online marketing

Thursday, May 26, 2011

గుప్పెడు నీరు దొరికితే చాలు

ఉదయగిరి: మండల పరిధిలోని సున్నంవారిచింతలలో మంచినీటి కోసం ప్రజలు అల్లాడుతున్నారు. మంచినీరు లేక ఎక్కడికో వెళ్లవలసిన పరిస్థితి నెలకొందని ఆగ్రామస్థులు ఆరోపిస్తున్నారు. మంచి నీటి ట్యాంకు వున్నా నీరు అసలు రావటంలేదని సుమారు 150 కుటుంబాలకు పైగా వున్నాయని వారానికి ఒక్కరోజుకూడా నీరు రావటంలేదని మంచి నీటి ట్యాంకు వున్నా ఫలితంలేకపోయిందని ఆగ్రామ ప్రజలు తెలిపారు. ఇక్కడ ఒకే బోరింగు వుండటంవలన నీరు చాలక గుప్పెడు నీటికోసం దూరప్రాంతాలనుంచి తీసుకొని వస్తున్నారని మంచినీరు దొరక్క ఒక బిందెనీరు రూ.10లకు కొంటున్నామని మామల్ని పట్టించుకునే నాధుడే లేడని ఎన్నిసార్లు అధికారుల దెగ్గరలు ఈవిషయంపై వెళ్ళిన ఫలితం లేకపోయిందని మారోడును ఎవరికి చెప్పుకోవాలో అర్ధంకాక అయోమయ స్థితిలో వున్నారని ప్రజలు ఆరోపించారు. మంచినీటి ట్యాంకు కట్టి ఏడాది దాటుతున్నా ప్రజలకు మంచినీరు అందించలేకపోతుందని ఆగ్రామస్థులు పేర్కొన్నారు.మంచినీటి కోసం నానాకష్టలు పడుతున్నారని ఇప్పటికైన సంబంధిత అధికారులు చలించి మంచినీటి ఎద్దడిని తీర్చాలని గ్రామస్థులు కోరుతున్నారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh