online marketing

Sunday, March 4, 2012

రాజశేఖర్‌రెడ్డిని ఆడ, మగ కాని ముఖ్యమంత్రి అని విమర్శించిన సందర్భాలున్నాయని, ప్రస్తుతం ఆయన బొమ్మను పెట్టుకుని ప్రజల్లోకి..

కోవూరు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా టిడిపి అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, పొలిట్‌బ్యూరో సభ్యుడు లాల్‌జాన్‌ బాషాతో కలిసి శుక్రవారం రాజుపాళెంలోని చంద్రబాబునగర్‌ కాలనీలో తన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రసన్నకుమార్‌రెడ్డి వెన్నుపోటుదారుడని, ఈ ఉప ఎన్నికలో ఆయనను ఇంటికి పంపించాలని ప్రజలను కోరారు. జగన్‌మోహన్‌రెడ్డి ఓదార్పు యాత్రల పేరుతో రాష్ట్రాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నారని, రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేదానికి 35 ఏళ్లు పట్టిందని, ఈయన ఒక ఏడాదికే ముఖ్యమంత్రి కావాలంటే వీలు కాదని ఆయన విమర్శించారు. ప్రసన్నకుమార్‌రెడ్డి వైఎస్‌ఆర్‌ పథకాలకు ఆకర్షితుడనయ్యానని పైకి చెప్పుకుంటూ రూ.30 కోట్లకు అమ్ముడుపోయాడని ఎద్దేవా చేశారు. ఇదే ప్రసన్నకుమార్‌రెడ్డి ఇందుకూరుపేటలో ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ రాజశేఖర్‌రెడ్డిని ఆడ, మగ కాని ముఖ్యమంత్రి అని విమర్శించిన సందర్భాలున్నాయని, ప్రస్తుతం ఆయన బొమ్మను పెట్టుకుని ప్రజల్లోకి వస్తున్నాడని, ఆయనను చిత్తు చిత్తుగా ఓడించాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా గతంలో టిడిపి ఎస్సీ సెల్‌ కార్యదర్శిగా పనిచేసిన కరకటా మల్లికార్జునరావు తన అనుచరులతో పార్టీలో చేరారు. వారిని కండువాలు వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh