online marketing

Friday, March 16, 2012

పిల్లలు పుట్టలేదన్న అక్కసుతో నమ్మించి అడవికి తీసుకువెళ్లి భార్యను హతమార్చాడు


డక్కిలి : కడదాకా తోడుంటానని మూడు ముళ్లు వేసిన చేతులో ఆమె గొంతును నులిమేశాయి. పిల్లలు పుట్టలేదన్న అక్కసుతో నమ్మించి అడవికి తీసుకువెళ్లి భార్యను హతమార్చాడు. డక్కిలి మండలం సం గనపల్లెలో చోటు చేసుకున్న ఈ సంఘటన స్థానికంగా సంచలనం రేపింది. వివరాల్లోకి వెళితే.. సంగనపల్లికి చెం దిన తూమాటి రమణయ్య సైదాపురం మండలం అనంతమడుగు దళితవాడకు చెందిన కృష్ణమ్మను 15 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి అయిన నాటి నుంచి ఎంతో అన్యోన్యంగా ఉన్న వీరు కొంతకాలంగా గొడవపడేవారు. రెండేళ్ల క్రితం నెల్లూరులోని ఓ రైస్‌మిల్లు లో పని చేస్తూ కాపురం అక్కడకు మా ర్చారు.

వారం రోజుల క్రితం సంగనపల్లికి చేరుకున్న దంపతులు పిల్లలు పుట్టలేదనే విషయమై గొడవపడినట్లు స మాచారం. ఇదేవిషయమై గతంలోను గొడవ జరగడంతో కృష్ణమ్మ పుట్టినింటికి వెళ్లడం, పెద్దల పంచాయితీతో తిరిగి కాపురానికి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం తీర్థంపాడులోని బంధువుల ఇంటికి వారు వెళ్లరు. ఇదే అవకాశంగా భావించిన రమణయ్య కృష్ణమ్మను సమీపంలోని అడవికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెను గొం తు నులిమి హతమార్చాడు. తర్వాత గ్రామానికి చేరుకున్న రమణయ్య తన భార్య కనిపించడం లేదంటూ బంధువు లతో కలిసి గాలించాడు.

సాయంత్రం గ్రామం విడిచి పరారయ్యాడు. శుక్రవారం ఉదయం పశువుల కాపర్లు కృష్ణమ్మ శవమై ఉండటాన్ని గమనించి గ్రామస్థులకు తెలిపారు. సమాచారం అందుకున్న రాపూరు సీఐ అబ్దుల్‌కరీం, ఎస్ఐ వెంకట్రావ్ సంఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృత దేహాన్ని ఆసుపత్రికి తరలించి, ఎస్సై కేసు నమోదు చేసుకున్నారు. ఘటనాస్థలంలో మృతదేహం పడిఉన్నతీరును బట్టి రమణయ్యే హత్య చేసిఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh