online marketing

Thursday, April 5, 2012

జిల్లాలో సుమారు 30 లక్షల జనాభా ఉంటే అందులో సగానికి సగం మద్యపాన ప్రియులు...

మద్యం సేవించడం ఓ ఫ్యాషన్ అ యిపోయింది. సందర్భం ఏదైనా మం దు పార్టీ ఇవ్వడం సరదాగా మారింది. ఈ సరదానే మందుకు బానిస చేస్తోంది. 'మద్యపానం ఆరోగ్యానికి హానికరం' అని తెలిసినా మద్యం ప్రియుల సంఖ్య నానాటికి రెట్టింపు అవుతోంది. జిల్లాలో ఏటా రూ.600 కోట్ల అమ్మకాలు జరుగుతున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. జిల్లాలో సుమారు 30 లక్షల జనాభా ఉంటే అందులో సగానికి సగం మద్యపాన ప్రియులు ఉన్నట్టు సమాచారం. మందుబాబుల ఆరోగ్య పరిరక్షణకంటూ ఏకంగా మద్యపాన ప్రియుల సం ఘా న్నిరాష్ట్రంలోనే మొ దటిసారిగా జి ల్లా లో ఏర్పా టు చేయడం కూడా చర్చనీయాంశమైంది.

ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం అతిగా మద్యం సేవించడం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఆల్కహాల్ ప్రభావం కాలేయంపై పడి కణజాలాన్ని దెబ్బతీసే పరిస్థితి వస్తుంది. ప్రస్తుత సీజన్‌లో కల్లు అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. కల్లులో మత్తు శాతం పెంచేందుకు డైజీఫాం అనే మాత్రలను పొడి చేసి కలుపుతారు. 'మత్తు' సంగతి దేవుడెరుగు నాడీవ్యవస్థను దెబ్బతీయడంతోపాటు లైంగిక సామర్థ్యం కూడా తగ్గిపోతుంది. జిల్లాలో ఏటా మద్యపాన బానిస ల్లో 25వేల మందికిగా పైగా తీవ్రఅనారోగ్యానికి గురవుతుండగా ఇందులో మృతుల సంఖ్య వం దల్లో ఉంటున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

చిన్నారులపై వైట్నర్ అనాథలుగా మారిన కొందరు చిన్నారులు వైట్నర్‌కు బానిసలవుతున్నారు. రోడ్డుపై చిత్తుకాగితాలు ఏరుకుని వచ్చిన డబ్బుతో బుక్‌షాపులలో దొరికే వైట్నర్‌ను కొనుగోలు చేసి దానికి గుడ్డకట్టి గంజాయిలా పీలుస్తున్నారు. దీంట్లో ఉన్న ప్రమాదకర ఎ«థనాల్ వాయువు మత్తును కలిగించడంతో దానికి ఆ చిన్నారులు బానిసలవుతున్నారు. ఏడాది క్రితం వైట్నర్ మత్తులో నగరంలోని రాజీవ్ గృహకల్ప సమీపంలో నీటిలో మునిగి పిల్లలు చనిపోయిన సంఘటనలూ ఉన్నాయి.

ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం మద్యపాన ప్రి యుల్లో ఎక్కువగా పేద, మధ్యతరగతికి చెందిన వారే ఉంటున్నారు. కూలి పనులు చేసుకునే వారు తన సంపాదనలో 70 శాతం మద్యానికే ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. దీంతో ఆ కుటుంబాల ఆర్థిక పరిస్థితి అధ్వానంగా మారుతోంది. కొన్ని కుటుంబాలు అర్ధాకలితో పస్తులు ఉండాల్సిన దుస్థితి దాపురిస్తోంది. ఉద్యోగులదీ అదే పరిసితి. ప్రమాదాల సంఖ్య రెట్టింపు జిల్లాలో ఏటా సరాసరి 5,600 రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇందులో 60 శాతం ప్రమాదాలు మద్యం సేవించి వా హనాలు నడపడం వల్లే జరుగుతున్నట్లు వైద్యులు చెబుతున్నా రు. ఆల్కహాల్ ప్రభావం వల్ల జరిగే ప్రమాదాల కారణంగా త లకు తీవ్రగాయమై మతిభ్రమించిన బాధితులు నమోదవుతున్నారు.

ప్రభావం ఇలా.. * అతిగా మద్యం సేవించడం వల్ల గ్యాస్టిక్ సమస్యతో అనారోగ్యం ప్రారంభమవుతుంది. * కాలేయం చెడిపోయి పొట్ట ఉబ్బరం, రక్తం కక్కుకోవడం జరుగుతుంది. * కడుపులో పూత, గుల్లలు వస్తాయి. * చేతులు, పాదాలు తిమ్మెర్లు లేదా చచ్చుబడుతాయి. * కామెర్ల వ్యాధికి దారి తీస్తుంది. * మద్యం సేవించడం వల్ల ఆహారం అధికంగా తీసుకుని ఊబకాయానికి దారి తీస్తుంది. * లివర్ కేన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉంది.

* మతిభ్రమించే అవకాశం ఉంది. చికిత్స.. * మద్యానికి బానిసలై ప్రాథమిక దశలోనే వైద్యుడిని సంప్రదిస్తే తగిన వైద్యం అందుకోవచ్చు. వెంటనే తాగుడు ఆపేస్తే వచ్చే అనారోగ్య సమస్యలను అధిగమించేందుకు మందులు ఉన్నాయి. * వైద్యుడి పర్యవేక్షణలో మద్యపానంపై విరక్తి కలిగించే మందులు తీసుకోవాలి. * మద్యం బానిసలకు తగిన మానసిక పరివర్తన తెచ్చేందుకు డీహైడ్రేషన్ కౌన్సెలింగ్ సెంటర్లు అందుబాటులో ఉన్నాయి.

1 comment:

  1. మధ్యాంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుత పరిస్తితి యిదీ :

    పదహారు వయసున బీరు బాటిల్ పట్టేడు
    పది మూళ్ళ వయసుకి బార్ కి వెళ్లాడు
    పడితే లేవలేక... లేస్తే నడవ లేక పోయాడు
    పది నాలుగు వత్సరాలకే పోయాడు..

    ReplyDelete

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh