online marketing

Sunday, March 11, 2012

రికార్డు డ్యాన్స్‌లో ఆనం వివేకానందరెడ్డి కూడా డ్యాన్స్‌ చేసుంటే ఇంకా బాగుండేదని - రోజా


దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రజల గుండెల్లో స్థిర స్థాయిగా నిలిచిపోయారని వైఎస్‌ఆర్‌సిపి మహిళా నేత రోజా అన్నారు. ఆదివారం కోవూరు నియోజకవర్గంలోని బుచ్చిరెడ్డిపాళెం, రేబాల గ్రామంలో జరిగిన రోడ్‌షోలో ఆమె ప్రజలనుద్దేశించి మాట్లాడారు. వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ఎంతో ఉన్నతాశయంతో పేద ప్రజల ఆరోగ్యాన్ని మెరుగు పరచేందుకు ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టారని, అదే నేడు పేద ప్రజలకు దేవుని ప్రసాదం లాగా తయారైందని, అందుకే వైఎస్‌ఆర్‌ను ప్రజలు నేటికీ దేవుడిలాగా తలచుకుంటున్నారని, వైఎస్‌ఆర్‌ సేవలను మరోసారి ప్రజలకు గుర్తు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాజుపాళెం బహిరంగసభలో పాల్గొన్న సందర్భంలో రికార్డు డ్యాన్స్‌ వేయించారన్నారు. ఈ రికార్డు డ్యాన్స్‌లో ఆనం వివేకానందరెడ్డి కూడా డ్యాన్స్‌ చేసుంటే ఇంకా బాగుండేదని ఆమె వ్యంగ్యంగా అన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి సిఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆమె తెలిపారు.

అందుకే జగన్‌ ఎక్కడకు వెళ్లినా ప్రజలు ఎనలేని ఆదరణ చూపిస్తూ ఆప్యాయతగా చిన్నా, పెద్దా తేడా లేకుండా మీకు మేము అండగా ఉంటాము నాయనా అంటూ దీవిస్తున్నారన్నారు. ప్రస్తుతం జరుగనున్న ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థి పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డిని ఓడించేందుకు ఆనం సోదరులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డితో చేతులు కలిపారని ఆమె ఆరోపించారు. పోలంరెడ్డి ఓడిపోతే సిఎంకు అపఖ్యాతి అంటకట్టి సిఎం సీటును ఆనం అధిరోహించవచ్చునన్న ఉద్దేశ్యంతోనే ఈ ద్రోహానికి ఒడికట్టారని ఆమె దుయ్యబట్టారు. అందుకే నిత్యం ఆనం సోదరులు సోమిరెడ్డితో రహస్య మంతనాలు జరుపుతున్నారని ఆమె ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

జగన్‌మోహన్‌రెడ్డి స్థాపించిన వైఎస్‌ఆర్‌సి పార్టీకి కోస్తా, రాయలసీమ, ఆంధ్ర ప్రాంతంలో మొట్టమొదటిసారిగా ప్రసన్నకుమార్‌రెడ్డి అసెంబ్లీలో అడుగు పెట్టాలంటే మీరు జగన్‌మోహన్‌రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ప్రసన్నకుమార్‌రెడ్డిన అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె ప్రజలను అభ్యర్థించారు. ప్రసన్నను గెలిపిస్తే జగన్‌మోహన్‌రెడ్డి గెలిపించినట్లేనని, ఎవరు ఎన్ని ప్రలోభాలు పెట్టినా వారి మాటలు నమ్మవద్దని, ప్రసన్న గెలవడం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh