online marketing

Tuesday, November 24, 2009

చెంగాల్‌రాజుకు ఘనంగా నివాళి

నెల్లూరు :ఇటీవల మృతి చెందిన చైతన్యప్రభ సంపాదకులు కూరపాటి చెంగల్‌రాజుకు పలువురు ఎమ్మెల్యేలు, జిల్లా ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు. మంగళవారం టౌన్‌హాల్‌ రీడింగ్‌ రూమ్‌లో జరిగిన సంస్మరణ సభలో నగర ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి, రూరల్‌ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, బిసి నాయకులు వంకి పెంచలయ్య, సిపిఐ జిల్లా కార్యదర్శి పముజుల దశరధరామయ్యలు అతిధులుగా పాల్గొని పత్రికా రంగానికి, పిగిలాం గ్రామానికి చెంగల్‌రాజు చేసిన సేవలను కొనియాడారు.ఎఐటియుసి జిల్లా అధ్యక్షులు వి.రామరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రూరల్‌ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి మాట్లాడుతూ పత్రికారంగానికి, సమాజ సేవకు జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తిగా చెంగల్‌రాజును అభివర్ణించారు. రాజకీయాలకు అతీతంగా ఆశయాలను కొనసాగించడంలో ఆయన జీవితాన్ని అంకితం చేశారని నివాళులర్పించారు. నెల్లూరు నగర ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి మాట్లాడుతూ నిస్వార్థంగా పత్రికారంగానికి సేవలందించి, పిగిలాం గ్రామసర్పంచ్‌గా ఆ గ్రామాభివృద్ధికి ఎంతగానో కృషి చేసిన చెంగల్‌రాజుకు నివాళులర్పించారు.వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ చెంగల్‌రావు ప్రజల కోసం, సమాజం కోసం పనిచేయడంలో తన ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోలేదన్నారు. పిగిలాం గ్రామాన్నే కాకుండా చుట్టుపక్కల గ్రామాలకు అభివృద్ధిపనులను విస్తరింపచేసిన వ్యక్తిగా ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో అరుణాగ్రాఫిక్స్‌ అధినేత, రిటైర్డ్‌ డిపిఆర్‌ఒ ఎం.వెంకటరత్నం, రచయిత అగస్త్యరెడ్డి వెంకురెడ్డిలతోపాటు చెంగల్‌రాజు స్నేహితులు, శ్రేయోభిలాషులు, బంధుమిత్రులు పాల్గొని చెంగల్‌రాజు ఆశయాలను కొనసాగిస్తామని ఆయన కుటుంబానికి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh