online marketing

Saturday, March 10, 2012

ప్రసన్నకు 60 వేల ఓట్ల మెజారిటీ వస్తే 100 ఎకరాలు రాసిస్తానని, లేదంటే మేకపాటి ఇంజనీరింగ్ కళాశాలను రాసిస్తారా


నెల్లూరు : రాష్ట్రంలోని నేతల్లోకెల్లా నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అత్యంత స్వార్థపరుడని తెలుగు యువత జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పమిడి రవికుమార్‌చౌదరి, శింగంశెట్టి రవిచంద్ర విమర్శించారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం వారు విలేఖరులతో మాట్లాడారు. కోవూరు నియోజకవర్గంలో టీడీపీ ప్రభంజనం కొనసాగుతుందన్నారు.

ఈ ఎన్నికల్లో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి 18 వేల పైచిలుకు మెజారిటీతో గెలుస్తారని వారు జోస్యం చెప్పారు. ఇందులో ఒక్క ఓటు తగ్గినా తాము పార్టీ పదవులకు రాజీనామా చేస్తామన్నారు. ఆపరేషన్ ఆకర్షతో రూ.30 కోట్లకు అమ్ముడుపోయిన ప్రసన్నకు ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ప్రసన్నకు 60 వేల ఓట్ల మెజారిటీ వస్తుందని మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి చెబుతున్నారని, ఈ మెజారిటీ వస్తే తనకు ఉన్న 100 ఎకరాలు రాసిస్తానని, లేదంటే మేకపాటి ఇంజనీరింగ్ కళాశాలను రాసిస్తారా ? అని పమిడి సవాల్ విసిరారు. లక్ష్మిపార్వతి, జయప్రద, వాణివిశ్వనాధ్ వంటి వారు రాష్ట్రంలో కనుమరుగవడానికి ప్రసన్నతో ఉన్న సాన్నిహిత్యమే కారణమన్నారు. ప్రసన్న పెద్ద ఐరన్‌లెగ్ అని విమర్శించారు. ఈ సమావేశంలో తెలుగు యువత నాయకులు మండవ దినేష్, కొమ్మి రవీంద్రనాయుడు, శింగంశెట్టి మురళీమోహన్, నెల్లూరు మురళీ, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh