online marketing

Monday, January 11, 2010

నిర్లక్ష్యం

- ఉదయగిరి మేజర్‌న్యూస్‌ : ఉదయగిరి నియోజక వర్గంలోని వివిధ శాఖల్లో ప్రభుత్వ వాహనాల వినియోగం మరమ్మతుల్లో భారీగా అవకతవకలు జరుగుతున్నాయి. లక్షలాది రూపాయల ప్రజాదనం దుర్వినియోగం అవుతోంది. శిథిలమైన వాహనాలు అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతోంది. ఈ వాహనాలను పట్టించుకొనే నాధుడే లేక ఎండకు ఎండి, వానకు తడుస్తూ తుప్పు పడుతున్నాయి. వెయ్యి రూపాయలు లోపు మరమ్మతుల ఖర్చయ్యే వాహనాలపై కూడా అధికారులు అశ్రద్ధ చూపుతున్నారు.అదేమిటంటే ప్రభుత్వ బడ్జెట్‌ విడుదల కావడంలేదని జిల్లా స్థాయి అధికారులు స్పందించడం లేదని మండల స్థాయి అధికారులు చెపుతున్నారు. అంతేకాకుండా రోజులు, సంవత్సరాల తరబడి వాహనాలు మూలన పడటంతో లక్షలాధి రూపాయల విలువ చేసి వాహనాలు మరమ్మతుల ఖర్చులు ప్రభుత్వానికి భారంగా పరణమిస్తున్నాయి. ఫలితంగా ఖర్చులు ప్రభుత్వానికి భారంగా పరిణమిస్తున్నాయి. దీంతో ప్రభుత్వానికి నష్టం వాటిల్లుతోంది. అంతేకాకుండా అటువంటి వాహనాలు పనికిరాని వస్తువుల జాబితాలో చేరిపోతున్నాయి. పనికి రాని జాబితాలో ఉదయగిరి మండల పరిషత్‌ కార్యాలయంలో జీపు, అంగన్‌వాడీ కార్యాలయంలోని ట్రక్కుట్రాలి, ఆర్‌అండ్‌బి కార్యాలయంలో తుప్పుపట్టిన ఇంజన్‌ ఆయిల్‌, అదేవిధంగా వింజమూరు రెవెన్యూ కార్యాయలంలో జీపు, ఇరిగేషన్‌ తదితర కార్యాలయాలలో ఉన్న వాహనాలు శిథిలావస్థలో కొట్టుమిట్టాడుతున్నాయి.కొత్త వాహనాలు లేవు : ప్రభుత్వ శాఖలకు కొత్త వాహనాలను కొనుగోలు చేసి ఇచ్చేందుకు ముందుకు రాని ప్రభుత్వం ప్రస్తుతం అరుగుతున్న వాహనాల నిర్వహణ బాధ్యతలనైనా సక్రమంగా నిర్వర్తించడం లేదు. సుమారు 35 సంవత్సరాల కిందట కొనుగోలు చేసిన వాహనాలను ఉపయోగిస్తుడటం వల్ల వాటి సామర్ధ్యం తగ్గి మర్మతులకు లక్షలాది రూపాయలు ఖర్చువుతున్నాయి. ఉదయగిరి నియోజక వర్గంలో వివిధ ప్రభుత్వ శాఖలకు సంబందించి 8 మండలాలకు 42 వాహనాలు ఉన్నాయి. వీటిలో 11 వాహనాలు ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్నాయి. 6 వాహనాలను వినియోగిస్తున్నారు. మిగిలిన 25 వాహనాలు అవినీతి అధికారులకు ఆవిరైనట్లు తెలుస్తోంది. వీటిలో ఎక్కువగా రెవెన్యూ, నీటి పారుదల శాఖ, ఆర్‌అండ్‌బి శాఖలకు సంభంధించినవి. ఇవి ఇప్పటి వరకు ఎవరి పరిధిలో ఉన్నాయో ఆశఖల వారికే తెలియడం లేదంటే ఆశ్చర్యకరంగా ఉంది. పని లేకుండానే డ్రైవర్లకు జీతం : ఉదయగిరి నియోజక వర్గంలో పలు మండలాల్లో పలు ప్రభుత్వ కార్యాలయాల్లో వాహనాలు లేకున్నా డ్రైవర్లకు ప్రభుత్వం జీతాలు మాత్రం చెల్లిస్తోంది. కొందరు డ్రైవర్లు అధికారుల ఇళ్ళల్లో పనులు చేస్తుండగా, మరి కొందరు కార్యాలయాల్లో గుమస్తా పనులు చే స్తున్నారు. కొందరు ఇటీవలనే ఉద్యోగ విరమణ చేశారు. నెలకు వేలాది రూపాయల జీతాలను డ్రైవర్లకు ప్రభుత్వం చెల్లిస్తోంది. వీరి గురించి జిల్లా స్థాయి అధికారులు కాని, ప్రభుత్వం కానీ పట్టించుకోవడం లేదు. అంతేకాకుండా పాత వాహనాలు మైలేజీ రావడం లేదు. వాహన మరమ్మతుల వ్యయంతో వేలాది రూపాయలు ఖర్చు పెడుతున్నట్లు రికార్డులు చెపుతున్నాయని సంబందిత శాఖల సిబ్బంది ఆరోపిస్తున్నారు. లక్షల అద్దె చెల్లింపు : ఉదయగిరి నియోజక వర్గంలో పలు మండలాల్లో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్న వాహనాలు మరమ్మతులకు గురి కావడం వాటి స్థానంలో అధికారులు అద్దె వాహనాలు తీసుకొని తిరుగుతున్నారు. ప్రతి నెల అద్దె వాహనాలకే ప్రభుత్వం లక్షలాది రూపాయలు చెల్లిస్తోంది. ప్రభుత్వం చెల్లించే ఒక నెల అద్దెలకు ఒకటి, రెండు నూతన వాహనాలు కొనుగోలు చేయవచ్చు. మూలనపడిన వాహనాలు వేలం వేయకుండా అలాగే వదిలేయడం వలన అవి పాత ఇనుముకు కూడా పనికి రాకుండా పోతున్నాయి. కావున ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పనికిరాకుండా పోతున్న వాహనాలను వేలం వే సి ఆ డబ్బుతో నూతన వాహనాలను కొనుగోలు చేయాలని ఈప్రాంత ప్రజలు కోరుతున్నారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh