online marketing

Thursday, May 3, 2012

గ్రామం నుంచి బయటకు రావడంలేదు.. ఆరుగంటలైతే తలుపుల మూత..


గ్రామం నుంచి బయటకు రావడంలేదు
ఆరుగంటలైతే తలుపుల మూత
అవి అపోహలు: డాక్టర్‌ దత్తాత్రేయులు
మనుబోలు: హైటెక్‌ యుగంలోనూ దెయ్యం భయం జనాన్ని వీడడంలేదు. పుకార్లతో ప్రజలు భయపడుతున్నారు. మండలంలోని బండేపల్లి గ్రామస్తులను దెయ్యం భయం వెంటాడుతోంది. గ్రామంలో 180 కుటుంబాలున్నాయి. 700 జనాభా ఉంది. మార్చి నుంచి ఇప్పటి వరకూ గ్రామంలో వివిధ కారణాలతో ఆరుగురు హఠాత్తుగా మృతిచెందారు. వారిని ఓ శక్తి మింగేసిందనే పుకార్లు వచ్చాయి. కొందరు తమకు దెయ్యం కనిపించిందని ప్రచారం కూడా చేశారు. దీంతో ప్రజలు గ్రామం నుండి బయటకు రావడం మానుకున్నారు. సాయంత్రం ఆరుగంటలైతే అన్ని పనులు చేసుకొని తలుపులు మూసుకొని ఇళ్లలోనే బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న ఆ గ్రామాన్ని సందర్శించింది. ఆరుగురు ఏ కారణాలతో చనిపోయారనే వివరాలను సేకరించింది. మార్చిలో శివనాయుడు అనారోగ్యంతోనూ, పద్మమ్మ గుండెపోటుతోనూ, మరో వృద్ధురాలు వయోభారంతోనూ మృతిచెందారు. ఏప్రిల్లో నాగమణి, రాజగోపాల్‌, ప్రతాప్‌ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు విడిచారు. అయితే వారిని దెయ్యం మింగేసిందని ప్రచారం జరగడంతో గ్రామం నుండి ఎవరూ బయటకు రావడంలేదు. తెల్లచీర కట్టుకున్న ఓ యువతి రక్తం తాగుతానని అంటోందని పుకార్లు షికార్లు చేస్తున్నారు. ఇకనైనా జెవివి వంటి సంస్థలు ప్రజల్లో చైతన్యం కలిగించి వారిలో నెలకొన్న భయాందోళనలు తొలిగించాల్సి ఉంది.
అవి అపోహలు: జెవివి
గ్రామంలో దెయ్యం తిరగడం, శక్తి ఉందని అనడం వట్టి మూఢ నమ్మాకాలనీ, అపోహలని జెవివి జిల్లా నాయకులు, డాక్టర్‌ రామచంద్రారెడ్డి ప్రజావైద్యశాల డాక్టర్‌ దత్తాత్రేయులు అన్నారు. బండేపల్లిలో గ్రామంలో దెయ్యం తిరుగుతుందనే విషయమై ప్రజాశక్తి ఆయన్ను ఫోన్లో వివరణ కోరగా పై విధంగా స్పందించారు. ఎవరో స్వార్థం కోసం ఇలాంటి పుకార్లు పుట్టిస్తున్నారన్నారు. దెయ్యాలు లేవని తాము శాస్త్రీయంగా నిరూపిస్తామని తెలిపారు. తాము నేరుగా ఆ గ్రామానికెళ్లి ప్రజలకు వాస్తవాలు వివరిస్తామని చెప్పారు.

మహిళలైతే పైట కొంగులను నెత్తిపై వేసుకుని కాస్తై..

నెల్లూరుభానుడు విశ్వరూపం చూపాడు.. ప్రజానీకం విలవిల లాడారు..ఈ వేసవి సీజన్‌లో అత్యధికంగా గురువారం 42.4 డిగ్రీల ఉష్ణోగత్ర నమోదయింది. ఉదయం 8 గంటల నుంచే వేసవి ప్రతాపం తీవ్రం కావడంతో ప్రజల పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైంది. వేసవి తాపానికి తట్టుకోలేక పలువురు ఇళ్లకే పరిమితమయ్యారు. 

ఎండలోనే పనులు చేయాల్సిన కార్మికుల పరిస్థితి అత్యంత భయానకంగా తయారైంది. ఎండ ప్రభావం నుంచి తప్పించుకునేందుకు ప్రజానీకం నానాతంటాలు పడ్డారు. మహిళలైతే పైట కొంగులను నెత్తిపై వేసుకుని కాస్తై వేసవి తాపాన్ని నివారించుకునే ప్రయత్నం చేశారు. నీడనిచ్చే వస్తువు ఏది చేతిలో ఉన్నా దానిని అడ్డంగా పెట్టుకుని ఎండ నుంచి సేద తీరారు. 

నెల్లూరు నగరంలో ఉదయం 12.30 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. కొబ్బరి బొండాంలు, మజ్జిగకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఎండవేడిమితో గ్రామాల్లో ఉపాధి పనులకు వెళ్లేందుకు కూలీలు భయపడుతున్నారు. ఉపాధి పనులు జరగడం కనాకష్టంగా మారింది. ఈ పరిస్థితి రెండు రోజులు ఉంటుందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

Wednesday, May 2, 2012

ఏంమాట్లాడుతున్నావ్‌నువ్వు... పెద్దమగాడిలా... అంటూ రెచ్చి..

జలదంకి : ఉదయగిరి నియోజకవర్గ పరిధిలోని జలదంకి మండలం జమ్మలపాలెం గ్రామానికి బుధవారం ఉదయం వైఎస్సార్సీపీ నాయకులు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి ఉప ఎన్నికల ప్రచారానికి వచ్చా రు. ఈ సందర్భంగా వారికి అడుగడుగునా అడ్డంకులు ఎదురయ్యాయి. జమ్మపాలెంలో జరిగిన ప్రచారంలో మహిళలు ఖాళీబిందెలతో వారికి నిరసన తెలిపారు. మీరు ఎంపీ, ఎమ్మెల్యేలు అయిన తరువాత మూడేళ్లకాలంలో ఒక్కసారికూడా తమ గ్రామానికి రాలేదని, గ్రామసమస్యలు పరిష్కరించలేదని అడ్డుకున్నారు. నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్నా ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. ఇంకా పలు గ్రామ సమస్యలపై ప్రశ్నలవర్షం కురిపించారు. ఓ దశలో మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి సమస్యలపై ప్రశ్నిస్తున్న ఓ యువకుడిపై ఆగ్రహించారు. ఏంమాట్లాడుతున్నావ్‌నువ్వు... పెద్దమగాడిలా... అంటూ రెచ్చిపోయారు. 

స్థానిక నేతలు కలుగచేసుకుని సముదాయించారు. అనంతరం రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ మీసమస్యలపై స్పందించని విషయం వాస్తవమేనని అంగీకరించారు. మీగ్రామంలో మంచినీటిసమస్య ఉందనే విషయమే తమకుతెలియదని, మేం ప్రజాప్రతినిధులులగా తిరిగి ఎన్నికైన తరువాత ఖచ్ఛితంగా మీసమస్యలు తప్పకతీరుస్తామని హామీఇచ్చారు. అనంతరం మండలంలోని లింగరాజుఅగ్రహారం, కేశవరం, చోడవరం, గట్టుపల్లి పంచాయతీలలో వారు ప్రచారం నిర్వహించారు. అక్కడ కూడా స్థానికులు పలు సమస్యలపై వీరిని ప్రశ్నించారు. జలదంకి మండలంలో నాలుగురోజులపాటు జరిగే ప్రచారంలో మొదటిరోజే మేకపాటి సోదరులకు చుక్కెదురైంది.

ఆనాడు తక్కువ ధరకే తమ భూములను అమ్మేసినవారు నేడు వాటి విలువ తెలుసుకుని పశ్చాత్తాపానికి

నెల్లూరు : పొలాలు, ఆహ్లాదకరమైన, రమణీయమైన ప్రకృతి కనువిందు చేసేది. కాని నేడు నగరం నుంచి 10-15 కిలోమీటర్ల వరకు ఏ వైపుకు వెళ్లినా ప్లాట్లు తప్ప పచ్చటి పొలాలు కనుమరుగైపోయాయి. రైతులకు డబ్బు ఆశ చూపించి వారి వద్ద వున్న పొలాలను ఎకరాలలో తక్కువ రేట్లకు కొనుగోలు చేసి వాటిని ప్లాట్లుగా వేసి భూబకాసురులు ఎక్కువ రేట్లకు అమ్ముకుని కోట్లకు పడగలెత్తుతున్నారు. ఒక వేళ వారి వ్యాపారానికి ఈ భూమి సరిపోకుంటే పంచాయతీల భూములను సైతం కబ్జాలు చేస్తున్నారు. ఈ విషయాలు బయటకు తెలియకుండా సంబంధిత అధికారులతో లాలూచిపడి తమ పనులు చేసుకుంటున్నారు. 

ప్రస్తుతం నగరంలో స్థలం రేట్లు, ఇళ్ల రేట్లు భారీగా పెరిగిపోవడానికి ప్రధాన కారణం ఈ భూబకాసురులే. గ్రామాల్లో కొన్ని చోట్ల పంచాయతీ స్థలాలను ఆక్రమించుకుని వాటిని కూడా ప్లాట్ల రూపంలో మళ్లించేస్తున్నారు. వీరికి ఎక్కడి భూమి కూడా సరిపోదన్నట్టు పేదల భూములను సైతం ఆక్రమించుకుంటున్నారు. గతంలో గ్రామం అంటే పచ్చటి పొలాలు, కోకిల గానాలు, రమణీయమైన ప్రకృతి దృశ్యాలతో నిండి ఆహ్లాదకరంగా ఉండేది. కాని నేడు ఎటు చూచినా రియల్‌ ఎస్టేట్‌...రియల్‌ ఎస్టేట్‌. దీంతో ఆనాడు తక్కువ ధరకే తమ భూములను అమ్మేసినవారు నేడు వాటి విలువ తెలుసుకుని పశ్చాత్తాపానికి గురవుతున్నారు. హరనాధపురం నుంచి ముత్తుకూరు వరకు వేస్తున్న 4 లైన్ల రహదారి వలన కూడా ఈ రియల్టర్లే ఎక్కువ ఆదాయాలు గడిస్తారని ఆ ప్రాంత ప్రజలు అంటున్నారు. 

నెల్లూరు రూరల్‌ మండలమైన ఇరగాళమ్మ దేవస్థానం నుంచి జొన్నవాడ, బుచ్చి మార్గంలో గతంలో ప్రయాణించాలంటే ఎంతో ఆనందంగా ఉండేది. ఆ మార్గం పొడవునా కాసేపు ఆగి విశ్రాంతి తీసుకుని పచ్చటి పొలాల రమణీయ, ప్రకృతి దృశ్యాలను ఆస్వాదించి వెళ్లేవారు. కాలానుగుణంగా ఆ ప్రాంతం మొత్తం ప్లాట్ల రూపంలో మారిపోవడం చాలా విడ్డూరంగా, బాధాకరంగా కనపడుతోంది. రైతులు తాము ఆరుగాలం చెమటోడ్చి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక, అప్పులపాలై, వాటిని తీర్చలేక ఆత్మహత్యే శరణ్యమని అనుకుంటున్న తరుణంలో... ఆ పొలాలను తాము కొంటామని ముందుకు వచ్చిన భూబకాసురుల మాటలకు లొంగిపోయి, తమ అప్పులు తీరుతాయని, తమ కష్టాలు గ ట్టెక్కుతాయని భావించి ఆ రైతులు తమ పొలాలను అమ్ముకుంటున్నారు. రైతులకు ఏర్పడిన ఇటువంటి దీనస్థితికి ప్రభుత్వాలే కారణమని ఘంటాపథంగా చెప్పవచ్చు. 

ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో సామాన్యులు ఎవ్వరూ ఇల్లు ట్టుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. గ్రామాల్లో ఎటుచూచినా హద్దురాళ్లే కనపడతాయి. రైతులు పంటలు పండించే భూములన్నీ రియల్‌ ఎస్టేట్‌ భూములుగా మారిపోతే ధాన్యం లేక ఆహార కొరత తీవ్రతరమవుతుంది. అందరి వద్ద డబ్బులున్నా కొనేందుకు ధాన్యం దొరకదు.... తినేందుకు తిండి దొరకదు. ధనదాహంతో భూబకాసురులు సృష్టించిన ఈ కరువులో సమాజంలో పరిస్థితులు ఏవిధంగా ఉంటాయో ఊహించేందుకే భయమేస్తోంది.

Tuesday, May 1, 2012

అనుష పై అత్యాచారం జరిపిన హంతకులను పట్టుకునేందుకు . డాగ్‌ స్వ్కాడ్‌ను పిలిపించి సంఘటనా..


చిల్లకూరు : మండలంలోని తమ్మిన పట్నం గ్రామంలో మీనాక్షి ఎనర్జి ప్రయివేట్‌ లిమిటెడ్‌లో పని చేస్తోన్న వి సన్యాసిరావు, మరియమ్మల కుమార్తె అనుష పై అత్యాచారం జరిపిన హంతకులను పట్టుకునేందుకు మంగళవారం అదనపు ఎస్‌పి చంద్రశేఖర్‌, గూడూరు డిఎస్‌పి సురేష్‌కుమార్‌ ఆధ్వర్యంలో డాగ్‌ స్వ్కాడ్‌ను పిలిపించి సంఘటనా స్థలానికి తీసుకువెళ్లి పరిశీలించారు. గ్రామస్తులను ఆయన విచారించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ కంపెనీలో స్థానికులకు ఉద్యోగవకాశాలు కల్పించకుండా స్థానికేతరులకు ఉద్యోగాలు కల్పించినందున వారు ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని గ్రామస్తులు తెలిపారు. రెండు మూడు రోజుల్లో హంతకుడిని పట్టుకుంటామని తెలిపారు. సంఘటనా స్థలం వద్ద కొన్ని ఆధారాలు లభించినట్లు గూడూరు డిఎస్‌పి తెలిపారు.

పల్లకిలో ఉత్సవమూర్తులను బోయలు మోస్తూ ఆరు కిలోమీటర్ల దూరంలోని పెంచలకోనకు కాలినడకన

రాపూరు : పెంచలకోన బ్రహ్మోత్సవాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ పాలకమండలి, దేవాదాయశాఖ ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. సాయంత్రం 6.30 గంటలకు విష్వక్సేనారాధనతో ఉత్సవాలకు ఆలయ అర్చకులు శ్రీకారం చుట్టారు. పూల తోటలోని ప్రత్యేక మండపంలో అలయ అర్చకులు పుట్టమట్టి తీసుకొచ్చి నవధాన్యాలతో కలశస్థాపనతో ఉత్సవాలకు అంకుర్పారణ చేశారు. యాగశాలలో విశేష హోమాలు జరిపించారు. అనంతరం ఆలయంలో సేనాధిపతి ఉత్సవాన్ని నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో ఉత్సవాల్లో పాల్గొన్నారు. 'కోన'కు చేరిన ఉత్సవ మూర్తులు గోనుపల్లి ఆలయం నుంచి శ్రీదేవీ భూదేవీ సమేత శ్రీవారి ఉత్సవ మూర్తులను ఆలయ అర్చకులు విశేషంగా అలంకరించి పల్లకిలో ఊరేగింపుగా మంగళవారం పెంచలకోనకు తీసుకొచ్చారు. తొలుత గోనుపల్లి ఆలయంలో ఉత్సవమూర్తులకు ప్రతే ్యక పూజలు చేశారు. పల్లకిలో ఉత్సవమూర్తులను బోయలు మోస్తూ ఆరు కిలోమీటర్ల దూరంలోని పెంచలకోనకు కాలినడకన తీసుకురావడం విశేషం. ఉత్సవమూర్తులకు గొల్లబోయి ఆలయం వద్ద విశేష పూజలు చేశారు. అనంతరం గోనుపల్లిలోని గిరిజన కాలనీకి తీసుకొచ్చారు. శ్రీవారిని తమ ఇంటి అల్లుడుగా భావించిన గిరిజనులు పుట్టతేనే, అటవీ దుంపలు నైవేద్యంగా సమర్పించారు. అనంతరం ఉత్సవ మూర్తులను కోనకు తీసుకొళ్లి అమ్మవారి ఆలయం వద్ద విశేష పూజలు జరిపించారు. ఉత్సవ మూర్తులు కోనకు చేరడంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయినట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. విద్యుద్దీపాలంకరణ శ్రీవారు, ఆదిలక్ష్మి, ఆంజనేయాస్వామి వారి ఆలయాలు, కొండాకోనలను విద్యుద్దీపాలతో అలంకరించారు. దేవుడు, దేవేరి ఆలయాల నడుమన ఉన్న పెద్ద కొండపై విద్యుద్దీపాలతో ఏర్పాటుచేసిన నామాలు, శంఖుచక్రాలు భక్తులను విశేషంగా ఆకర్షించాయి. పెంచలకోనలో నేడు బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం తెల్లవారుజామున శ్రీవారికి ఉభయకర్తలు పట్టువస్త్రాలు సమర్పిస్తారు. అనంతరం శ్రీవారు, ఆంజనేయస్వామికి పూలాంగిసేవ నిర్వహిస్తారు. 8 గంటలకు తిరుచ్చి ఉత్సవం, 11.20 గంటలకు ధ్వజారోహణం, మధ్యాహ్నం 12 గంటలకు స్నపన తి రుమంజనం, సాయంత్రం 5.30 గంటలకు సహస్రదీపాలంకరణ సేవ, రాత్రి 10 గంటలకు శేషవాహనంపై శ్రీవారి క్షేత్రోత్సవం కార్యక్రమాలు ఉంటాయి. రాత్రికి భక్తులకోసం సాంసృతిక కార్యక్రమాలు ఏర్పాటుచేశారు.
sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh