online marketing

Sunday, January 17, 2010

సాహితీ నింగిలో ‘జాబిలి తునకలు’

నెల్లూరు (కల్చరల్‌) మేజర్‌న్యూస్‌:జిల్లా సాహితీ క్షేత్రంలో రచయిత్రి తన్నీరు శశికళ తొలి ప్రయత్నం ‘జాబిలి తునకలు’ కవితా సంపుటి ఆవిష్కరణ ఆదివారం స్థానిక టౌన్‌హాల్‌ రీడింగ్‌ రూమ్‌లో నిర్వహించారు. నెల్లూరు రచయితల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రపంచ తెలుగు సమాఖ్య రీజనల్‌ ఛైర్మన్‌ ఎన్‌.బలరామనాయుడు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. అచ్చమైన తెలుగు సాహిత్యం అంతరించిపోతున్న రోజుల్లో కవయిత్రి ఒక కవితాసంకలనాన్ని ఆవిష్కరించడం అభినందనీయమన్నారు. తెలుగు భాషా ఔన్నత్యాన్ని గుర్తించి తెలుగుజాతి గౌరవాన్ని కాపాడాలని ఆయన అన్నారు. ఒంగోలు సెట్‌నెల్‌ ఆఫీసర్‌ టి. మహబూబ్‌, నెరసం ప్రధాన కార్యదర్శి పాతూరి అన్నపూర్ణ, విశ్రాంత అధ్యాపకులు చీమకుర్తి వెంకటేశ్వరరావులు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. సమాజశ్రేయస్సు కోసం కవిత్వం తన కర్తవ్యాన్ని విస్మరించరాదని అభిప్రాయపడ్డారు. తొలి ప్రయత్నంలోనే మంచి సంపుటిని వెలువరించిన రచయిత్రిని వారు అభినందించారు. ప్రముఖ కవి, ఆడిటర్‌ చిన్ని నాగేశ్వరరావు సంపుటిని సమీక్షించారు. అనంతరం మాటేటి రత్నప్రసాద్‌ నేతృత్వంలో జరిగిన కవి సమ్మేళనంలో ఏటూరి నాగేంద్ర, జి.సుభద్రాదేవి, దగ్గుపాటి రాధాకృష్ణ, దామెర్ల గీత తదితరులు తమ కవితలను వినిపించారు. ఈ కార్యక్రమంలో బివి.నరసింహం, ములుగు శ్రీలక్ష్మి, సాహితీ ప్రియులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh