online marketing

Tuesday, February 16, 2010

పొదుపు రుణాల్లో మాయాజాలం


ఉదయగిరి, మేజర్‌ న్యూస్‌: నియోజక వర్గంలోని పలు మండలాల్లో పొదుపు సంఘాలకు మంజూరైన రుణాలను గ్రూప్‌ లీడర్లు స్వాహా చేస్తున్నట్లు అధికారుల తనిఖీల్లో వెల్లడైనట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇటీవల రూణాల వసూళ్ళకు బ్యాంకు అధికారులు, మండలస్థాయి అధికారులు గ్రామాలలో పర్యటించగా ఈ తనిఖీలలో పలు ఆసక్తికరమైన విషయాలు బట్టబయలు కావడంతో అధికారులు ఆశ్చర్యపోయారు. గ్రూప్‌ సంఘాల అధ్యక్షులు కొందరు బినామీ స్థానికేతరుల పేర్లతో లక్షలాది రూపాయల రూణాలు పొందినట్లు గుర్తించారు. అంతేకాకుండా గ్రూపు సంఘాల అధ్యక్షులు కొందరు పావలా వడ్డీతో లక్షలాది రూపాయలు బినామీ పేర్లతో ప్రభుత్వ సొమ్ము స్వాహా చేస్తున్నారు. ఈ సొమ్ముతో ప్రైవేట్‌ వ్యక్తులకు నూటికి రూ.10 వంతున వడ్డీ వ్యాపారం చేసుకుంటునారని ఆరోపణలు ప్రజలలో వ్యక్తం అవుతున్నాయి.ఎక్కువగా ఉదయగిరి, సీతారామపురం, వరికుంటపాడు, దుత్తలూరు మండలాల్లో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నట్లు తనిఖీ అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ పొదుపు రూణాలలో మాయాజాలంలో వెలుగు సిసిల పాత్ర ఎక్కువగాఉందని గ్రూపు సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ విషాయలపై పలు సార్లు జిల్లా అధికారుల దృష్టికి తీసుకొని పోయిన్నప్పటికీ ప్రయోజనం లేదని పలు సంఘబ ంధాల సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఉదయగిరి పట్టణంలో కొందరు మహిళలు గ్రూపు లీడర్‌ కావడంతో ఆశ్రా దగ్గర నుంచి వితంతు, వృద్ధాప్య పింఛనులు సైతం బినామీ పేర్లతో వేలాది రూపాయలు స్వాహా చేస్తున్నవైనం వెలుగులోకి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. గ్రూపులీడర్‌లను మార్చకుండా సంఘమిత్ర బందాలకు ఎన్నికలు నిర్వహించకుండా మండల స్థాయి అధికారులైన సిసిలు కోఆర్డినేట్‌లు గ్రూపులీడర్‌లతో సంఘబంధాల అధ్యక్షులతో కుమ్మకై్క మహిళా గ్రూపులలో ఉండే నిరుపేదలను మోసం చేస్తూ వారికి ఎలాంటి రుణాలు అందజేయకుండా అన్నీ వారై ప్రభుత్వ సొమ్ము దోచుకుంటున్నారనే విషయాలు బట్టబయలు కావడంతో అటు అధికారులు ఇటు బ్యాంకు సిబ్బందికి ఏమి చేయాలో తెలియక తలపట్టుకొని ఉన్నట్లు తెలుస్తుంది.ఈ అవినీతిలో అందరికీ తలా కొంచం పాత్ర ఉండటంతో అధికారులు గోప్యంగా ఉంచినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా గ్రూపు సంఘాల అధ్యక్షులు బినామీ స్థానికేతరుల పేర్లతో లక్షలాది రూపాయలు పొంది బకాయిలు వసూలు కాకపోవడంతో అధికారులు విచారించగా ఇందులో రుణాలు పొందిన సభ్యులను చూపించకుండా సంఘాల అధ్యక్షులు గ్రూపు లీడర్లే చెల్లింపునకు కొంత గడువుకావాలని కోరుతున్నారని రుణాలకు సంబంధించి రికార్డులు వాటి వివరాలు లేవని అధికారుల తనిఖీలలో తేలినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే ఈ విధంగా ఉదయగిరి నియోజక వర్గంలో పొదుపు రుణాలలో ఎంతమంది పొదుపు గ్రూపు లీడర్లు వారి స్వార్ధానికి వినియోగించుకొన్నది ఇంకా వెలుగులోకి రావాల్సిఉందని ప్రజలు ఆరోపిస్తున్నారు. కావున ఇప్పటికైనా సంబంధిత జిల్లా అధికారులు స్పందించి పొదుపు గ్రూపులలో జరుగుతున్న అవినీతికి కళ్లెం వేయాలని ప్రజలు కోరుతున్నారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh