online marketing

Monday, March 5, 2012

ఉప ఎన్నికల ఫలితాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కళ్లు తెరిపించేలా ఉండాలని వైఎస్‌ జగన్‌ పిలుపు


వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోవూరు నియోజకవర్గంలోని కొడవలూరు మండలంలో ఎన్నికల ప్రచారానికి బయలుదేరారు. కోవూరు ఉప ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు ఆయన హైదరాబాద్ నుంచి సింహపురి ఎక్స్ ప్రెస్ లో నెల్లూరు జిల్లా కావలి చేరుకున్నారు. కావలిలోని ఆర్ఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈరోజు ఉదయం జగన్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం ఆయన ప్రచారానికి బయల్దేరారు.
ఉప ఎన్నికల ఫలితాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కళ్లు తెరిపించేలా ఉండాలని వైఎస్‌ జగన్‌ పిలుపు ఇచ్చారు. రైతులు, రైతు కూలీలకు అండగా అవిశ్వాసానికి ఓటేసిందుకు వచ్చిన ఉప ఎన్నికలు విలువలు, విశ్వసనీయతకు అద్దం పట్టాలన్నారు. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని మంత్రులు మోహరిస్తారని అనురాగం, ఆత్మీయతలను కొనడానికి చూస్తారని జగన్‌ అన్నారు. ప్రలోభాలకు లోనవకుండా ఢిల్లీ పెద్దల కళ్లు తెరిపించేలా తీర్పు చెప్పాలని జగన్‌ కోరారు. కోవూరు నియోజకవర్గంలో ప్రసన్నకుమార్‌రెడ్డితో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh