online marketing

Monday, September 24, 2012

ఎస్2 మల్టిఫ్లెక్స్‌లోకి చిత్ర బృందం


నెల్లూరు : ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల చిత్రం ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చిత్ర యూనిట్ నెల్లూరులో సోమవారం సందడి చేసింది. చిత్ర విజయయాత్రను నెల్లూరు నుంచే ప్రారంభించారు. నగరంలో చిత్రం ప్రదర్శిస్తున్న ఎస్2 మల్టిఫ్లెక్స్‌లోకి చిత్ర బృందం ఒక్కసారిగా రావడంతో అభిమానులు కేరింతలు కొట్టారు. దర్శకుడు శేఖర్ కమ్ములతో పాటు చిత్రంలో నాగరాజు పాత్రధారి సుధాకర్, అభి(కౌషిక్), శ్రీను(అబుజిత్), సురేష్ (సంజీవ్) హాల్‌లో ప్రేక్షకుల మధ్య సందడి చేశారు. సినిమాలోని డైలాగ్స్ చెబుతూ ఆకట్టుకున్నారు. 

శేఖర్ కమ్ముల మాట్లాడుతూ సినిమా ఎలా ఉందంటూ అడిగిన ప్రశ్నకు బాగుందని యువత నుంచి కేరింతలతో సమాధానం వచ్చింది. నెల్లూరు నుంచి విజయయాత్రను ప్రారంభించడం సంతోషంగా ఉందని శేఖర్ కమ్ముల అన్నారు. యువత తమ జీవితాలను సంతోషంగా గడపాలని సూచించారు. అభిమానులు ఆటోగ్రాఫ్‌ల కోసం ఎగబడ్డారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిబ్యూటర్లు వెంకటరెడ్డి, బుజ్జి, పురప్రముఖులు ఉదయభాస్కర్, బట్టేపాటి నరేంద్ర, కామేశ్వరరావు, శివ, ఎస్2 మల్టిప్లెక్స్ యాజమాన్య బృందం పాల్గొన్నారు. 

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh