online marketing

Thursday, April 12, 2012

కాంగ్రెస్ పార్టీని త్వరలోనే భూస్థాపితం చేసేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారన్నారు.--మేకపాటి రాజమోన్‌రెడ్డి

నెల్లూరు; డక్కిలి ఉప ఎన్నికల తరువాత రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీ ఉండవని తాజా మాజీ ఎంపీ మేకపాటి రాజమోన్‌రెడ్డి అన్నారు. గురువారం డక్కిలి మండలం వెలికల్లులో మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూల మాలలు వేసి నివాలులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే వైఎస్ పథకాలు తిరిగి ప్రజలకు చేరువవుతాయన్నారు. త్వరలో జరగనున్న ఉప ఎన్నికల్లో 18 స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు విజయఢంకా మోగించడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. ఎన్నికల తరువాత రాష్ట్రంలో కనిపించే ఏకైక పార్టీ తమదే నన్నారు. కాంగ్రెస్ పార్టీని త్వరలోనే భూస్థాపితం చేసేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారన్నారు. కాంగ్రెస్, టీడీపీ లకు ఉప ఎన్నికల్లో అభ్యర్థులు దొరకని పరిస్థితి నెలకొందని మేకపాటి ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా స్థానిక టీడీపిీ నాయకుడు మచ్చాల నాగభూషణం తన అనుచరులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ కార్యక్రమంలో నాయకులు మేరిగ మురళీ, ఎ.వి రెడ్డి, పాల్గొన్నారు. వెంకటగిరిలో.. తిరుమల నుంచి వెంకటగిరి చేరుకొన్న మేకపాటి రాజమోహన్ రెడ్డికి వెంకటగిరిలో ఆపార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. స్థానిక క్రాస్ రోడ్డులో ఆపార్టీ కార్యకర్తలు రాజమోహన్‌రెడ్డికి బాణా సంచా కాల్చి స్వాగతం పలికారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh