online marketing

Tuesday, November 24, 2009

ప్రమాదకరంగా విద్యుత్‌ తీగలు

సంగం:మండలంలోని చెన్నవరప్పాడు నుంచి మర్రిపాడుకు వెళ్లే కావలికాలువకట్ట రహదారిపై విద్యుత్‌తీగలు ప్రమాదకరంగా వేలాడుతున్నాయి. ఈ రహదారిలో ప్రతినిత్యం రైతులు వ్యవసాయ పనుల నిమిత్తం రాకపోకలు సాగిస్తుంటారు. పశువుల కాపరులు పశువులను తీసుకెళ్లుతుంటారు. మనిషి చేయెత్తితే అందేటట్లు తీగలు ఉండడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. విద్యుత్‌ శాఖాధికారులకు ఈ మార్గంలో విద్యుత్‌స్తంభాలను దగ్గరదగ్గరగా వేయించాలని పలుసార్లు విన్నవించినా ఫలితం లేకుండాపోయిందని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత ట్రాన్స్‌కో అధికారులు స్పందించి ఏ ప్రమాదం జరగకముందే తగు చర్యలు తీసుకోవాలని ఆ ప్రాంత రైతులు కోరుతున్నారు.

No comments:

Post a Comment

sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh