online marketing

Wednesday, November 25, 2009

వానాకాలంలోనే స్వర్ణముఖిలో నీరు

కోట : జిల్లాలో ప్రవహించే నదులలో స్వర్ణముఖి ఒకటి. బంగారు కొండలలు అని పేరున్న తిరుపతి కొండల్లో పుట్టిన ఈ నదికి స్వర్ణముఖి నది అని పేరు వచ్చింది. స్వర్ణముఖి రాయని కూడా పిలుస్తారు. అంటే శ్రావ్యమగు శబ్దాలు చేస్తూ వ్రహించే నది అని అర్ధం. ఒకప్పటి ఉత్తర ఆర్కాటు జిల్లాలోని చంద్రగిరి కొండలలలో ఈ నది పుట్టింది. అది పుట్టిన చోట ఒక పెద్ద హనుమంతుని విగ్రహం చెక్కి ఉంది.


అచ్చటి నుంచి ఈ నది ఒక చెరువు మీదుగా ప్రవహించి తూర్పు దిశగా ఉన్న శ్రీకాళహస్తి, పెళ్లకూరు, నాయుడుపేట, గునపాడు, గూడలి, వాకాడు, బాలిరెడ్డిపాళెం, పుచ్చలపల్లి మీదుగా గోవిందుపల్లి పట్టపుపాళెం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ నది పొడవు 99 మైళ్లు. కళ్యాణి, భీమా నదులు ఈ నదికి ముఖ్యమైన ఉప నదులు. వర్షాకాలంలో మినహా మిగిలిన సమయాల్లో స్వర్ణముఖిలో నీరు ఉండదు. వర్షాకాలంలో మాత్రమే ఈ నది ప్రవహిస్తుంది. ఈ నదినీరు కొన్ని చెరువుల ద్వారా, కాలువల ద్వారా వ్యవసాయానికి నీరు అందుతోంది. ఈ నదిలో రేణిగుంట వద్ద రాళ్ల కాలువ, కోట మండలం గూడలి వద్ద మామిడి కాలువలు కలుస్తాయి. కోట, వాకాడు మధ్యగల స్వర్ణముఖి నదిపై 2007లో బ్యారేజి కం బ్రిడ్జి నిర్మాణం జరిగింది

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh