online marketing

Thursday, December 17, 2009

ఈనెల 25న జిల్లాకు చిరంజీవి

ఫత్తేఖాన్‌పేట: ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ఈనెల 25వ తేదీ జిల్లాకు రానున్నారు. సమైక్యాంధ్రకు మద్దతు పలికిన చిరంజీవి తదుపరి కార్యాచరణలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించేందుకు నిర్ణయించారు. తొలుత తిరుపతిలో తన పర్యటనను ప్రారంభించే ఆయన ఈనెల 25న నెల్లూరుజిల్లాలో పర్యటించనున్నట్లు పిఆర్‌పీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే జిల్లాలో సమైక్యవాదన ఉద్యమరూపంలో ఉధృతంగా జరుగుతున్న తరుణంలో ఆ వాదనకు మద్దతు తెలిపేందుకు వస్తున్న చిరంజీవికి భారీ స్థాయిలో స్వాగత ఏర్పాట్లు చేసేందుకు పిఆర్‌పీ వర్గాలతో పాటు సమైక్యవాదులు సిద్ధమవుతున్నారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh