online marketing

Monday, January 18, 2010

చిరస్మరణీయ నేత ఎన్‌టీఆర్‌


నెల్లూరు, మేజర్‌న్యూస్‌: తెలుగుజాతి ఉన్నంతకాలం దివంగత నేత ఎన్‌టీ రామారావు తెలుగు ప్రజల హృదయాల్లో నిలిచే ఉంటారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. అఖిల భారత ఎన్‌టీఆర్‌ అభిమాన సంఘ అధ్యక్షుడు, మాజీ మంత్రి తాళ్లపాక రమేష్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎన్‌టీఆర్‌ వర్ధంతి వేడుకలు సోమవారం స్థానిక నర్తకీ సెంటర్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన సోమిరెడ్డి మాట్లాడుతూ కళారంగంలో ఎన్నో విశిష్ట పాత్రలు పోషించి, ప్రతి పాత్రకు ప్రాణం పోసిన మహానటుడు ఎన్‌టీఆర్‌ అన్నారు. పౌరాణిక పాత్రల విషయంలో తానే దైవంగా ప్రజల చేత కొలవబడ్డ కళాకారుడు ఎన్‌టీఆర్‌ అని కొనియాడారు. పార్టీ పెట్టిన తొమ్మిది నెలల కాలంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ద్వారా భవిష్యత్‌, వర్తమానాల్లో ఎవరికి సాధ్యంకాని చరిత్రకు కారణమైనారని కీర్తించారు. ప్రజాసేవే పరమావధిగా భావించి వారి కోసమే చివరివరకూ జీవించిన వ్యక్తి ఎన్‌టీ రామారావు అన్నారు. రమేష్‌రెడ్డి మాట్లాడుతూ తన దైవం ఎన్‌టీఆర్‌ ప్రజల మధ్య భౌతికంగా లేకపోయినా, తమ మదిలో ఎప్పటికీ నిలిచే ఉంటారని అన్నారు. అనంతరం ఎన్‌టీఆర్‌ అభిమాన సంఘాల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, కిలారి వెంకటస్వామినాయుడు, కార్పొరేటర్లు ధర్మవరం సుబ్బారావు, వై.వి.సుబ్బారావు, సయ్యద్‌ మదార్‌, శింగంశెట్టి రవిచంద్ర, మురళీమోహన్‌రావు, ఎన్‌టీఆర్‌ అభిమాన సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh