online marketing

Sunday, March 11, 2012

ఎవరు కొడితే మైండ్ బ్లాకవుతుందో అతడే జగన్: రోజా


నెల్లూరు: ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే 2014లోనూ రాష్ట్రంలో పునరావృతం కానున్నాయని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కేంద్ర కార్యనిర్వాహక కమిటీ సభ్యురాలు రోజు ఆదివారం అన్నారు. ఆమె శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని రేబాల గ్రామంలో విలేకరులతో మాట్లాడారు. అవినీతి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రజలు ఘోర పరాజయాన్ని అందించారని ఆమె అన్నారు. రాష్ట్రంలో 2014లో జరిగే ఎన్నికల్లోనూ ప్రజలు ఇలాంటి తీర్పునే ఇస్తారని అన్నారు. కాంగ్రెసు పార్టీ గల్లంతు కావడం ఖాయమన్నారు. ఓటమిని హుందాగా అంగీకరించలేక నిత్యావసరాల ధరలు పెరిగినందునే ప్రతికూల ఫలితాలు వచ్చాయని ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ చెప్పడం సిగ్గు చేటు అన్నారు.

ఎమ్మార్ ప్రాపర్టీస్ విషయంలో అసలైన దొంగ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడేనన్నారు. తమ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి లభిస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక చంద్రబాబు పిచ్చెక్కిన వాడిలా ప్రవర్తిస్తున్నారని అన్నారు. ఎవరు కొడితే మైండ్ బ్లాక్ అవుతుందో అతడే జగన్మోహన్ రెడ్డి అని, కడప పులివెందుల ఉప ఎన్నికలే ఇందుకు నిదర్శనమని ఆమె అన్నారు. కొవూరులో టిడిపి, కాంగ్రెసుకు డిపాజిట్లు కూడా దక్కవన్నారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh