online marketing

Wednesday, February 15, 2012

18,19 తేదీల్లో యువ న్యాయవాదులకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు..

నెల్లూరు : ఆలిండియా లా అకాడమి సౌజన్యంతో నిర్వహించే ఈ శిక్షణ కార్యక్రమంలో న్యాయసంబంధ విషయాలపై వెంకటాచలంలోని స్వర్ణభారత్ ట్రస్ట్‌లో ఈ నెల 18,19 తేదీల్లో యువ న్యాయవాదులకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్ల తెలిపారు. 

సీనియర్ న్యాయవాది, రాజ్యసభ సభ్యులు రామ్‌జఠ్మలానీ ముఖ్యఅతిథిగా పాల్గొంటున్నారని తెలిపారు. రాజ్యసభ సభ్యులు ఎం.వెంకయ్యనాయుడు సభాధ్యక్షత వహిస్తారన్నారు.

ఈ శిక్షణ శిబిరంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు కేసీ భాను, కేజీ శంకర్,ఎల్.నరసింహారెడ్డి,  సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఎల్.నాగేశ్వరరావు, హైకోర్టు సీనియర్ న్యాయవాది వి.పట్టాభి పాల్గొని న్యాయశాస్త్రంలోని పలు విషయాలపై అవగాహన కల్పిస్తారన్నారు.

అదేవిధంగా కమ్యూనికేషన్ స్కిల్స్, టైమ్ మేనేజ్‌మెంట్, యోగా, కంప్యూటర్లలో పలువురు ప్రోఫెసర్లు చే శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. 19తేదీ జరిగే ముగింపు కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి మన తెలుగు తేజం  జాస్తి చలమేశ్వర్ ప్రసంగిస్తారని తెలిపారు. పూర్తి వివరాలకోసం 98489 94569, 94404 25225 ఫోన్ నంబర్లును సంప్రదించాలని కోరారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh