online marketing

Wednesday, February 15, 2012

కావలి ద్విచక్ర వాహనం ఢీ , ట్రాలీ లారీని మినీలారీ వెనుక నుంచి ఢీ

కావలి : కడనూతల వద్ద రోడ్డు దాటుతున్న పర్రి లక్ష్మమ్మ అనే మహిళను ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. బుధవారం నెల్లూరుకు చెందిన ముజీర్‌, అతని మిత్రుడు కలిసి కావలికి ద్విచక్ర వాహనంపై వేగంగా వెలుతూ కడనూతల వద్ద అదుపుతప్పి లక్ష్మమ్మను ఢీకొట్టారు. 


ఈ సంఘటనలో లక్ష్మమ్మతోపాటు వాహనం నడుపుతున్న ముజీర్‌, అతని మిత్రుడు కూడా గాయపడ్డారు. వీరిని 108 వాహనంలో కావలిలోని ఓ ప్రవేట్‌ వైద్యశాలకు తరలించారు. ఈ నేపధ్యంపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.


చెనై్న నుంచి ఫవర్‌ప్లాంట్‌ సామాగ్రితో జార్ఖండ్‌ వెలుతున్న ట్రాలీ లారీని కడ నూతల వద్ద రోడ్డుకు ప్రక్కగా నిలిపి ఉండగా నెల్లూరు నుంచి విజయవాడకు ప్లాస్టిక్‌ సామాగ్రితో వెలుతున్న మినీలారీ వెనుక నుంచి ఢీకొట్టడంతో డ్రైవర్‌ రాఘవులు స్పల్పంగా గాయపడ్డాడు. బాధితుడ్ని 108 వాహనంలో కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh