online marketing

Monday, February 13, 2012

ముఖ్యమంత్రే స్వయంగా సమాధానం చెప్పాలని నగర ఎమ్మెల్యే ముంగమూరు

నెల్లూరు  : జిల్లా తీర ప్రాంతాల్లో ఏర్పాటు కా నున్న థర్మల్ విద్యుత్ కేంద్రాలపై అ సెంబ్లీలో మంగళవారం చర్చకు రానున్నది. నగర ఎమ్మెల్యే ముంగమూరు థర్మల్ కేంద్రాల ఏర్పాటుపై అసెంబ్లీలో ప్రశ్నలు వేశారు.

మంగళవారం ఉద యం ఐదో ప్రశ్నగా దీనిపై చర్చ సాగనున్నది. ముఖ్యమంత్రే స్వయంగా సమాధానం చెప్పాలని ముంగమూరు పట్టుపట్టడంతో ఇది ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభుత్వం ఏ విధంగా స్పంది స్తో వేచిచూడాలి.

 నేడు అసెంబ్లీలో చర్చ నగర ఎమ్మెల్యే ముంగమూరు థర్మ ల్ కేంద్రాల ఏర్పాటుపై అసెంబ్లీలో చర్చ కు తెర తీశారు. 28 థర్మల్ కేంద్రాలు ఏర్పాటు జిల్లాలో 28 థర్మల్ కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. నాలుగు మండలాల్లో 13 కిలోమీటర్ల పరిధిలో బొగ్గుతో నడిచే ఈ కేంద్రాల వల్ల 34 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కా నుంది. నెల్లూరు జిల్లాలో నెలకొల్పదలచిన థర్మల్ విద్యుత్ కేంద్రాల సామర్ధ్యం ఎంత, వాటిని నెలకొల్పడం కోసం ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన కంపెనీల వివరాలు ఏమిటి, వాటి కో సం కేటాయించిన భూమి విస్తీర్ణం ఎంత, నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం మీనాక్షి విద్యుత్ థర్మల్ కేంద్రానికి కేటా యించిన అదనపు భూమి విస్తీర్ణం ఎం త? అన్న ప్రశ్నలను ఆయన అసెంబ్లీకి అందించారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh