online marketing

Monday, December 28, 2009

నష్టాలను అధిగమించండి

సంతపేట (నెల్లూరు) మేజర్‌న్యూస్‌:ఇటీవల రాష్ట్రంలో ఏర్పడిన పరిస్థితుల ప్రభావంతో ఆర్టీసి భారీస్థాయి నష్టాల్లో ఉందని, వాటిని అధిగమించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను ఆర్టీసి మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎస్‌ఎస్‌పి యాదవ్‌ ఆదేశించారు. నెల్లూరు ఆర్టీసి మెయిన్‌ బస్టాండును ఆదివారం ఆయన తనిఖీ చేశారు. అంతకు ముందు ఆర్టీసి 1 డిపో గ్యారేజిలో పనిచేస్తున్న మెకానిక్‌లను ఉద్దేశించి పని విధానం సక్రమంగా ఉండే విధంగా చూడాలని ఆదేశించారు. అనంతరం టిక్కెట్‌ బుకింగ్‌ కౌంటర్‌ను పరిశీలించి పలు సూచనలను చేశారు. అక్కడ నుంచి బయలుదేరి పడుగుపాడులో ఉన్న రీజనల్‌ వర్క్‌షాపును సందర్శించారు. ఆయనతోపాటు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఎన్‌ఎస్‌సి. సాల్మన్‌రాజు, నెల్లూరు రీజనల్‌ మేనేజర్‌ పి.శేషగిరిరావు, ఛీఫ్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ ఎంవి.ప్రభాకర్‌రెడ్డి, 1 డిపో మేనేజర్‌ ఈగా భాస్కర్‌రెడ్డి, 2 డిపో మేనేజర్‌ పి.శీనయ్య అధికారులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh