online marketing

Monday, December 28, 2009

జిల్లాలో కరువైన శాంతి భద్రతలు

నెల్లూరు (క్రైం) మేజర్‌న్యూస్‌: ఏడాది కాలంలో జిల్లా వ్యాప్తంగా పోలీసుల పనితీరు నిర్వీర్యమైంది. అధికారులు గణాంకాల్లో మాత్రం గత ఏడాది కంటే ఈ ఏడాది నేరాలు తగ్గుముఖంలో ఉన్నాయని సొంతడబ్బా కొట్టుకుంటున్నారు. వాస్తవానికి జిల్లాలో శాంతి భద్రతలు విఘాతం కలిగి ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. అధికారులు మాత్రం రాజకీయ నాయకుల కనుసన్నలలో తమ ఉద్యోగాలను చేశారే తప్ప వాస్తవంగా చేయాల్సిన డ్యూటీలు చేయలేకపోయారు. కొద్దిమంది అధికారులు పూర్తిగా రాజకీయ నాయకుల అడుగులకు మడుగులొత్తడంలోనే మునిగి తేలారు. మరికొంతమంది అధికారులు అటు రాజకీయ నాయకుల, ఇటు తమ అధికారుల మన్ననలను పొందడానికి చేయలేని పనులు కూడా చేస్తూ మునిగి తేలారు. జిల్లాలో పేరుకుపోతున్న కేసులనుగాని, దొంగలను పట్టుకోవడంలో చూపించాల్సిన నైపుణ్యాన్ని ప్రదర్శించడంలేదు. విచ్చలవిడిగా జిల్లాలో పెరిగిపోయిన వైట్‌కాలర్‌ నేరాలను అసలు పట్టించుకోవడమే మానేశారు. దీనివలన స్టేషన్‌లలో మొక్కుబడిగా రిజిష్టర్‌ అవుతున్న దొంగతనాలు వంటి వాటిమీద మాత్రమే చర్యలుంటున్నాయి తప్ప, వైట్‌కాలర్‌ నేరగాళ్లను పట్టించుకోకపోవడంతో వారి ఆగడాలకు అంతేలేదు. అవినీతి విపరీతంగా పెరగడంతో పోలీస్‌ శాఖలోని అధికారులు పలువురు ఏసీబీ అధికారులకు చిక్కి శాఖ పరువును వీధిన పెట్టారు. నగరంలోని పలు స్టేషన్‌లలో ఎస్‌ఐ, సిబ్బందికి మధ్య వివాదాలు చోటుచేసుకుని సిబ్బందిని, ఎస్‌ఐని బదిలీలు చేసే పరిస్థితి ఏర్పడడం చూస్తే క్రమశిక్షణ ఏపాటిదో అర్థమవుతుంది. ఒక స్టేషన్‌ నుంచి మరొక స్టేషన్‌కి బదిలీ అయ్యే ఎస్‌ఐ తనతోపాటు తన ఐడి పార్టీలను కూడా బదిలీ చేయించుకుని స్టేషన్‌కు పోవడం వంటి సంఘటనలు పలువురిని బాధ కలిగించాయి. గత ఏడాది డెకాయిటీలు నాలుగు ఉండగా, ఈ ఏడాది రెండుగా ఉన్నాయి. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో జిల్లా పోలీసు ఎన్నికల బందోబస్తు నిర్వహణలో సత్ఫలితాలు సాధించారు. అక్కడక్కడా చిన్నపాటి సంఘటనలు తప్ప మరెక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగలేదు.
పెరిగిన ఛీటింగ్‌ కేసులు, కిడ్నాప్‌లు, తగ్గిన చోరీలుజిల్లాలో ఛీటింగ్‌ కేసులు గత ఏడాది 127 నమోదు కాగా ఈ ఏడాది 155 నమోదైనాయి. అదేవిధంగా కిడ్నాప్‌లు గత ఏడాది 39 నమోదు కాగా, ఈ ఏడాది 53 కేసులు నమోదైనాయి. దొంగతనాలు దాదాపు గత ఏడాది 264 నమోదు కాగా, ఈ ఏడాది 179 నమోదైనాయి. గత ఏడాది చోరీ జరిగిన ఆస్తి రి వరీ విషయంలో పోలీసులు సరిగా స్పందించలేదు. గత ఏడాది సుమారు రూ.3 కోట్ల విలువైన సొమ్ము చోరీ కాగా ఈ ఏడాది కోటి రూపాయలు సొమ్మును రికవరీ చేయడానికి పోలీసులు కష్టపడాల్సి వచ్చింది. ఇంటలిజెన్స్‌ ఎస్‌ఐ ఇంట్లోనే దాదాపు రూ.20 లక్షల వరకు మాగుంటలేఅవుట్‌లో చోరీ అయినా రికవరీలో ఇంతవరకు అతీగతీ లేదు.
పెండింగ్‌ కేసులు ముమ్మరం జిల్లాలోని పలు స్టేషన్లలో పెండింగ్‌ కేసులు ముమ్మరంగా ఉన్నాయి. ప్రత్యేకంగా ఈ ఏడాది 60కి పైనే మర్డర్‌ కేసులు నమోదయ్యాయి. బాలాజీనగర్‌ స్టేషన్‌ పరిధిలోని హైవేపై తల్లి, బిడ్డను హత్య చేసి గోనె సంచుల్లో పెట్టి పారవేసి నేటికి ఏడాది అయినా నిందితులను అరెస్ట్‌ చేయడంలో అతీగతీ లేదు. నెల్లూరులోని ఆత్మకూరు బస్టాండు వద్ద వివాహితను కిడ్నాప్‌ చేసి ఆటోలో తీసుకెళ్లి గ్యాంగ్‌రేప్‌ చేసిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగింది. దీనిపై హోం మంత్రి నుంచి అధికారులకు చీవాట్లు పడడంతో నిందితులను అరెస్ట్‌ చేసి జైలుకు పంపి అధికారులు కొద్దిపాటి ఉపశాంతిని పొందారు. ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదులో గత ఏడాది 102 నమోదు కాగా, ఈ ఏడాది 135 నమోదై ఫైళ్లు పెండింగ్‌లో పేరుకుపోయాయి. అదేవిధంగా వేధింపుల కేసులు విపరీతంగా జిల్లా వ్యాప్తంగా నమోదయ్యాయి. వీటిని పరిష్కరించడంలో స్టేషన్లలో పంచాయతీలు నిర్వహిస్తున్నారే తప్ప కేసులు పరిష్కరించడంలో సరైన నిర్ణయం తీసుకోలేదు.
రక్తం చిందిన హైవేగత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది రోడ్డు ప్రమాదాలు విపరీతంగా జరిగాయి. గత ఏడాది సుమారు 1700 వరకు నమోదై 500 మంది దుర్మరణం చెందారు. ఈ ఏడాది 2000 పైచిలుకు రోడ్డు ప్రమాదాలు జరిగి సుమారు 600 మంది వరకు దుర్మరణం పాలయ్యారు. గత నెల చింతారెడ్డిపాళెం వెళ్లే హైవే క్రాస్‌రోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 7 మంది చిత్తూరు జిల్లాకు చెందిన డ్రైవర్‌ ఒకరు దుర్మరణం చెందడం పలువురిని కలచివేసింది. బిట్రగుంట వ ద్ద పోలీసులు దొంగలను పట్టుకోవడంలో జరిగిన ఛేజింగ్‌ సమయంలో హైవేపై పలువురు పోలీసులు దుర్మరణం చెందడం పోలీస్‌ శాఖలో బాధను కలిగించింది.
పెరిగిన ద్విచక్ర వాహనాల చోరీ, దొంగనోట్ల చెలామణిజిల్లాలోని పలు ప్రాంతాల్లో వాహనం నిలబెట్టి ఆదమరిస్తే వాహనం మాయం కావడం ఎక్కువయ్యాయి. ప్రతి రోజూ ఏదో ఒక చోట ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తున్నా వాటిని రికవరీ చేయడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారు. దీనికి తోడు పక్క రాష్ట్రాల నుంచి దొంగ నోట్లను తీసుకొచ్చి విచ్చలవిడిగా చలామణి చేస్తున్నప్పటికీ వాటిని అదుపు చేయలేకపోయారు. దీనికి తోడు బ్యాంకు ఎటిఎంలలో డబ్బులు డ్రా చేయాలంటేనే కస్టమర్లు భయాందోళనకు గురయ్యారు. అనేక బ్యాంకుల్లో దొంగనోట్లు ఎటిఎంల ద్వారా రావడంతో కస్టమర్లు భయపడ్డారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh