
అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఈ తరహా వాహనాల్లో యథేచ్చగా మద్యంను, నగదును తరలిస్తున్నట్లు ఇతర పార్టీలకు చెందిన అభ్యర్థులు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నికలు జరుగనున్న బుచ్చిరెడ్డిపాళెం, కోవూరు, ఇందుకూరుపేట, కొడవలూరు, విడవలూరు కాగా ఈ ప్రాంతానికి సంబంధించి పోలీసుల చెక్ పోస్టులు బుచ్చిరెడ్డిపాళెం మండలానికి గాను దువ్వూరు గ్రామం వద్ద ఒకటి, జొన్నవాడ గ్రామం వద్ద ఒక చెక్పోస్టు, కోవూరుకు గాను వెంకటేశ్వరపురం వద్ద ఒకటి, రాజుపాళెం వద్ద ఒకటి ఇందుకూరుపేట మండలానికి గాను ఆరవ మైలు వద్ద రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో చెక్ పోస్టులను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చెక్ పోస్టుల వద్ద జిల్లా పోలీసుల తోపాటు ఇతర ప్రాంతాలకు సంబంధించిన పోలీసులను కూడా నియమించడంతో తనిఖీలు ఖచ్చితంగా జరుగుతాయన్న అభిప్రాయం తొలుత ఉన్నప్పటికి రాను రాను ఆ అభిప్రాయం కాస్తా మారి పోలీస్ తనిఖీలు అధికార పార్టీకి సంబంధించిన నాయకుల వాహనాలను తనిఖీలు నిర్వహించడంలో నిర్లక్ష్య ధోరణి అవలంభిస్తున్నట్లు ఆరోపణలు లేక పోలేదు.
ఏది ఏమైనప్పటికి పోలీసులు నిర్వహిస్తున్న తనిఖీల్లో కార్లను మాత్రమే టార్గెట్ చేస్తుండడంతో ఇప్పటికే ఇతర వాహనాల ద్వారా ఉప ఎన్నికలు జరుగుతున్న ఐదు మండలాలకి సంబంధించిన అన్ని గ్రామాలకు యథేచ్చగా నగదు, మద్యం ఇప్పటికే చేరిపోయిందన వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. మద్యాన్ని మాత్రం జిల్లా నుంచి ఎన్నికలు జరుగుతున్న మండలాలకు ట్రాక్టర్ల ద్వారా, మ్యాజిక్ ఆటోల ద్వారా చేరినట్లు సమాచారం. ట్రాక్టర్కు సంబంధించిన తొట్టిల్లో సగం వరకు మద్యం బాటిళ్ళను నింపి ఆపైన ఇసక నింపి తరలించినట్లు సమాచారం. ఏది ఏమైనప్పటికి ఎన్ని తనిఖీలు నిర్వహించిన ఎంత మంది సిబ్బంది అప్రమత్తంగా ఉన్నా జరుగనున్న ఉప ఎన్నికల్లో మద్యం, నగదు రాజ్యమేలుతుందనేది జగమెరిగన సత్యమే
No comments:
Post a Comment