online marketing

Saturday, March 19, 2011

ఇంటర్‌లో 9 మంది డీబార్‌


నెల్లూరు ‌:జిల్లాలో జరుగుతున్న ఇంటర్మీడియట్‌ పరీక్షల్లో శుక్రవారం జరిగిన ప్రధమ సంవత్సరం పరీక్షలో 9 మంది విద్యార్థులు డీబార్‌ అయ్యారు. నెల్లూరు స్టోన్‌హౌస్‌పేట శ్రీచైతన్య జూనియర్‌ కళాశాలలో కామర్స్‌-1, శ్రీసర్వోదయ కళాశాలలో కెమిస్ట్రీ-2, కామర్స్‌-1, ధనలక్ష్మీపురం చైతన్య జూనియర్‌ కళాశాల బిసెంటర్‌లో కామర్స్‌-1, కోట ఎపిఎస్‌డబ్ల్యుఆర్‌ జూనియర్‌ కళాశాలలో కెమిస్ట్రీ-1, ఆత్మకూరు షిర్దీసాయిరాం జూనియర్‌ కళాశాలలో కామర్స్‌-1, ఉదయగిరి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల బిసెంటర్‌లో కెమిస్ట్రీ-2 మాల్‌ప్రాక్టీస్‌ కేసులు నమోదయ్యాయి. 28,747 మంది రెగ్యులర్‌ విద్యార్థులకుగాను 27,047 మంది, 620 మంది ఒకేషనల్‌ విద్యార్థులకుగాను 532 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. మొత్తం 29,367 మందికిగాను 1,783 మంది విద్యార్థులు గైర్హాజరు కావడంతో 27,584 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. పరీక్షల జిల్లా కన్వీనర్‌, ఆర్‌ఐఒ జి.వరప్రసాద్‌, కమిటీ సభ్యులు సుబ్బారావు, హరిబాబు, వివిధ స్క్వాడ్‌ బృందాలు 61 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశాయి

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh