్థన్‌రెడ్డి కుమార్తె వివాహానికి హాజరైన వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

పర్స్‌ను జేబుదొంగ చోరీ చేయడంపై పోలీసులకు ఫిర్యాదు

నెల్లూరు : వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ జిల్లా కన్వీనర్‌, మాజీ జడ్పీ ఛైర్మన్‌ కాకాణి గోవర్థన్‌రెడ్డి కుమార్తె వివాహానికి హాజరైన వ్యక్తి పర్స్‌ను జేబుదొంగ చోరీ చేయడంపై పోలీసులకు ఫిర్యాదు అందింది. విజయవాడకు చెందిన రామిరెడ్డి అనే వ్యక్తి నగర శివారులోని కనుపర్తిపాడు గ్రామంలో శుక్రవారం జరిగిన కాకాణి కుమార్తె వివాహానికి హాజరయ్యాడు. అతని జేబులోని పర్స్‌ను కాజేసిన దొంగ ఎవరో తెలియదు కాని,  వివాహ వేడుకలను తిలకించిన ఆయనకు చివర్లో దొంగ ఝలక్‌ ఇచ్చాడు. రామిరెడ్డికి మాత్రం రూ.10 వేలు చదివింపులుగా వదిలాయి. దీంతో బాధితుడు పర్స్‌ చోరీపై 5వ నగర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 5వ నగర క్రైం ఎస్‌ఐ శ్రీనివాసరావు బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రూ.6,40,000లు విలువ చేసే బంగారు మకరతోరణాన్ని అందజేశారు

నెల్లూరు : జొన్నవాడలోని శ్రీమల్లికార్జునస్వామి సమేత కామాక్షితాయి అమ్మవారికి శుక్రవారం దాతలు బంగారు మకర తోరణాన్ని బహూకరించారు. హైదరాబాద్‌కు చెందిన నందగోపాల్‌రెడ్డి-సుజాతమ్మ దంపతులు రూ.6,40,000లు విలువ చేసే బంగారు మకరతోరణాన్ని దేవస్థానం ఇఒ రవీంద్రారెడ్డికి అందజేశారు. ఆలయ అర్చకులు మకర తోరణానికి ప్రత్యేక పూజలు చేసి అమ్మవారికి అలంకరించారు. దీంతో అమ్మవారు మిరుమెట్లు గొలిపే తేజస్సుతో భక్తులకు దర్శనమిచ్చారు.

నెల్లూరుకు మంచి పేరు వచ్చే విధంగా కృషి చేస్తామన్నారు.

నెల్లూరు :శుక్రవారం రాత్రి స్థానిక ఎసి.సెంటర్‌లో కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తల అత్యవసర సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మీరు లేకపోతే.... మా రాజకీయ జీవితాలే లేవని, ఈ పదవులు రావని నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాల వల్ల తాము ప్రజలకు అందుబాటులో ఉండలే మని పేర్కొన్నారు. అయితే ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నాయకులకు ఆయన సూచించారు. అలాగే ప్రతిపక్షాల విమర్శలను తిప్పి కొట్టాలని ఆయన వారికి సూచించారు.

అసెంబ్లీ సమావేశాలకు ముందు ఇలా సమావేశాలు ఏర్పాటు చేసి సలహాలు, సూచనలు తీసుకునే ఆనవాయితీ ఉందన్నారు. మీ అందరి ఆశీస్సులతో ఎమ్మెల్యేలము అయినామని ఆయన తెలిపారు. వ్యక్తికన్నా పార్టీ, వ్యవస్థ గొప్పదని ఆయన తెలిపారు. ఎవ్వరూ ఊహించని విధంగా రూ.150 కోట్లతో నగరంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. ఇంకా నగరాభివృద్ధికి కృషి చేస్తామన్నారు. అలాగే సమస్యలపై ప్రశ్నించి వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. నెల్లూరుకు మంచి పేరు వచ్చే విధంగా కృషి చేస్తామన్నారు.

నగర ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల వల్ల ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని ఆయన పేర్కొన్నారు. సమస్యలు తీర్చాలని ఫోన్‌లు వస్తుంటాయని, వాటిని ప్రతిఒక్కరూ ముందుండి పరిష్కారానికి కృషి చేయాలని నాయకులకు ఆయన సూచించారు. వివేకానందరెడ్డి అసెంబ్లీలో చాలా ఎక్కువ ప్రశ్నలు వేసే ఎమ్మెల్యే అని ఆయన పేర్కొన్నారు. వివేకాను చూచి చాలా నేర్చుకున్నానని తెలిపారు. వివేకాను చూస్తే చంద్రబాబుకు కూడా భయమని ఆయన తెలిపారు.

అసెంబ్లీలో ప్రజల అవసరాలను తీర్చేందుకు మంచి ప్రశ్నలు వేయడం జరుగుతుందన్నారు. అలాగే మీడియాపై, రిజర్వేషన్‌పై, మరికొన్నింటిపై ప్రశ్నలు వేయడం జరుగుతుందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు ఆనం విజయకుమార్‌రెడ్డి, సన్నపురెడ్డి పెంచలరెడ్డి, ద్వారకనాధ్‌, జాకీర్‌, మాజీ కార్పొరేటర్‌ మేకల నరేంద్రరెడ్డి, పిండి సురేష్‌ తదితరులున్నారు.

కార్యకర్తలకు అభివాదం చేస్తూ...ఎదురు వచ్చిన జనాన్ని చిరునవ్వుతో పలకరిస్తూ జిల్లా పర్యటన ముగించుకుని వెళ్లారు.

నెల్లూరు :  శుక్రవారం తెల్లవారుజామున నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌లో నెల్లూరుకు చేరుకున్న జగన్‌కు రేల్వేస్టేషన్‌లో ఆయనకు ఘన స్వాగతం పలికారు. రేల్వేస్టేషన్‌ నుంచి ఆయన నేరుగా దర్గామిట్ట ప్రాంతంలోని మేకపాటి అతిథి గృహానికి చేరుకున్నారు.

ఉదయం 8.30గంటలకు అక్కడి నుంచి బయలుదేరి కనపర్తిపాడుకు వెళ్లారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ జిల్లా కన్వీనర్‌, జడ్పీమాజీ చైర్మన్‌ కాకాణి గోవర్ధనరెడ్డి కుమార్తె వివాహ కార్యక్రమానికి హాజరయ్యారు. దాదాపు అరగంట సేపుఅక్కడ గడిపారు. వధూవరులను ఆశీర్వదించిన అనంతరం తిరిగి అతిథిగృహానికి బయలుదేరారు. మార్గ మధ్యలో కనపర్తిపాడు వద్ద ఉన్న వైఎస్‌ఆర్‌ విగ్రహానికి పూల మాలవేసి నివాళఇర్పించారు. అక్కడకు చేరకున్న కార్యకర్తలకు అభివాదం చేశారు. ఉదయం 10 గంటలకు మేకపాటి అతిథిగృహానికి చేరుకున్నారు. జగన్‌కు పూలమాలలు, కండువాలు వేయడానికి అభిమానులు కార్యకర్తలు ఎగబడ్డారు. అక్కడ తనను కలువడానికి వచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తలను చిరునవ్వుతో పలుకరించారు.  పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులతో మేకపాటి అతిథిగృహం కిక్కిరిసిపోయింది.
కార్యకర్తలతో పలకరింపు అనంతరం జగన్‌ మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో పొదలకూరురోడ్డులోని జడ్పీ మాజీ చైర్మన్‌ డాక్టర్‌ బాలచెన్నయ్యకు చెందిన ఆస్పత్రిని ప్రారంభించారు. అక్కడి కొద్దిసేపు గడిపిన తర్వాత రాపూరుకు బయలుదేరి వెళ్లారు.
వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా పర్యటన ఆద్యంతం కార్యకర్తలకు అభివాదం చేస్తూ...ఎదురు వచ్చిన జనాన్ని చిరునవ్వుతో పలకరిస్తూ జిల్లా పర్యటన ముగించుకుని వెళ్లారు. జగన్‌ వెంట ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఇతర నేతలు వెళ్లారు. రాపూరు, వేపినాపిలలో వైఎస్‌ఆర్‌ విగ్రహాలను జగన్‌ ఆవిష్కరించారు. అనంతరం డక్కిలి, వెంకటగిరిలలో తనను చూడటానికి వచ్చిన కార్యకర్తలను పలుకరించిన అనంతరం సాయంత్రం 6 గంటలకు ప్రాంతంలో రోడ్డు మార్గాన కడపకు బయలుదేరి వెళ్లారు.

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్‌రెడ్డికి ఘన స్వాగతం పలికారు

వెంకటగిరి: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్‌రెడ్డికి వెంకటగిరి పట్టణ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు శుక్రవారం నెమళ్ళపూడి సురేష్‌రెడ్డి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు స్థానిక క్రాస్‌ రోడ్డు సెంటర్‌ వద్ద ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బాణా సంచా పేల్చి, మంగళవాయిధ్యాలతో ఆహ్వానించారు. రాపూరు నుండి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహావిష్కరణ పూర్తి చేసిన అనంతరం వెంకటగిరి మార్గంలో తిరుపతికి వెళుతున్న ఆయనకు నాయకులు ఘన స్వాగతం పలికారు.

రాపూరు మండలం వెపినాపి, సిద్దవరం గ్రామం నందు యువనేత


రాపూరు మండలం వెపినాపి, సిద్దవరం గ్రామం నందు యువనేత జగన్మోహన్‌రెడ్డి చేతులమీదుగా శుక్రవారం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి వెంకటగిరి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ  భారీ జనసమీకరణతో, కార్యకర్తలు, వైఎస్‌ఆర్‌ అభిమానులు రాపూరుకు తరలివెళ్లారు. ఈ సందర్భంగా సిద్దవరం గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్‌జగన్‌ను గజమాలతో సన్మానించారు.

యువతరం సభ విజయవంత చేసేందుకు భారీ జనసమీకరణ

వెంకటగిరి: తిరుపతిలో శుక్రవారం టిడిపి అధ్యక్షులు చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో జరిగిన యువతరం సభకు వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో 200బైక్‌లతో టిడిపి నాయకులు, తెలుగు యువతరం సభకు భారీగా తరలివెళ్లిన టిడిపి నాయకులు..  ఈ సందర్భంగా ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు చేపడుతున్న యువతరం సభ విజయవంత చేసేందుకు భారీ జనసమీకరణతో నాయకులు, టిడిపి కార్యకర్తలు తిరుపతికి తరలివెళ్లడం జరిగిందని ఆయన తెలిపారు.

Thursday, February 9, 2012

నెల్లూరు జిల్లా పర్యటనకు వైఎస్‌.జగన్‌

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షులు వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ఉదయం నెల్లూరు జిల్లా పర్యటనకు వస్తున్నారు. వైఎస్‌.జగన్‌ శుక్రవారం తెల్లవారుజామున నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌లో గుంటూరు నుంచి బయలుదేరి నెల్లూరు నగరానికి చేరుకుంటారు. అక్కడ నుంచి దర్గామిట్టలోని ఎల్‌ఐసి కార్యాలయం సమీపంలో వున్న మేకపాటి అతిథి గృహానికి చేరుకుని విశ్రాంతి తీసుకుంటారు.  తొలుత వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ జిల్లా కన్వీనర్‌ కాకాణి గోవర్థన్‌రెడ్డి కుమార్తె వివాహానికి హాజరై తిరిగి వెళ్లాలని భావించినప్పటికీ, జిల్లాలో పార్టీ నేతల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఒక రోజంతా జిల్లాలోని వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

ఉదయం 8 గంటలకు కనపర్తిపాడు మెయిన్‌ బైసాప్‌ రోడ్డు వద్ద కాకాణి గోవర్థన్‌రెడ్డి కుమార్తె వివాహ కార్యక్రమానికి హాజరవుతారు. అనంతరం కనపర్తిపాడులో వైఎస్‌ఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం ఉదయం 11 గంటలకు మేకపాటి అతిథి గృహం చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటల వరకు పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశమవుతారు. అనంతరం మధ్యాహ్నం 3.10 నిమిషాలకు నెల్లూరు నగరంలో జడ్పీ మాజీ ఛైర్మన్‌ డాక్టర్‌ బాలచెన్నయ్య నివాసానికి వెళ్తారు. అనంతరం రాపూరు, వేపినాపిలకు వెళ్లి వైఎస్‌ఆర్‌ విగ్రహాలను ఆవిష్కరిస్తారు. అనంతరం అదే రోజు రాత్రి కడపకు బయలుదేరి వెళ్తారని పార్టీ వర్గాలు తెలిపాయి

నేదురుమల్లి నివాసంలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి

వనరులు సమకూర్చడంలో ప్రభుత్వం ముందంజలో ఉందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. గురువారం స్థానిక నేదురుమల్లి నివాసంలో ఏర్పాటుచేసిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర శాసనసభ సమావేశాలు ఈనెల 13న ప్రారంభమౌతాయని, ఉభయసభలు రాష్ట్ర గవర్నర్‌చే 17వ తేదిన ప్రారంభమై రాబోవు ఆర్థిక సంవత్సర వార్షిక ప్రణాళికలను రూపొందించడం జరుగుతుందన్నారు.

సంక్షేమ పథకాలు అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం ముందంజలో ఉందన్నారు. ప్రస్తుతం జరిగే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న నిరసనలు, రాజకీయనాయకుల ధర్నాలు, ప్రాంతీయ ఉద్యమాల నిరసనలు, ప్రకృతి వైపరిత్యాలు ద్వారా ఏర్పడుతున్న కరువులకు సంబంధించి అర్థిక సంవత్సరం పూర్తి చేసుకుంటున్నట్లు తెలిపారు.  ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రాష్ట్ర ప్రభుత్వం వనరులు సమకూర్చడంలో ముందంజలోనే ఉందన్నారు. అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాలు అనంతరం పలుసమస్యలపై ఆయనకు ప్రజలు వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి నేదురుమల్లి రాజ్యలక్ష్మీ, ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, చెన్నుబాలకృష్ణారెడ్డి

Tuesday, February 7, 2012

సమీపంలోని చెరువు బాలికలు కాలకృత్యాలు తీర్చుకునేందుకు నెలవు

వెంకటగిరి : పట్టణంలోని ఉపాధ్యాయ కాలనీలో ఉన్న ఎస్సీ బాలికల వసతి గృహంలో మౌలిక వసతులు కరువై విద్యార్థినులు నానా అవస్థలుపడుతున్నారు.స్నానపు గదులు నీరు రాక నిరుపయోగంగా మారాయి. హాస్టల్‌లో పారిశుధ్యం పూర్తిగా లోపించింది. మరుగుదొడ్లు శిథిలావస్థకు చేరుకుని అపరిశుభ్రంగా తయారయ్యాయి. దీంతో బాలికలు కాలకృత్యాలు తీర్చుకునేందుకు సమీపంలోని చెరువు దగ్గరకు వెళ్లవలసివస్తోంది. కానీ, ఆప్రాంతం చిట్టడవిని తలపిస్తుండడంతో బాలికలు ఆందోళన చెందుతున్నారు. రాత్రివేళల్లో వారి అవస్థలు వర్ణనాతీతం. ఇక వసతిగృహంలో దోమల బెడద అధికంగా ఉంది.


దీంతో విద్యార్థినులు జ్వరాల బారిన పడుతున్నారు. వారానికోసారి వైద్యపరీక్షలు నిర్వహించాల్సిన వైద్యులు తూతూ మంత్రంగా సేవలందిస్తున్నారు. హాస్టల్‌లో పలువురు బాలికలు చర్మవ్యాధులతో బాధపడుతున్నారు. వసతిగృహంలోని వంటగది కూలేందుకు సిద్ధంగా ఉంది. కనీసం విద్యార్థినులకు పరిశుభ్రమైన నీరు కూడా దొరకడంలేదు. విధిలేని పరిస్థితుల్లో కలుషిత నీరు తాగడంవల్ల రోగాల బారిన పడే ప్రమాదం ఉంది. అప్పుడప్పుడూ అధికారులు హాస్టల్ తనిఖీ చేస్తున్నా తమ సమస్యలు ఏమాత్రం పరిష్కారం కావడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధు స్పందించి వసతిగృహంలో మౌలిక వసతులు కల్పించాల్సిందిగా విద్యార్థినులు కోరుతున్నారు.

జిల్లాలోని 520 మంది జర్నలిస్టులకు ప్రతిఏటా బీమా

నెల్లూరు : సమాజంలో, సామాజిక సేవల్లో జర్నలిస్టుల పాత్ర అభినందనీయమని జిల్లా కలెక్టర్‌ బి.శ్రీధర్‌ పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో జరిగిన జర్నలిస్టుల గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక సేవను జర్నలిస్టులు అంకితభావంతో పనిచేయాలన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి ఎపియుడబ్ల్యుజె యూనియన్‌ కృషి చేయాలన్నారు.

జిల్లాలోని 520 మంది జర్నలిస్టులకు ప్రతిఏటా బీమా పథకాన్ని ప్రవేశపెట్టడం హర్షణీయమన్నారు. అదేవిధంగా జర్నలిస్టుల సంక్షేమాన్ని దృష్టిలో వుంచుకుని సత్యంజీ ల్యాండ్‌ డెవలపర్స్‌ అండ్‌ బిల్డర్స్‌ అధినేత గోపిశెట్టి సత్యనారాయణ యునైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీకి రూ.5.20 కోట్లు బాండును అందజేయడం పట్ల కలెక్టర్‌ సత్యంజీని అభినందించారు. 


గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ల బాండ్‌ల ఆవిష్కరణ సందర్భంగా ఎపియు డబ్ల్యుజె యూనియన్‌ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌ బి.శ్రీధర్‌ను, సత్యంజీ అధినేత సత్యనారాయణను ఘనంగా సన్మానించారు. సత్యంజీ మాట్లాడుతూ భవిష్యత్తులో జర్నలిస్టుల బీమా పథకానికి ఇదేవిధంగా అయ్యే ఖర్చును తమ సంస్థే భరిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎపియుడబ్ల్యుజె రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎ.జయప్రకాష్‌, జిల్లా నాయకులు వెంకటసుబ్బయ్య, వెంకటేశ్వర్లు, బాబు, జర్నలిస్టులు పాల్గొన్నారు.

మాదాసుకు కలువాయిలో ఓ బలమైన వర్గం నాయకులు దగ్గరయ్యారు

కలువాయి: పీసీసీ ఉపాధ్యక్షుడు మాదాసు గంగాధరం ప్రజల్లో పట్టు సాధించేందుకు ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నారు.  గతంలో ఒక్క పంచాయతీపైనే దృష్టిసారించిన మాదాసు ఇటీవలకాలంలో మండలంలో పట్టుకోసం ప్రయత్నిస్తున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధి పనులకు సహకారం అందిస్తూండటంతో ప్రజలనుంచి ఆయనకు ఆదరణ పెరుగుతోంది. మాజీమంత్రి నేదురుమల్లి రాజ్యలక్ష్మి అభివృద్ధి విషయంలో నిర్లిప్తంగా వ్యవహరిస్తూండటంతో దానిని తనకు అనుకూలంగా మలుచుకుంటున్న గంగాధరం ముందడుగు వేస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా ఆయన ఫ్లెక్సీలను పలుచోట్ల ఏర్పాటు చేసి ప్రజలు అభిమానం చాటుకున్నారని ఆయన అనుయాయులు చెబుతున్నారు. మండలంలో అభివృద్ధి పనులకోసం కోట్లాది రూపాయల నిధులను రాబట్టడంలో ఆయన విజయం సాధించారు.

గత సంవత్సరం డిసెంబరు నెలలో రచ్చబండ కార్యక్రమంలో సాక్షాత్తు రాష్ట్ర ఆర్థికశాఖామాత్యులను కలువాయి మండలానికి తీసుకొచ్చి పనులు మంజూరుకు కృషి చేశారు. తోపుగుంట అగ్రహారంలోని దేవాలయానికి రూ. 25 లక్షలు, రామన్నగారిపల్లెలోని అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తికి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి నిధులు విడుదల చేయించి పేరుతెచ్చుకున్నారు. ఫలితంగా మాదాసుకు కలువాయిలో ఓ బలమైన వర్గం నాయకులు దగ్గరయ్యారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో ఆయన అనుచరవర్గానికి విజయావకాశాలు. అనుకూలంగా ఉన్నాయనే చెప్పాలి.

District Congress Committee president’s post in the wake of PCC plans to fill this shortly

Nellore : Congress groups in the district have been vying with each other for the District Congress Committee president’s post in the wake of PCC plans to fill this shortly. The post is lying vacant after former DCC chief Yellasiri Gopal Reddy migrated to the YSR Congress nearly one and half years ago. Former corporator and follower of the Anam brothers, Mr Chatla Narasimha Rao, who is chief of the city Congress, holds additional responsibility after Mr Gopal Reddy left the party.

According to information, Union minister of state for textiles Panabaka Lakshmi has also proposed the name of her close follower Haribabu Yadav for the post and their recommendation had led him to become secretary of the PCC and director of housing in the past. In the wake of the PCC decision to allot the post to a BC leader, Anam group has recommended the name of Mr R. Ravikumar Yadav, a close follower of finance minister Anam Ramanarayana Reddy, with the NJR group coming out with the name of Mr Udatha Venkata Rao Yadav.

A senior Congress leader said that PCC chief Botsa Satyanarayana is in a dilemma over choosing the candidate since all three groups have close rapport with him. He said that there was a proposal some time ago to give the post to MLC Vakati Nara-yana Reddy since he was maintaining a close relationship with all groups.

However the idea was dropped after Anam group expressed reservations over his candidature allegedly because of his identity as an NJR man, a senior leader said. He said that Anam group has also suggested the name of former DCC vice-president and former whip in the Nellore civic body Sannapareddy Penchal Reddy, if the PCC wants to give the post to anybody other than BCs.

The Congress leader said that very few leaders are interested in the post since they have to spend from their pockets for party programmes.



source : DC

Monday, February 6, 2012

స్కీముల పేరిట మహిళలను ఆశచూపి సుమారు రూ. 6 లక్షలకు పైగానే టోకరా

కలువాయి : స్కీముల పేరిట మహిళలను ఆశచూపి సుమారు రూ. 6 లక్షలకు పైగానే టోకరాపెట్టి ఉడాయించి ఉదంతం మండల కేంద్రమైన కలువాయిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే స్కీముల పేరుట మొదట ఐదుగురు మహిళలచే కలువాయిలోని ప్రతి వీధిలో ఓ 20 మంది సభ్యులను చేర్చుకొని ప్రతిరోజు లాటరీ పేరిట మహిళలపై ఆసచూపి మొదటిగా లాటరీలో వచ్చిన బహుమతులను ఆ సభ్యులకు నిర్వహకుడు ఇవ్వడం జరిగింది. మొదటి సారిగా ఇవ్వడంతో మహిళలు ఈ స్కీము బాగుందన్న ఉద్దేశ్యంతో ఒక్కొ బజారులో 20 మంది సభ్యులతో ఏర్పాటు చేసిన ఆ స్కీమును, మళ్లీ కొత్తస్కీము అంటూ 100 సభ్యులతో ఏర్పాటు చేసి అలా సుమారు కలువాయిలో 20 గ్రూపులను ఏర్పాటు చేశాడు. రోజుమార్చిరోజు ఈ లాటరీని 15 రోజులపాటు లాటరీ డ్రాలను తీస్తుండేవాడు.

ఈ డ్రాలో గెలుపొందిన విజేతలకు స్టీలు వస్తువులను ఇస్తుండేవాడు. ఈ లాటరీ నెలరోజులపాటు జరగాల్సివుంది. 30 సభ్యులు ఉన్న డ్రాలో గెలుపొందిన ఇస్తామని, మిగిలిన 70 మంది సభ్యులకు ఏదొకవస్తువు ఇస్తామని ఆశచూపాడని స్కీము కట్టిన మహిళలు తెలిపారు. బాధితులు ఇచ్చిన వివరాల మేరకు ఒక్కో గ్రూపులో 15 మందికి మాత్రమే వస్తువులను ఇచ్చినవీరు మేము ఇప్పటి వరకు ఒక్కోక్కరం రూ.400ల వంతున వారికి చెల్లించామని వారు తెలిపారు. ఈ లాటరీలో సుమారు 2వేల మంది సభ్యులుగా చేరడం వారిలో 300 మందికే లాటరీద్వారా వచ్చిన వస్తువులను ఇవ్వడం జరిగింది. దీన్నిబట్టి చూస్తే సుమారు ఆరు లక్షల రూపాయలు నగదును తీసుకొని ఉడాయించడం జరిగిందని తెలుస్తోంది. ఈ నిర్వాహకులు ఇలా మరో మండలానికి వెళ్లి ఇలానే చేస్తున్నట్లు సమాచారం. కనుక ఇప్పటికైనా లాటరీలు నిర్వహించే నిర్వాహకులను అదుపులోకి తీసుకొని మహిళలు మోసపోకుండా చూడాల్సిన అవసరం ఎంతైనావుంది. ఈ విషయంపై పోలీసులకు ఎటువంటి సమాచారంలేదు.

రైతు శ్రేయస్సుకోసం నా చివరి రక్తపు బొట్టు వరకు పోరాడుతానని హామీ - చంద్రబాబు

 అసమర్ధత కాంగ్రెస్‌ పాలనలో ప్రజలు, రైతులు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. సోమవారం రైతు పోరుబాటలో భాగంగా మండల పరిధిలోని 14వ మైలు దగ్గర నుంచి రైతు పోరుబాట యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా 74 ఎడ్లబండ్లతో రైతులు ఘన స్వాగతం పలికారు. మహిళలు హారతులిచ్చి ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం అయ్యప్పరెడ్డి గ్రామానికి చెందిన శ్రీనివాసులు అనే రైతుకు చెందిన మినుము పంటను పరిశీలించారు. అనంతరం రైతులకు జరిగిన నష్టాల గురించి అడిగి తెలుసుకున్నారు.

గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం దారుణంగా పంటలు నష్టపోవాల్సి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అయ్యప్పరెడ్డిపాళెంలో మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ యానాదులను కలిసి తాము 5 సంవత్సరాలకు పైగా కాలనీ నిర్మించుకున్నామని, కానీ ఇంతవరకు కరెంటుగాని, రోడ్లు గానీ, ఎలాంటి మౌలిక వసతులకు నోచుకోలేదని వారు విజ్ఞప్తి చేశారు. అనంతరం రైతులతో కలిసి పాదయాత్ర చేస్తూ పెదకొండూరు గ్రామంలో మహిళలను వారి సమస్యల గురించి ఆరా తీశారు. ఓ మహిళ తాము 20 ఎకరాల మినుము పంటను వే శామని, అది చేతికి వచ్చేసరికి 60 వేలు పైగా నష్టపోయామని బాధితురాలు చంద్రబాబు ఎదుట ఆవేదన వ్యక్తం చేసింది.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఈ ప్రాంతం నుంచి ఎమ్మెల్యే మేకపాటి గెలిచి ప్రజలకు ఏమి ఒరగబెట్టారని ఆయన ఘాటుగా విమర్శించారు. రాబోయే 2014 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం కాయమని, రైతుల కన్నీల్లు తుడుస్తామని వారికి హామీ ఇచ్చారు. అనంతరం పెదకొండూరు నుంచి పాద యాత్ర కొనసాగుతూ పెదపాడు గ్రామంలో ఉదయగిరి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ బొల్లినేని వెం టరామారావు నిర్మించిన మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ
ఎన్టీఆర్‌ విగ్రహాన్ని చంద్రబాబు చేతుల మీదుగా ఆవిష్కించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ విగ్రహం గ్రామంలో పెట్టడం సంతోషదాయకమని అన్నారు.

ఆ మహా నాయకుడు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు గుర్తు చేసుకోవాలని, జాతీయ స్థాయిలో తెలుగుదేశం పార్టీకి ఒక గుర్తింపు తెచ్చిన మహా నాయకుడు ఎన్టీఆర్‌ అని అన్నారు. తదుపరి పోలంపాడు గ్రామంలో కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించి కలిగిరి వరకు పాదయాత్ర కొనసాగింది. ఉదయగిరి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ బొల్లినేని వెంకటరామారావు, మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ తాను అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీని దేశ విదేశాలలో కూడా చెప్పుకునే విధంగా పార్టీని అభివృద్ధి చేశానన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్‌పార్టీ కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోకుండా ప్రభుత్వాన్ని గాలికి వదిలేశారని ఆయన ఘాటుగా విమర్శించారు.

గత సంవత్సరంలో డి.ఎ.పి ఎరువులు రూ.500 ధర పలికితే ప్రస్తుతం అది రూ. 1000 పెరగడంతో అటు ఎరువులు,ఇటు పురుగు మందులు కొనలేని పరిస్థితిలో నేడు రైతులు అధ్వానంగా మారారని ఆయన ప్రభుత్వాన్ని విమర్శించారు. రైతు ఆత్మహత్యలు చేసుకోవద్దని, మీ కోసం 9 రోజులు హైదరాబాద్‌లో నిరాహార దీక్షలు చేశానన్నారు. ఈ అసమర్ధత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి దద్ధమ్మల చేతగాని ప్రభుత్వాన్ని నడుపుతున్నారని ఆయన ఘాటుగా విమర్శించారు. రాష్ట్రంలో 35 మంది ఎంపీలు ఉండి కూడా ఏమీ చేతగాని దద్ధమ్మల్లా వారు ఉన్నారని రైతు కోసం, రైతు శ్రేయస్సుకోసం నా చివరి రక్తపు బొట్టు వరకు పోరాడుతానని హామీ ఇచ్చానన్నారు.

ఉదయగిరి నియోజకవర్గంలో ఒకే కుటుంబంలో ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను భయపెడుతున్నారని, అలాగే అక్రమ కేసులు కూడా పెడుతున్నారని వారి ఆటలు ఇక సాగవని బొల్లినేని, వంటేరు నాయకత్వాన కార్యకర్తలను కాపాడుకుంటామన్నారు. ధైర్యం ఉంటే ప్రజలకు సేవ చేయాలేగాని చేతగాని దద్ధమ్మల్లా వ్యవహరించడంపట్ల ఆయన దుయ్యబట్టారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఐ.ఏ.ఎస్‌ అధికారులను, రిజర్వుబ్యాంకు గవర్నర్లుగా ఒక ఉన్నతస్థాయిలో సర్వీసులకు పంపామని, కానీ నేడు రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వంలో ఐఏఎస్‌ అధికారులను నేడు చెర్లపల్లి జైలుకు పంపి అవినీతి ముద్రవేస్తున్నారని ఆయన విమర్శించారు.

కోట్లు కోట్లు అక్రమ సంపాదన సంపాదించిన గాలి జనార్ధన్‌రెడ్డి అక్రమ సంపాదనకు కారణమైన దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఆయన కుమారుడు జగన్‌మోహన్‌రెడ్డేనని అన్నారు. వేల కోట్ల రూపాయల ధనాన్ని దోచుకున్న ఘనత ఆయనదేనన్నారు. మహిళలకు పావలా రుణాలు ఇప్పించి ఆదుకుంటామని చెప్పిన ప్రభుత్వం మాటలకే పరిమితం అయిందన్నారు. 25 సార్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోలు, డీజిల్‌ ధరలు పెంచి సామాన్య మానవులకు అందుబాటులో లేకుండా చేశారన్నారు. వై.ఎస్‌ హయాంలో జలయజ్ఞం ధనయజ్ఞంగా మారిందని విమర్శించారు. యువత ఉత్సాహం చూస్తుంటే 2014 లో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తెస్తామని మహిళలు కోరారు. బీ.ఇడి సమస్యలపై ప్రభుత్వంతో పోరాడుతామని విద్యార్ధులకు హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్షులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, మాజీ మంత్రులు కోడెల శివప్రసాద్‌, కర్ణం బలరామక్రిష్ణమూర్తి, లాల్‌జాన్‌బాషా, టీడీపీ ఎమ్మెల్యేలు బీదా మస్తాన్‌రావు, బల్లిదుర్గా ప్రసాద్‌, పరసారత్నం, రామక్రిష్ణ, నూనె మల్లిఖార్జున యాదవ్‌, మండల టీడీపీ నాయకులు బిజ్జం వెంకటక్రిష్ణారెడ్డి, బిజ్జం బలరామిరెడ్డి, మంగళగిరి వేణు, కొండపల్లి వెంకట్రావు, తదితరులు పాల్గొన్నారు.

చంద్రబాబు ఎన్ని జన్మలెత్తినా ముఖ్యమంత్రి కాలేడని మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి

తెలుగుదేశం అధ్యక్షులు చంద్రబాబు ఎన్ని జన్మలెత్తినా ముఖ్యమంత్రి కాలేడని మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి తెలిపారు. మండలంలోని ముదివర్తిపాళెం ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు వైఖరిని నిశితంగా విమర్శించారు. కోవూరు నియోజకవర్గంలోప్రజలు చంద్రబాబుకు ధీటుగా జవాబు చెప్పగలరని ఆయన పేర్కొన్నారు. నందమూరి వారసులను తెరపైకి తెచ్చివుంటే పార్టీ మనుగడ నిలిచేదన్నారు. కాంగ్రెస్‌ పార్టీ గతంలో నియోజకవర్గ అభివృద్ధిని గాలికొదిలేసి ఇప్పుడు నిధులు కుమ్మరిస్తే ప్రజలు విశ్వసించరన్నారు. రైతాంగంలో సామాన్య జనంతో వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డిని దైవంగా ఆరాధించే పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు.

fight for the rights of Backward Class

The Telugu Desam supre-me, Mr N. Chandrababu Naidu, vowed to fight for the rights of Backward Class communities and demanded 33 per cent reservation in employment, greater allocation of funds and formation of a special ministry for them.


The Telugu Desam supre-me, Mr N. Chandrababu Naidu, vowed to fight for the rights of Backward Class communities and demanded 33 per cent reservation in employment, greater allocation of funds and formation of a special ministry for them.

The TD chief, addressing delegates at the Devanga national-level meet here on Saturday, expressed concern over the plight of weavers and demanded several sops including 25 per cent subsidy on yarn, pension of Rs.1,000 to those aged 50 years, interest-free loan up to Rs.1 lakh and financial assistance worth Rs.1 lakh to help them construct a house.

Referring to the 2001 census, he said that only 45per cent of them were literate, and called upon the elders to educate their children.

He asked the members to make efforts to develop themselves in the socio-political and economic spheres.

He claimed credit for having two MPs and three MLAs in the party belonging to the Devanga community and said that the Telugu Desam was committed to the welfare of these communities.

Referring to budgetary allocation to weavers, the TD chief said that the Centre had allocated Rs.350 for the welfare of weavers in its budget of about Rs.12 lakh crores while state government had allotted only Rs.50 crores in its budget of Rs.1.13 lakh crores.

He said that though the Congress government had announced allocation of Rs.336 crores for the welfare of weavers in 2007 itself, so far, nearly Rs.135 crores were released and of this, Rs.27 crores was released soon after the Devanga meet started in Rajahmundry on Friday, fearing criticism.

He demanded that state government allow weavers to take up work similar to the facility being provided to farm workers under the Mahatma Gandhi National Rural Employment Gua-rantee Scheme.

He said that they were going to take up the cause of weavers in the ensuing budget session in the state legislative Assembly.

The TD supremo said, “Our party will support your cause and will fight until you get socio-political and economic justice.”


source : DC

‘I refused PM post twice’

Telugu Desam president and former chief minister N. Chandrababu Naidu said that he had never aspired for the prime minister’s post and had declined the top slot twice when it was offered to him by the United Front, National Front and UNPA leaders in the past.

Telugu Desam president and former chief minister N. Chandrababu Naidu said that he had never aspired for the prime minister’s post and had declined the top slot twice when it was offered to him by the United Front, National Front and UNPA leaders in the past.

He was interacting with media persons at Kavali before proceeding to Uday-agiri as part of his Rythu Porubata programme on Monday. He maintained that he was not after power and his intention was to safeguard the interests of people. He said that no chief minister had continued as opposition leader like him for two terms after losing power.

“I will strive to develop the state as a peoples’ representative without any room for corruption with the slogans of self-respect and self-confidence. We are ready to join with like-minded parties to achieve this objective,” Mr Naidu said, inviting all parties to join hands to make the state corruption free.

Lauding the Supreme Court verdict related to cancelling 2G licenses pertaining to 122 companies, he questioned the rationale behind Dr Manmohan Singh continuing as Prime Minister. He said that Dr Singh should have invited and discussed with Anna Hazare on steps to eradicate corruption, soon after his agitation against corruption.

Stressing the need to make youth play an active role in society, he said that his party planned four conventions to spell out the role of youth in the party.

He demanded a comprehensive probe into corruption charges to identify the role of all those involved and take action against them.

To a question on IAS officers’ protest against the CBI for targeting them, he said that the officers had been paying the penalty for succumbing to pressu-re and committing mistak-es during the YSR regime. Taking strong objection to statements of a leader over a TD understanding with the Congress, he condemned this and added that they had no need to sail with a spoilt party.

Mr Naidu interacted with farmers who were hit by unseasonal rains during his padayatra from Siddanakonduru crossroad to Kaligiri in Udayagiri constituency.

He unveiled a statue of NTR at Peddipadu in Kaligiri mandal. He addressed a public meeting at Kaligiri before closing his tour.


source:dc

Panther body found in Shar forest SPSR Nellore

Body of a panther was found hanging from a tree in the forest area abutting Satish Dhawan Space Centre, Shar, Sriharikota, in SPSR Nellore district on Monday.

Body of a panther was found hanging from a tree in the forest area abutting Satish Dhawan Space Centre, Shar, Sriharikota, in SPSR Nellore district on Monday.

According to wildlife divisional forest officer C. Pardhananda Prasad, the animal was caught in a trap set for wild boars by Girijans in the forest. The leopard climbed a tree with the trap around its waist and it was killed after the strings of the trap were tightened when they got struck in the branches of the tree.

A mechanic working in sewerage plant alerted the Shar officials when he noticed the panther hanging from the tree branches on Monday morning. They, in turn, informed the matter to forest officials.

Mr Prasad said that the panther would have panicked after it was caught in the trap and its bid to free from the trap led to its death. He informed that the animal is aged about seven years and measuring 75 cm height and 60 kg weight.

He struck down the role of poachers while indicating to the body parts of the animal such as nails and teeth which are intact.

He said that it is a practice for the Girijans to set trap for wild boars on Saturdays to eat their meat on Sundays and they might not have expected this.

The body of leopard was cremated after performing post-mortem on Monday evening. It had died about 24 hours ago, as per the report, he added.



source :DC

Sunday, February 5, 2012

నెల్లూరు మాజీ ఎమ్మెల్యే జేకే రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో

ఇందుకూరుపేట : కాంగ్రెస్ సీనియర్ నా యకుడు, నెల్లూరు మాజీ ఎమ్మెల్యే జేకే రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆదివారం నగరంలోని శాంతి అపార్టుమెంట్స్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పార్టీ జిల్లా కన్వీనర్ కాకాణి గోవర్ధన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్‌రెడ్డి సమక్షంలో ఆయన ఆ పార్టీలో చేరారు. జేకే అనుచరులు కూడా పార్టీలో చేరారు.

2014లో వైఎస్సార్సీకే పట్టం ఈ సందర్భంగా జేకే రెడ్డి మా ట్లాడుతూ 2014లో వైఎస్సార్సీ విజ యం ఖాయమన్నారు. వైఎస్ ఇప్పటికి, ఎప్పటికి ప్రజల గుండెల్లో స్థిరనివాసం ఏర్ప రుచు కున్నారన్నా రు. కోవూరులో ఎప్పుడు ఎన్నికలు ప్రకటించినా ప్రసన్న విజయం త«థ్య మన్నారు.

పులివెందులకు ధీటుగా.. పులివెందులకు ధీటుగా కోవూరు లో విజయం సాధించాలని జిల్లా కన్వీనర్ కాకాణి గోవర్ధన్‌రెడ్డి పిలుపు నిచ్చారు. రాష్ట్ర అసెంబ్లీకి విజయమ్మ మొదటి వైఎస్సార్సీ అభ్యర్థిగా అడుగుపెడితే రెండో అభ్యర్థి ప్రసన్నకుమార్‌రెడ్డి కాబోతున్నారన్నా రు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాశం సునీల్‌కుమార్, గొల్లపల్లి విజయకుమార్, మావులూరి శ్రీనివాసులురెడ్డి, బట్టేపాటి నరేం ద్రరెడ్డి, దేవిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, గునపాటి సురేష్‌రెడ్డి తదితరులు ఉపన్యసించారు. మండలంలోని 20 పంచాయతీలకు చెందిన దాదాపు ఆరు వందల మంది కాంగ్రెస్ నాయకులు వైఎస్సార్సీలో చేరారు.

6కిలోమీటర్ల దూరానికే సుమారు 30కి పైగా మలుపులున్నాయి.

రాపూరు  : రాపూరు నుంచి పెంచలకోనకు వెళ్లే మార్గ ప్రమాదాలకు నిలయంగా మారింది. దీంతో వాహన చోదకులు, ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నిసార్లు ప్రమాదాలు జరిగినా లెక్కలేనంత మంది గాయాలపాలైనా పట్టించుకునే నాధుడే కరువయ్యాడు.

ప్రమాదం జరిగినపుడు అధికారులు, నేతలు హామీలు ఇస్తున్నారే తప్ప సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవడంలేదు. రాపూరు నుంచి కోనకు వెళ్లే మార్గం సుమారు 30కిలోమీటర్లు ఉంటుంది. గోనుపల్లి నుంచి కోన 6 కిలోమీటర్ల దూరం వుంటుంది. రాపూరు నుంచి గోనుపల్లి వరకు పలుచోట్ల ప్రమాదకరమైన మలుపులున్నాయి. గోనుపల్లి నుంచి కోన వరకు కేవలం 6కిలోమీటర్ల దూరానికే సుమారు 30కి పైగా మలుపులున్నాయి.

అటవీ ప్రాంతం కావడం, సింగిల్‌రోడ్డు ఉండడంతో పలుచోట్ల చెట్ల కొమ్మలు మార్గాన్ని కమ్మేస్తున్నాయి. ఇన్ని మలుపులు వున్నా ఒక్కచోట కూడా ప్రమాదసూచిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంపై ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్డులో కల్వర్టులు కూడా ప్రమాదకరంగా వున్నాయి. కొన్నిచోట్ల రోడ్డుకు సమాంతరంగా కల్వర్టులు వుండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి మ లుపుల వద్ద ఇరువైపులా సూచిక బో ర్డులు ఏర్పాటు చేయాలని వాహనదారులు, ప్రయాణికులు కోరుతున్నారు.

నేటి నుంచి పోలేరమ్మ జాతర

దగదర్తి,  : దగదర్తి పోలేరమ్మ జాతర నేటి నుంచి రెండురోజుల పాటు నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రతిఏటా ఫిబ్రవరి మొదటి మంగళవారంలో అమ్మవారికి జాతర నిర్వహించడం ఆనవాయితీ. పాడి పంటలను, ప్రజలను చల్లగా చూసే తల్లి పోలేరమ్మ అన్నది భక్తుల విశ్వాసం.

ఈ జాతరకు చుట్టు పక్కల మండలాలు, జిల్లాలనుంచి కూడా భక్తులు తండోపతండాలుగా తరలి వస్తారు. మొక్కులు చెల్లిస్తారు. సోమవారం తెల్లవారుజామున డప్పు వాయిద్యాలు, శంఖు మోతలు, సన్నాయి రాగాలతో అమ్మవారిని మేల్కొలుపులతో ప్రారంభమయ్యే జాతరలో అభిషేకం, కుంకుమార్చన, మహానివేదన, సాయంత్రం కలశస్థాపన, సామూహిక సహస్రనామావళి, కుంకుమపూజ, పల్లకీ సేవలు నిర్వహిస్తారు. మంగళవారం ఉదయం అ భిషేకం, చల్ది, పొంగళ్లు, మధ్యా హ్నం అన్నదానం, సాయంత్రం పూలంగిసేవ అనంతరం రాత్రికి గ్రామోత్సవంతో జాతర ముగుస్తుంది. జాతరలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వాహకులు ఏర్పాటు చేశారు.

పోలీసు బందోబస్తు జాతర సందర్బంగా ఎలాంటి గోడవలు జరుగకుండా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని దగదర్తి ఎస్ఐ సుబ్బయ్య తెలిపారు. ఈవ్‌టీజింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టామని, సిబ్బంది మఫ్టీలో సైతం విధులు నిర్వహిస్తుంటారని తెలిపారు

ఈ నెల 8 నుండి 11వ తేదీ వరకు జిల్లాలో రాష్ట్ర మంత్రులు

ఈ నెల 8 నుండి 11వ తేదీ వరకు జిల్లాలో రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, పితాని సత్యనారాయణ, రఘువీరారెడ్డిలు వివిధ అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొంటారని డిపిఆర్‌ఒ ఎం.కమలాకర్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 8వ తేదీ ఉదయం 9 గంటలకు నగరంలోని శెట్టిగుంట రోడ్డు ప్రాంతంలో రోడ్డు, స్కూల్‌ భవ నానికి ఆర్థిక శాఖమంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఇన్‌చార్జ్‌ మంత్రి పితాని సత్యనారాయణలు శంకుస్థాపన చేస్తారన్నారు. అలాగే ఉదయం 10 గంటలకు సాంఘీక సంక్షేమ శాఖాధికారులతో సమీక్షిస్తారన్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు వెంకటేశ్వరపురంలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్‌ హాస్టల్‌ భవనానికి శంకుస్థాపన చేస్తారన్నారు. 

అక్కడ నుంచి మధ్యాహ్నం 3.30 గంటలకు కోవూరులో డిఆర్‌డిఎ ఆధ్వర్యంలో పొదుపు సంఘాలకు బ్యాంకు లింకేజ్‌ యాక్షన్‌ ప్లాన్‌ యూనిట్స్‌ పంపిణీ కార్యక్రమం జరుగుతుందన్నారు. 9వ తేదీ ఉదయం 10 గంటలకు వెంకటగిరిలో ఎకై్సజ్‌ సిఐ భవన ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుందని, 10.30 గంటలకు డిఆర్‌డిఎ ఆధ్వర్యంలో పొదుపు సంఘాలకు బ్యాంకు లింకేజి యాక్షన్‌ప్లాను యూనిట్స్‌ పంపిణీ కార్యక్రమం జరుగుతుందన్నారు. అదేవిధంగా మధ్యాహ్నం 3 గంటలకు సూళ్లూరుపేటలో పొదుపు సంఘాలకు బ్యాంకు లింకేజి యాక్షన్‌ ప్లాన్‌ యూనిట్స్‌ పంపిణీ కార్యక్రమం జరుగుతుందన్నారు. అలాగే 10వ తేదీ ఉదయం 10 గంటలకు రెవెన్యూ శాఖ మంత్రి ఎన్‌.రఘువీరారెడ్డితో కలసి నెల్లూరు ఆర్‌డిఒ కార్యాలయం ఆవరణంలో నిర్మించిన జిల్లా ల్యాండ్‌ అండ్‌ సర్వే కార్యాలయం ప్రారంభోత్సవంలో మంత్రులు పాల్గొంటారన్నారు. 

అలాగే ఎసి స్టేడియంలో జరుగుతున్న జిల్లా రెవెన్యూ శాఖ క్రీడలను ప్రారంభిస్తారని, జిల్లా ప్రభుత్వాసుపత్రులలో డయాలసిస్‌ యూనిట్‌ను ప్రారంభిస్తారన్నారు. అనంతరం మధ్యాహ్నం 3.30 గంటలకు ఆత్మకూరులో పొదుపు సంఘాలకు బ్యాంకు లింకేజి యాక్షన్‌ప్లాన్‌ యూనిట్స్‌ను మంత్రి ఆనం పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. ఈ నెల 11వ తేదీ నెల్లూరు ఎంపిడిఒ కార్యాలయ ప్రాంగణంలో స్ర్తీశక్తి భవనానికి, భూగర్భజల శాఖ భవనానికి రూ.20 కోట్లతో సిసి రోడ్డుకు మంత్రి ఆనం శంకుస్థాపన చేస్తారన్నారు. అలాగే నెల్లూరు ఎంపిడిఒ కార్యాలయ ప్రాంగణంలో పొదుపు సంఘాలకు బ్యాంకు లింకేజ్‌ యాక్షన్‌ప్లాన్‌ యూనిట్స్‌ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పంపిణీ చేస్తారన్నారు.

కాంగ్రెస్‌ పార్టీకి అంతిమ ఘడియలు దగ్గర పడ్డాయి

నెల్లూరు : రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి అంతిమ ఘడియలు దగ్గర పడ్డాయని, కాంగ్రెస్‌ పార్టీకి రాజకీయ సమాధి కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వైఎస్‌ఆర్‌సి పార్టీ నేత కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గడప గడపకు వైఎస్‌ఆర్‌సి పార్టీని తీసుకెళ్లేందులో భాగంగా ఆయన చేపట్టిన 141 రోజుల పాదయాత్ర 82వ రోజుకు చేరుకుని అల్లీపురం గ్రామంలో కార్యకర్తల కోలాహలం మధ్య అపూర్వ స్వాగతం లభించింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌ కష్టంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఆయన మరణానంతరం పేద ప్రజల కోసం ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు తూట్లు పొడుస్తూ ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో కాంగ్రెస్‌ పార్టీ భ్రష్టు పట్టిపోయిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీ వుందా..లేదా అని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఆ పార్టీ నేతలు దోచుకొని దాచుకోవడం తప్ప వేరే ధ్యాస లేదన్నారు. జగన్‌మోహన్‌రెడ్డిని అక్రమ కేసులో ఇరికించే పనిలో ముఖ్యమంత్రి సోనియా గాంధీ వద్ద నిమగ్నమైవున్నారన్నారు. వీళ్ల తంతును చూచి ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని అసహ్యించుకుంటున్నారని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్‌ పార్టీని శాశ్వతంగా రాజకీయ సమాధి కట్టేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.

నెల్లూరులో చంద్రబాబు రైతు పోరుబాట యాత్ర

నెల్లూరు : రైతు సమస్యలపై టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నెల్లూరులో రైతుపోరుబాట యాత్ర చేపట్టనున్నారు. జిల్లాలోని సిద్దనకొండూరు నుంచి బాబు యాత్ర ప్రారంభం కానుంది. సాయంత్రం కలిగిరిలో టీడీపీ బహిరంగసభలో ప్రసంగించనున్నారు.
sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh