online marketing

Sunday, February 12, 2012

చంద్రబాబు, సోనియా గాంధీ కాళ్లు కడిగి ఆ నీళ్లు..


రాష్ట్రంలో సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మ్యాచ్‌ ఫిక్సింగ్‌ అయ్యారని, అదేవిధంగా కోవూరు నియోజకవర్గంలో కాంగ్రెస్‌, టిడిపి కుమ్మకై్క తనను ఓడించాలని ఎన్ని కుయుక్తులు పన్నినా చివరకు ఉప ఎన్నికలో విజయం సాధిస్తానని కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇరుపార్టీలపై ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కిరణ్‌, చంద్రబాబు రాజకీయాలను మంత్రి డిఎన్‌ సమర్థించారన్నారు.



ఇటీవల కడపలో జరిగిన ఉప ఎన్నికలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కాంగ్రెస్‌కు ఓట్లు వేయాలని చెప్పడం ఆయన పరిపాలనకు నిదర్శనమన్నారు. నీచ రాజకీయాలు చేస్తున్న వ్యక్తులకు ఎవరికైనా ప్రజలు గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైందన్నారు. చంద్రబాబు, సోనియా గాంధీ కాళ్లు కడిగి ఆ నీళ్లు నెత్తిమీద చల్లుకున్నా కూడా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదన్నారు. ఆయన రాజకీయం చూస్తుంటే వ్యభిచారులకన్నా దీనంగా ఉందన్నారు. కెసిఆర్‌ చంద్రబాబుపై చేసిన విమర్శలను తాను సమర్థిస్తున్నానన్నారు.

చంద్రబాబు విషయాలన్నీ కెసిఆర్‌కు తెలుసునని పేర్కొన్నారు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి మానసికంగా హత్య చేసిన చంద్రబాబుకు ఆ పార్టీలో ఉండే హక్కే లేదన్నారు. ఎన్టీఆర్‌ కుటుంబంపై గౌరవం ఉంటే ఆయన వారసులకు పార్టీ పగ్గాలు అప్పగించాలే కాని ఇంతవరకు ఎందుకు అప్పగించలేదన్నారు. ఆయన అవసరం కోసం ఎన్నికల ప్రచారంలో జూనియర్‌ ఎన్టీఆర్‌, బాలకృష్ణలను పావుల్లాగా వాడుకుంటున్నారన్నారు. చంద్రబాబు పిచ్చిపట్టి వ్యవహరిస్తున్నాడని, సిఎం పీఠం కోసం రకరకాల వేషాలు వేస్తున్నాడని, అది ఎప్పటికీ జరగదన్నారు. వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని అణచివేయాలనే చంద్రబాబు, కిరణ్‌ల ఆటలు ప్రజలు సాగనివ్వరని తెలిపారు. జరగబోవు ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌పార్టీ విజయం సాధిస్తుందని తెలిపారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh