online marketing

Monday, December 13, 2010

వెంకటేశ్వరపురం సమస్యలపై బిజెపి ఆరా....

నెల్లూరు‌:నగరంలోని 1,50 డివిజన్‌ పరిధిలోని ప్రాంతాల్లో బిజెపి జిల్లా అధ్యక్షులు కర్నాటి ఆంజనేయరెడ్డి పర్యటించి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆదివారం ఉదయం ఆయన మాజీ, కార్యకర్తలను కలిసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. ఆ ప్రాంత వాసులు వెంకటేశ్వరపురంలోని ప్రధాన కాలువల్లో గత 20యేళ్ళుగా పూడిక తీయలేదన్నారు. మసీదు, గుడి ప్రాంతాల్లో పందులతో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆయనకు తెలిపారు. మున్సిపల్‌ అధికారుల నిర్లక్ష్యంతో అనేక గుంతలతో, దోమలతోను, వానాకాలంలో బురదతోను జీవనం సాగిస్తున్నామని ఆ ప్రాంత వాసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి నేతలు చిలకపాటి శ్రీనివాసులు, జనార్దనరావు, జయచంద్ర, భాషా, శ్రీనివాసుల గౌడ్‌, బండారు శ్రీనువాసులు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh