online marketing

Sunday, February 12, 2012

చంద్రబాబు నాలుకను కోస్తానంటూ ప్రకటనలు చేస్తున్న ఎమ్మెల్యే వివేకా


ఆనం సోదరులిద్దరికీ రాజకీయ భిక్ష ఆనాడు తెలుగుదేశం పార్టీ పెట్టబట్టే ఈ రోజు అధికార మదంతో స్థాయిని మరచి ఆరోపణలు చేస్తున్నారని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. తిన్నింటి వాసాలు లెక్కపెట్టే నైజం, తల్లిపాలు తాగి ఆ తల్లి రొమ్మునే గుద్దే నీచమైన రాజకీయ సంస్కృతివున్న రూరల్‌ ఎమ్మెల్యే వివేకానందరెడ్డి తన స్థాయిని మరచి చంద్రబాబు నాయుడుపై ఆరోపణలు చేయడం తగదన్నారు.


చంద్రబాబు నాలుకను కోస్తానంటూ ప్రకటనలు చేస్తున్న ఎమ్మెల్యే వివేకా నీవెంత మందికి నగరంలో నాలుకలు కోసావో తెలపగలవా అంటూ ప్రశ్నించారు.

నాడు చంద్రబాబునాయుడు పాలనలో ఎమ్మెల్యేలు గాని, మంత్రులు గాని ఎటువంటి అవినీతి అక్రమాలకు పాల్పడకుండా స్వచ్ఛమైన పరిపాలనను అందించారన్నారు. కాని నేడు కాంగ్రెస్‌ ప్రభుత్వం గడచిన ఏడున్నర సంవత్సరాల్లో ఎటు చూచినా అక్రమాలు, అవినీతి, భూకుంభకోణాల, స్కాములు, మద్యం సిండికేట్లు ఇలా నీచమైన అవినీతి పరిపాలన అందిస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం స్వచ్ఛమైన నేతగా జాతీయ స్థాయికి ఎదిగిన చంద్రబాబును విమర్శించేముందు వళ్లు దగ్గర పెట్టుకోవాలని ఆయన హితవు పలికారు. నగరంలో నేడు కార్పొరేషన్‌లో దోపిడీ రాజ్యమేలుతుందని ఆరోపించారు

వయసు పెరిగే కొద్దీ రాజకీయాల్లో హుందా తనాన్ని ప్రదర్శించాలని, అధికారం ఉంది కదా అంటూ స్థాయిని మరచి మాట్లాడితే తగిన దెబ్బ రుచి చూడాల్సివస్తుందని ఆయన హెచ్చరించారు. కాలం కలిసొచ్చి మూడుసార్లు జరిగిన ఎన్నికల్లో సైకిల్‌ గుర్తు పోటీ నుండి తప్పించుకున్నావు కాబట్టే నేడు విర్రవీగుతున్నావని, అదే సైకిల్‌ గుర్తును ఢీకొనిచూడు సత్తా ఏమిటో తెలుస్తుందన్నారు. నోటిని అదుపులో పెట్టుకుని మాట్లాడకపోతే తెలుగుదేశం పార్టీ తగిన బుద్ధి చెప్పే రీతిలో స్పందించాల్సి వస్తుంద ని సోమిరెడ్డి హెచ్చరించారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh