online marketing

Thursday, February 2, 2012

తెలుగుదేశం పార్టీ సత్తా ఏమిటో రానున్న ఉప ఎన్నికలలో...

కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం అభిమాన కేంద్రమైన తెలుగుదేశం పార్టీని గెలిపించి తద్వారా పార్టీ ప్రతిష్టను పెంచి నల్లపురెడ్డికి తన బాధ్యతను గుర్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలుగుదేశం జిల్లా అద్యక్షుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఇందుకూరుపేట మండలం బుధవారం రోడ్డు షో నిర్వహించి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రసన్న వైఖరిని తీవ్రంగా విమర్శించారు. తెలుగుదేశం పార్టీ సత్తా ఏమిటో రానున్న ఉప ఎన్నికలలో బట్టబయలవుతుందని ఆయన తెలిపారు. తెలుగుదేశం పార్టీ ద్వారా గెలిచి పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ప్రసన్నకుమార్‌రెడ్డికి పార్టీ ప్రతిష్ట చులకనైపోయిందని ఆయన పేర్కొన్నారు. ప్రజలు వాస్తవాలు తెలుసుకుని ప్రసన్నకు తగిన గుణపాఠం చెబుతారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మండలాధ్యక్షుడు కైలాసం ఆదిశేషారెడ్డి, ఇందుకూరుపేట మండలాధ్యక్షుడు వీరేంద్రనాయుడు, రమణప్పనాయుడు, తెలుగుదేశం కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh